-
‘వేలు’ పెడితే కోట్లొస్తాయ్!
హైదరాబాద్ : నిమ్స్ ఆస్పత్రికి రావాల్సిన పెండింగ్ బిల్లులు ఓ జిరాక్స్ మిషన్ కారణంగా ఆగిపోయాయంటే నమ్మగలరా..! కానీ.. నమ్మాల్సిందే.. అక్షరాలా రూ.6 కోట్లు వివిధ సంస్థల నుంచి నిమ్స్కు రావాల్సి ఉన్నాయి. ప్రతిష్టాత్మకమైన నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స కోసం ఈహెచ్ ఎస్ స్కీం ద్వారా నిత్యం వివిధ ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు వచ్చి చికిత్స పొందుతారు. ఇలా చికిత్స పొందిన వారిలో ఆర్టీసీ, బీఎస్ఎన్ఎల్, సీజీహెచ్, సింగరేణి, రైల్వే, ఈఎస్ఐతో పాటు అసెంబ్లీ ఉద్యోగులు ఉన్నారు. వారికి అవసరమైన చికిత్స నిర్వహించిన అనంతరం అందు కు సంబంధించిన బిల్లులను నిమ్స్ యాజమాన్యం ఆయా సంస్థలకు పంపి వసూలు చేస్తుంది. జిరాక్స్ మిషన్ను బాగుచేసేందుకు కేవలం రూ.13వేలు మాత్రమే అవుతాయి. కానీ ఆస్పత్రి ఉన్నతాధికారులు పెద్దగా పట్టించుకోకపోవడం తో నాలుగు నెలలుగా అది మూలకు పడింది. ఎందుకీ దుస్థితి.. నిమ్స్ స్పెషాలిటీ బ్లాకులో క్రిడెట్ కలెక్షన్ యూనిట్ (సీసీయూ)ఉంది. ఆస్పత్రిలో ఈహెచ్ఎస్ ద్వారా చికిత్స పొందిన వివిధ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన బిల్లులను ఆయా సంస్థలకు పంపి వసూలు చేయాలి. అందుకు వారికి వచ్చిన బిల్లులను నకళ్లను తీసి క్లెయిమ్ కోసం పంపించాల్సి ఉంటుంది. అందుకోసం 2011లో జిరాక్స్ మిషన్ను నిమ్స్ యాజమాన్యం కొనుగోలు చేసింది. దీనికి సంబంధిత తయారీ సంస్థ ఇచ్చిన లైఫ్ 6 లక్షల కాఫీలకు మాత్రమే. అయితే సుమారు 10 లక్షల కాఫీలను తీసి మిషన్ అలసిపోయింది. నాలుగు నెలలుగా జిరాక్స్ మిషన్ మూలకు పడి ఉంటోంది. ఎమ్మార్డీ నుంచి క్రిడెట్ కలెక్షన్ యూనిట్కు రాని బిల్లుల ఫైళ్లు ఆస్పత్రిలో చికిత్స పొందిన వారి బిల్లులను ఎమ్మార్డీ యూనిట్కు పంపుతారు. అక్కడ నుంచి క్రిడెట్ కలెక్షన్ యూనిట్కు రావాల్సి ఉంది. అయితే చాలా ఫైళ్లు క్రిడెట్ కలెక్షన్ యూనిట్ రావాల్సిఉందని అక్కడ సిబ్బంది చెబుతున్నారు. ఎంతో విలువైన ఫైళ్లను నిర్లక్ష్యంగా సిబ్బంది నేలపై పడేశారు. వాటిలో కోర్టు కేసులకు సంబంధించిన మెడికో లీగల్ ఫైళ్లు ఉన్నాయి. అక్కడ ర్యాకులు లేకపోవడంతో.. వర్షం వస్తే ఫైళ్లు తడిసిపోతున్నాయి. -
వీడని సిక్ముడి
ఉద్యోగుల నుంచి డబ్బులు మినహాయించుకుంటున్నా అందని ఈహెచ్ఎస్ సేవలు ప్రైవేటు ఆస్పత్రుల డిమాండ్లపై మెట్టు దిగని ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఉద్యోగ సంఘాలు లబ్బీపేట : ఉద్యోగులకు నగదు రహిత వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన ఈహెచ్ఎస్ స్కీం ఇప్పట్లో అందుబాటులోకి వచ్చేలా లేదు. ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు ఆ స్కీంలోని పలు అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నెల రోజుల్లో పరిష్కరించాలని అల్టిమేటం జారీ చేసినా, ఆరోగ్యశ్రీ ట్రస్టు అధికారులు ఒక్క డిమాండ్ను కూడా అంగీకరించే పరిస్థితిలో లేరని తెలిసింది. అదేమంటే మీడియాకు లీకులు చేస్తున్నారంటూ ఆస్పత్రుల యాజమాన్యాలనే తప్పుపట్టే ధోరణిలో వ్యవహరిస్తుండడంతో పరిస్థితి మరింత జటిలమవుతోంది. దీంతో ఆ చిక్కుముడి ఇప్పట్లో వీడేలా లేదని ఉద్యోగులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, జిల్లాలోని ఆరోగ్యశ్రీ రిఫరల్ ఆస్పత్రుల్లో సేవలు పొందవచ్చునని ఇటీవల కలెక్టర్ ప్రకటించడంతో హెల్త్ కార్డు పట్టుకుని వెళ్లిన వారికి నిరాశే ఎదురవుతోంది. ప్రభుత్వానికి, ఆస్పత్రులకు మధ్య ఇంకా సరైన అంగీకారం కుదరకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తినట్లు ఉద్యోగ సంఘాల నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఆర్భాటంగా పథకాన్ని ప్రారంభించి, ఇప్పుడు అమలు చేయడంలో దోబూచులాట ఎందుకని పలువురు ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. వాస్తవమేమిటంటే... ఉద్యోగులకు ఈహెచ్ఎస్ సేవలు అందించడంలో ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. వాటిని పరిష్కరించే వరకూ సేవలు అందించబోమని తేల్చి చెప్పడంతో రీయింబర్స్మెంట్ పథకాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ ప్రభుత్వం పొడిగించింది. ఈలోపే ప్రైవేటు ఆస్పత్రులతో చర్చలు జరిపి పథకాన్ని అమలు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీంతో వారం రోజుల కిందట పలువురు ప్రైవేటు ఆస్పత్రుల ప్రతినిధులతో పాటు ఎన్జీవో నాయకులతో ఆరోగ్యశ్రీ ట్రస్టు అధికారులు చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ఆస్పత్రుల డిమాండ్ల విషయంలో ఎటువంటి అవగాహన కుదరలేదని తెలిసింది. మూడు నెలలుగా ఉన్న బకాయిలు మాత్రం విడతల వారీగా విడుదల చేసేందుకు నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే ఉచితంగా ఓపీ సేవలు, ఇన్వెస్టిగేషన్స్ చేయలేమని ఆస్పత్రులు తేల్చి చెబుతుండగా, ఈ విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. జీతాల్లో రూ.8 కోట్లు వసూలు ఉద్యోగులకు నగదు రహిత వైద్య సేవలు అందుబాటులోకి రాక ముందే ఉద్యోగుల జీతాల్లో మాత్రం పథకానికి సంబంధించి డబ్బుల కట్ చేశారని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో నాలుగు లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఉండగా, వారి నుంచి నవంబరు, డిసెంబరు నెల జీతాల నుంచి దాదాపు రూ.8 కోట్లు వరకూ జీతాల్లో కట్ చేశారని ఉద్యోగులు అంటున్నారు. పథకం అమలు చేయలేనప్పుడు డబ్బులు ఎందుకు మినహాయించారని పలువురు ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉద్యోగులకు నగదు రహిత సేవలు అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
శబరి మూవీ.. వరలక్ష్మి శరత్కుమార్పై డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్!
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
- అసభ్య వీడియోల వివాదం: స్పందించిన హెచ్డీ రేవణ్ణ
- ఈ పాపని గుర్తుపట్టారా? లేటెస్ట్ సెన్సేషన్.. రూ.100 కోట్ల మూవీ హీరోయిన్
- నామినేషన్ దాఖలు చేసిన రాజ్నాథ్ సింగ్
Advertisement