సంతకవిటి : నిన్నమొన్నటి వరకూ పచ్చగా ఉన్న మామిడిపల్లి గ్రామం నేడు మొండి గోడలతో శ్మశాన వాతావరణాన్ని తలపిస్తోంది. బుధవారం సంభవించిన ఘోర అగ్ని ప్రమాదంలో 60 ఇళ్లు కాలిపోయిన విషయం విదితమే. పూరిపాకల్లో తలదాచుకుంటూ జీవనం సాగిస్తున్న నిరుపేద కుటుంబాలు అగ్ని దేవడు ఆగ్రహంతో నేడు నిలువనీడలేక చెట్టుకొకరు..పుట్టకొక్కరయ్యారు. బాధితులంతా గ్రామంలోని షిర్డీసాయి మందిరం వద్ద, పలువురు ఇళ్ల గడపల్లోనూ తలదాచుకుంటున్నారు. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. కాలిపోయిన వస్తు సామగ్రిని చూసి రోదిస్తున్నారు.
నష్టం రూ. 60 లక్షలు
అగ్ని ప్రమాద నష్టం సుమారు రూ 60 లక్షలు ఉంటుందని రెవెన్యూ అధికారులు ధ్రువీకరించారు. ఇన్చార్జి తహశీల్దార్ బి.సూరమ్మ, డీటీ సాయికామేశ్వరరావు, ఆర్ఐ రామారావులు గ్రామానికి చేరుకుని కాలిపోయిన ఇళ్ల వివరాలను గురువారం సేకరించారు. ఆస్తినష్టం మీద ఆరాతీసి నివేదికలు రూపొందించుకున్నారు. బాధితులకు తక్షణ సాయం అందించేందుకు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో అరసవల్లి కొండలరావు, రాములమ్మ, బేపల దుర్గయ్య, గూనాపు సీతారాంలకు చెందిన నగదుతో పాటు తిండి నిమిత్తం ఉంచుకున్న ధాన్యం కాలిపోయినట్లుగా, మండల గన్నెప్పడు, బంటుపల్లి లక్ష్మణరావు, మాటూరు కాంతమ్మ, సరోజనమ్మ, సెగల్ల అప్పడు, నాగం, పైల లక్ష్మణ, సత్యం, సూర్యనారాయణ తదితరులుకు చెందిన ఎల్ఐసీ బాండ్లు, పిల్లల సర్టిఫికెట్లు,
నగదు కాలిపోయినట్టు రోదిస్తున్నారు. అరసవల్లి చిన్నోడు, బేపల చింతయ్య, నందయ్య, ఉంకుల లక్ష్మణరావు, ఆదినారాయణ, అరసవల్లి చిన్నారావు, బంటుపల్లి నారాయణరావు, పైల రామారావులు కూడా బాగా నష్టపోయారు. పి.రామప్పడు, చిన్నోడు, చిన్నారావులు ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరి ముగ్గురు ఇల్లు కాలిపోవడంతో నిలువ నీడలేక రోడ్డున పడ్డారు. అలాగే పి.అప్పలసూరి, అప్పమ్మ, రాములమ్మ, శంకుడు, సీతమ్మ వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరి ఇల్లు కూడా దహనం కావడంతో రోదిస్తున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది రజక, ఎస్సీ కుటుంబాలకు చెందిన నిరుపేదలే కావడంతో సాయం కోసం ఎదురు చూస్తున్నారు.
బంధువుల ఓదార్పు
బంధువులను పరామర్శించేందుకు వచ్చిన వారితో మామిడిపల్లి రద్దీగా మారింది.
ఓదార్పులు, రోదనలతో గ్రామంలో
విషాద ఛాయలు నెలకున్నాయి. షిర్డీ సాయి మందిరం వద్ద కొంతమంది బాధితులు తలదాచుకుంటున్నారు. ఇక్కడే భోజన ఏర్పాట్లను అధికారులు, ప్రజాప్రతినిధులు ఏర్పాటు చేశారు.
గూడుపోయింది గోడు మిగిలింది
Published Fri, May 22 2015 2:23 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కంగనా దుస్తులపైనే అందరి దృష్టి!
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్కు సర్వం సిద్ధం
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement