పేపర్ మిల్లులో అగ్నిప్రమాదం.. | Sakshi
Sakshi News home page

పేపర్ మిల్లులో అగ్నిప్రమాదం..

Published Sat, Mar 28 2015 8:23 AM

fire accident happened in seven hills paper mills

పెద్దాపురం : తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం రాగంపేటలోని ఓ పేపర్ మిల్లులో అగ్ని ప్రమాదం సంభవించింది. శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. రాగంపేటలోని సెవెన్ హిల్స్ పేపర్ మిల్లులో 500 టన్నుల వేస్ట్ మెటీరియల్ దగ్ధమైంది. అగ్ని ప్రమాదం కారణంగా రూ.50 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు.

Advertisement
Advertisement