కాకినాడ క్రైం, న్యూస్లైన్ : రాబందులు చూడడానికి అసహ్యంగా ఉంటాయి. అవి మృతకళేబరాలపై వాలి, వాటిని పీక్కు తినడం గగుర్పాటు కలిగిస్తుంది. చూడడానికి రాజహంసల్లా తెల్లటి దుస్తుల్లో ముచ్చటగా ఉండే కాకినాడ రంగరాయ వైద్య కళాశాల (ఆర్ఎంసీ) ఫోరెన్సిక్ విభాగంలో కొందరు వైద్యులు డబ్బుల కోసం ‘పీక్కు తినడం’లో రాబందులను మించిపోతున్నారని పలువురు గగ్గోలు పెడుతున్నారు.
రాబందులు కళేబరాలను ఆరగిస్తే.. ఆ వైద్యులు తమ ఆత్మీయుల మృతదేహాలను అడ్డం పెట్టుకుని తమ జేబులను నిర్దయతో కొల్లగొడుతున్నారని వాపోతున్నారు. శవపరీక్ష (పోస్టుమార్టం)కు రేటు నిర్ణయించి, అంత మొత్తం చెల్లిస్తే తప్ప శవాన్ని తాకేది లేదని తెగేసి చెపుతున్నారని ఆరోపిస్తున్నారు. వైద్యులు డిమాండ్ చేసినంత సొమ్ము సమకూర్చుకోలేని పేద, మధ్య తరగతి వారు అయినవారి మృతదేహాల కోసం రోజుల తరబడి ఫోరెన్సిక్ విభాగం వద్ద ‘జాగరణ’ చేయాల్సి వస్తోంది.
రాజమండ్రికి చెందిన ఓ యువకుడు గోకవరం-రంపచోడవరం రహదారిలో జరిగిన ప్రమాదంలో గాయపడ్డాడు. మెరుగైన చికిత్స నిమిత్తం ఈ నెల 10న కాకినాడలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకురాగా చికిత్స పొందుతూ 13న మృతి చెందాడు. అతడి మృతదేహానికి పోస్టుమార్టం చేసేందుకు జీజీహెచ్లోని ఫోరెన్సిక్ విభాగానికి తీసుకురాగా ఓ వైద్యుడు రూ.5000 డిమాండ్ చేశాడు. మధ్యతరగతి వారైన అతడి బంధువులు బతిమాలినా, కొందరితో సిఫారసు చేయించినా తెల్లదుస్తుల్లోని సదరు వైద్యుడు నల్లటి బండరాయిలా చలించలేదు.
చివరికి రూ.4000 ముట్టజెప్పిన బంధువులు అంతకంటే పైసా ఇవ్వలేమని మొర పెట్టుకోవడంతో.. రుసరుసలాడుతూనే పోస్టుమార్టం నిర్వహించాడు. ఫోరెన్సిక్ విభాగంలోని ‘రాబడి రాబందు’ల్లాంటి ఇలాంటి కొందరు వైద్యులు నిత్యం మృతుల బంధువులను డబ్బుల కోసం కాల్చుకు తింటూనే ఉంటున్నారు. శవాలపై సొమ్ములు దండుకునే వారి నికృష్టానికి పరాకాష్ట.. అనాథ మృతదేహాల పోస్టుమార్టంకు కూడా తమ మామూళ్లు ‘మామూలు’గా ఇచ్చి తీరాల్సిందేనని పోలీసులను సైతం పీడించడమే.
అడిగినంతా ఇచ్చుకోవలసిందే..
కాకినాడ ప్రభుత్వాస్పత్రి (జీజీహెచ్)తో పాటు నగరంలోని ఇతర ఆస్పత్రుల్లో మెడికో లీగల్ కేసులకు సంబంధించిన మృతదేహాలను, పరిసరాల్లో జరిగిన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారిని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్ ఆవరణలోని ఆర్ఎంసీ ఫోరెన్సిక్ విభాగానికే తీసుకు వస్తుంటారు. సాధారణంగా ఇక్కడ రోజుకు ఐదుకుపైగా మృతదేహాలకు పోస్టుమార్టం చేస్తుంటారు. ఫోరెన్సిక్ విభాగంలో డబ్బు కోసం ఎంతకైనా దిగజారే కొందరు వైద్యులు పోస్టుమార్టం చేయాలంటే రూ.5 వేలు ముట్టజెప్పాల్సిందేనని మృతుల బంధువులను పీడిస్తున్నారు.
సొమ్ములు ఇవ్వకపోతే పోస్టుమార్టం నివేదిక సక్రమంగా ఇవ్వరేమో, మృతదేహాలు చెడిపోయే వరకూ జాప్యం చేస్తారేమోననే భయంతో భారమైనా వైద్యులు అడిగిన మొత్తం ముట్టజెపుతున్నారు. చివరికి గుర్తు తెలియని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఇక్కడకు తరలించిన తమను కూడా విడిచి పెట్టకుండా ముడుపులు గుంజుతున్నారని పోలీసులు వాపోతున్నారు.
చర్యలు తీసుకున్నా బేఖాతరు..
గతంలో ఫోరెన్సిక్ విభాగం వైద్యుడు సొమ్ములు తీసుకున్నాడని ఆర్ఎంసీ ప్రిన్సిపాల్కు ఫిర్యాదు అందడంతో విచారణ నిర్వహించి శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. కొన్ని నెలల పాటు పోస్టుమార్టం నిర్వహించకుండా ఆంక్షలు విధించారు. అయితే ప్రస్తుతం తిరిగి పోస్టుమార్టం విధులు నిర్వహిస్తున్న ఆ వైద్యుడు మునుపటిలాగే ‘చావుముడుపు’లు వసూలు చేస్తున్నాడని, అదే ఈ విభాగం బరితెగింపునకు నిదర్శనమని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
వారు ‘తెల్లని’రాబందులు
Published Sat, Jul 19 2014 12:16 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
ప్రజలు జాగ్రత్త.. బాబుపై ద్వారంపూడి సెటైర్లు
దొంగలు దొరికారు
రాజకీయం కోసం ఎంత నీచానికైనా దిగజారతాడు..కన్నబాబు ఫైర్
ధోని జట్టులో అవసరమా?: ‘తలా’పై సంచలన వ్యాఖ్యలు
హిందూపురానికి బాలకృష్ణ చేసిందేమీ లేదు.. అందుకే ప్రజలు నాకు బ్రహ్మరథం పడుతున్నారు
జగనన్న సంక్షేమమే నన్ను గెలిపిస్తుంది..175/175 పక్కా
ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
గోదారిలో గాలి కబుర్లే..!
బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్..
తప్పక చదవండి
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- MI Vs SRH: ఐపీఎల్లో నేడు (మే 6) మరో బిగ్ మ్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- పిఠాపురంలో గుట్టుచప్పడు కాకుండా జనసేన ‘గోకులం’ డ్రామా
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement