నంద్యాల, న్యూస్లైన్: అధికారంలో ఉన్నా..లేకున్నా ప్రజా సంక్షేమమే తన లక్ష్యమని వైఎస్ఆర్సీపీ నంద్యాల నియోజకవర్గ సమన్వయకర్త భూమానాగిరెడ్డి తెలిపారు. ఇందుకోసం పలు కార్యక్రమాలను ఇప్పటికే అమలు చేస్తున్నామని చెప్పారు. భవిష్యత్లో మరిన్ని కార్యక్రమాలు అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందించామన్నారు. నంద్యాల పట్టణంలోని ఆయన నివాసంలో మంగళవారం ఈ వివరాలను విలేకరులకు వివరించారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పార్టీ ప్రణాళికను అమలులోకి తెస్తారన్నారు. దానితోపాటు నంద్యాల నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎన్నికల మ్యానిఫెస్టోను తాను రూపొందించినట్లు భూమా తెలిపారు. వార్డు పర్యటనలో వచ్చిన సమస్యలను కూడా ఇందులో చేరుస్తామన్నారు.
వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే..
వార్డుకు 200 నుంచి 300 మధ్యన నిరుపేదలను ఎన్నుకొని పట్టణంలోని ప్రధాన ప్రాంతంలో పదివేల మందికి నివాస గృహాలను అపార్ట్మెంట్ పద్ధతి నిర్మిస్తామని భూమా నాగిరెడ్డి చెప్పారు. నంద్యాల, గోస్పాడు మండలాల్లోని అన్ని గ్రామాల్లో పేద ప్రజలకు ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. రద్దీ ప్రాంతాల్లో పబ్లిక్, మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. బొమ్మలసత్రం, ఎన్టీఆర్ కాంప్లెక్స్, ఆర్టీసీ బస్టాండ్, నూనెపల్లె, ప్రభుత్వ ఆసుపత్రి, గాంధీచౌక్లలో ఆటో స్టాండ్లను ఏర్పాటు చేస్తామని వివరించారు. అందులో ప్రయాణీకులకు, ఆటో డ్రైవర్లకు ఉపయోగపడేలా మీటింగ్ హాల్, క్యాంటిన్, ఎంటర్టైన్మెంట్ కోసం టీవీ, ఫోన్ ఏర్పాటు చేయనున్నామన్నారు.
ఫోన్కాల్తో ఆటో ఇంటి ముందు వాలే విధంగా చూస్తామన్నారు. పట్టణంలోని మురుగునీటిని కుందూనది ఒడ్డుకు చేర్చి అక్కడే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు. పేదలందరికీ ఇంటి వద్దకే ఉచితంగా మినరల్ వాటర్ అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అలాగే లబ్ధిదారులందరూ ఇంటి వద్దనే పింఛన్లు అందుకునేలా చూస్తామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు కార్పొరేట్ వైద్యసేవలను, రైతులకు కల్తీలేని ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు అందజేస్తామన్నారు. గాంధీచౌక్లోని కూరగాయల మార్కెట్ను మోడల్ మార్కెట్గా తీర్చిదిద్దుతామన్నారు.
పూలు, పండ్లు, కూరగాయలకు ప్రత్యేక మార్కెట్ వసతిని కల్పిస్తామన్నారు. ైబె ర్మల్వీధి, కల్పనాసెంటర్, మెయిన్ బజార్లను వాక్స్ట్రీట్లుగా ప్రకటించి వాహనదారులకు ప్రత్యేక పార్కింగ్ స్థలాన్ని కేటాయిస్తామని చెప్పారు. ప్రతిరోజూ రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు వాక్స్ట్రీట్లలో వాహనాలకు అనుమతిస్తామన్నారు. ఇళ్లపై వేలాడే హైపర్టెన్షన్ తీగలను తొలగిస్తామన్నారు. ఆటోనగర్తోపాటు పట్టణంలోను, గ్రామాల్లోని ప్రతి వీధిలో సిమెంట్ రహదారి, డ్రైనేజీ సౌకర్యం కల్పిస్తామన్నారు. చేతి వృత్తుదారులు.. వివిధ వర్గాల వారికి ప్రత్యేక సొసైటీలు ఏర్పాటు చేసి వారికి జీవనోపాధి, మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామన్నారు.
ఫిబ్రవరి 5 నుంచి గడపగడపకు వైఎస్ఆర్సీపీ..
వచ్చేనెల 5వ తేదీ నుంచి పట్టణంలోని ప్రజల సమస్యలను తెలుసుకొనేందుకు ప్రతివార్డులో పర్యటించాలని నిర్ణయించినట్లు భూమా తెలిపారు. వచ్చేనెల 2వ తేదీన డయల్ యువర్ భూమా కార్యక్రమంలో ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రజలకు వివరిస్తానన్నారు. నంద్యాల పార్లమెంటు నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ స్థానాలను వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు.
ఉచిత వైద్యం.. ఉపాధికి ప్రాధాన్యం
Published Wed, Jan 29 2014 3:25 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
ఓసీపీ..ఉక్కిరిబిక్కిరి
‘నల్లసూరీడు’పై నజర్
తప్పక చదవండి
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- ముస్లిం రిజర్వేషన్లే రద్దు
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
Advertisement