ఆర్టీసీ ఎండీగా సాంబశివరావు | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ ఎండీగా సాంబశివరావు

Published Fri, Jan 23 2015 7:18 AM

G. Sambasiva Rao appointed as apsrtc MD

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి నండూరి సాంబశివరావును నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి ఆర్టీసీకి ఎండీగా వ్యవహరించిన జె.పూర్ణచందర్రావు అఖిల భారత సర్వీసు అధికారుల పంపకంలో తెలంగాణ రాష్ట్రానికి వెళ్లారు. దీంతో ఏపీకి ప్రత్యేకంగా అధికారిని నియమించాలనే ఉద్దేశంతో అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్న సాంబశివరావుకు బాధ్యతలు అప్పగించారు.
 

Advertisement
Advertisement