-
‘డీజల్ ధరలతో ఆర్టీసీ నష్టపోతుంది’
సాక్షి, విజయవాడ : రోజురోజుకు పెరుగుతున్న డీజల్ ధరలతో ఆర్టీసీ నష్టపోతుందని ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వై వీ రావు, ఇన్చార్జి ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న డీజల్ ధరల వలన ఆర్టీసీపై ఏడాదికి సుమారు 300కోట్ల రూపాయలు భారం పడుతుందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్లనే ఆర్టీసీ నష్టపోతోందని ఆరోపించారు. డీజల్ ధరలు తగ్గించాలని, లేదంటే పెరుగుతున్న డీజల్ ధరల వలన ఆర్టీసీపై పడుతున్న ఆర్థిక భారాన్ని పూర్తిగా ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ నెల 10న రాష్ట్రవ్యాప్తంగా 128 డిపోలలో, వర్కుషాపుల వద్ద ధర్నాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. -
పీఎన్బీఎస్కు రాజధాని కళ
బస్టాండ్లోనే ఏపీఎస్ఆర్టీసీ ఎండీ కార్యాలయం పరిపాలన భవనంపై నాలుగు అంతస్తుల నిర్మాణానికి అవకాశం ఇటీవలే పరిశీలించిన ఎండీ సాంబశివరావు బస్భవన్కు చేరిన పీఎన్బీఎస్ మాస్టర్ ప్లాన్ విజయవాడ : నగరంలోని పండిట్ జవహర్లాల్ నెహ్రూ బస్టాండ్(పీఎన్బీఎస్) రాష్ట్ర రాజధాని శోభ సంతరించుకోనుంది. రాజధాని స్థాయికి తగినట్లు అభివృద్ధి చేయటంతోపాటు ఆర్టీసీ ఉన్నతాధికారుల కార్యాలయాలు కూడాఇక్కడ ఏర్పాటుచేయనున్నారు. ప్రధానంగా అంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ కార్యాలయాన్ని పీఎన్బీఎస్లోనే ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ఆర్టీసీ భవనాలతోపాటు ఖాళీ స్థలాలను ఇటీవల అధికారులు పరిశీలించారు. ఎండీ కార్యాలయంతోపాటు వివిధ విభాగాల్లో పనిచేసే అధికారులు మే నెలలోపు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. మార్పులు, చేర్పుల కోసం బస్టాండ్కు సంబంధించిన సమగ్ర మాస్టర్ ప్లాన్ను హైదరాబాద్లోని బస్భవన్కు పంపారు. అన్ని విధాలా అనుకూలం.. హైదరాబాద్లోని మహాత్మాగాంధీ బస్టాండ్ కన్నా ముందుగా 1990-91లోనే విజయవాడలో పండిట్ నెహ్రూ బస్స్టేషన్ను 26.3 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. దీనిలో 4.3 ఎకరాల విస్తీర్ణంలో విజయవాడ బస్ డిపో ఉంది. మిగిలిన విస్తీర్ణంలో బస్టాండ్లోని పరిపాలన కార్యాలయం, ఎరైవల్ బ్లాక్లు, ప్లాట్ఫారాలు, బస్ల పార్కింగ్ ప్రాంతం, ద్విచక్ర వాహనాల స్టాండ్, సుమారు 110 షాపులు ఉన్నాయి. ప్రస్తుతం బస్టాండ్లోని పరిపాలన కార్యాలయాలన్నీ మొదటి అంతస్తులోనే ఉన్నాయి. కింది భాగంలో బస్సుల ఎరైవల్ బ్లాక్ ఉంది. భవన నిర్మాణ సమయంలో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా దీనిని నిర్మించారు. ప్రస్తుతం జీ ప్లస్ వన్గా ఉన్న బస్టాండ్ భవనాన్ని జీ ప్లస్ 5గా మార్చుకునేందుకు వీలుగా నిర్మించారు. దీంతో ఇక్కడే ఆర్టీసీ ఎండీ కార్యాలయం ఏర్పాటుకు అనువైన పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలో గడచిన రెండు వారాల్లో ఆర్టీసీ ఎండీ ఎన్.సాంబశివరావు రెండుసార్లు పీఎన్బీఎస్ను తనిఖీ చేశారు. పరిపాలన భవనంపైన అదనపు అంతస్తుల నిర్మాణానికి సాధ్యాసాధ్యాలపై చర్చించారు. నూతనంగా నాలుగు అంతస్తులు నిర్మిస్తే ఎంత విస్తీర్ణం వస్తుంది.. పరిపాలనా కార్యాలయానికి ఎంత వినియోగించుకోవచ్చు.. అనే అంశాలపై అధికారులతో చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే బస్టాండ్ మాస్టర్ప్లాన్ను హైదరాబాద్లోని ఎండీ కార్యాలయానికి పంపాలని ఆదేశించినట్లు సమాచారం. ప్రస్తుతం బస్టాండ్ మొదటి అంతస్తులోని పరిపాలన భవనం సుమారు 20వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. దీనిపై మరో నాలుగు అంతస్తులు నిర్మిస్తే దాదాపు 80 వేల చదరపు అడుగులకు విస్తీర్ణం వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ 500 మందికి పైగా సిబ్బంది పనిచేసేందుకు కార్యాలయాలు, 50 మందికిపైగా అధికారులకు చాంబర్లు ఏర్పాటుచేయవచ్చని తెలుస్తోంది. అయితే, ఎండీతోపాటు ఇతర ఉన్నతాధికారుల కార్యాలయాల ఏర్పాటు కోసం గతంలో విద్యాధరపురం బస్ డిపో, చల్లపల్లి బంగ్లా సమీపంలోని పాత బస్టాండ్ ప్రాంగణాలను కూడా పరిశీలించారు. 400 మందికి పైగా వచ్చే అవకాశం... ఆర్టీసీ ఎండీ కార్యాలయంలో 350 నుంచి 400 మంది సిబ్బంది ఉంటారు. వీరితోపాటు ఇద్దరు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లు, ఎనిమిది మంది రీజనల్ మేనేజర్ స్థాయి అధికారులు, కీలకమైన అడ్మినిస్ట్రేషన్, ఇంజినీరింగ్, ఆపరేషన్స్ విభాగాలు కూడా ఇక్కడే ఉంటాయి. వీటిలో ఆర్ఎం స్థాయి అధికారులతోపాటు డీవీఎం, డీఎం స్థాయి అధికారులు, ఇతర ఉన్నతాధికారులు 35 మంది వరకూ ఉంటారు. వీరందరూ మే నెలలోపు నగరానికి వచ్చే అవకాశం ఉందని తెలిసింది. -
ఆర్టీసీ ఎండీగా సాంబశివరావు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా సీనియర్ ఐపీఎస్ అధికారి నండూరి సాంబశివరావును నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి ఆర్టీసీకి ఎండీగా వ్యవహరించిన జె.పూర్ణచందర్రావు అఖిల భారత సర్వీసు అధికారుల పంపకంలో తెలంగాణ రాష్ట్రానికి వెళ్లారు. దీంతో ఏపీకి ప్రత్యేకంగా అధికారిని నియమించాలనే ఉద్దేశంతో అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్న సాంబశివరావుకు బాధ్యతలు అప్పగించారు. -
ఆర్టీసీ ఎండీగా సాంబశివరావు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్గా సీనియర్ ఐపీఎస్ అధికారి నండూరి సాంబశివరావును నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి ఆర్టీసీకి ఎండీగా వ్యవహరించిన జె.పూర్ణచందర్రావు అఖిల భారత సర్వీసు అధికారుల పంపకంలో తెలంగాణ రాష్ట్రానికి వెళ్లారు. దీంతో ఏపీకి ప్రత్యేకంగా అధికారిని నియమించాలనే ఉద్దేశంతో అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్న సాంబశివరావుకు బాధ్యతలు అప్పగించారు -
ఆర్టీసీ చేజారనున్న గిన్నిస్ రికార్డు
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అత్యుత్తవు రోడ్డు రవాణా సంస్థగా ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న అంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డురవాణా సంస్థ ఇప్పుడు ఓ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ రికార్డును దూరం చేసుకోబోతోంది. దేశంలో మరే రోడ్డు రవాణా సంస్థకు సాధ్యం కాని ఈ రికార్డు పదిహేనేళ్లపాటు పదిలంగా ఉండి... మరికొద్ది రోజుల్లో చేజారబోతోంది. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో బస్సులను సమర్థవంతంగా నడుపుతున్న ఏకైక సంస్థగా ఏపీఎస్ ఆర్టీసీ చరిత్రపుటల్లో నిలిచింది. సరిగ్గా పదిహేనేళ్ల క్రితం ప్రతిష్టాత్మక ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ దీన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. ప్రభుత్వ సంస్థలకుగాని, ప్రైవేటు సంస్థలకుకాని ఇలా ప్రపంచంలో ఎక్కడా ఏపీఎస్ ఆర్టీసీకి ఉన్నన్ని బస్సులు లేవు. 1999 అక్టోబర్ 31న ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ దీన్ని తన పుస్తకంలో నమోదు చేసి ఏపీఎస్ ఆర్టీసీకి అధికారికంగా ఆహోదాను ఇచ్చింది. ఆ సమయంలో ఏపీఎస్ ఆర్టీసీకి 18397 బస్సులున్నాయి. ఇన్ని బస్సులను ఒకే సంస్థ సమర్థవంతంగా నిర్వహించటం ఓ అరుదైన అంశమని అప్పట్లో ‘గిన్నిస్’ కితాబిచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఘనత మన ఆర్టీసీ పేరనే కొనసాగుతూ వస్తోంది. ప్రస్తుతం 22459 బస్సులతో అది మరింత ఉన్నతంగా ఎదిగింది. రాష్ట్ర విభజనతో రెండు ముక్కలు... రాష్ట్ర విభజనతో ఆర్టీసీని రెండు రాష్ట్రాలు పంచుకుంటున్నారుు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్కు 12 వేల బస్సులు, తెలంగాణకు 10 వేల బస్సులు దక్కనున్నాయి. దీంతో అత్యధిక బస్సులు నడుపుతున్న సంస్థ రెండు ముక్కలు కానుండటంతో గిన్నిస్ రికార్డు చేజారనుంది. కొద్ది రోజుల్లో ఆర్టీసీ విభజన జరిగిన క్షణం గిన్నిస్ రికార్డు చేజారిపోతుంది. పోటీలో మహారాష్ట్ర... ప్రస్తుతం దేశంలో ఏపీఎస్ ఆర్టీసీ తర్వాత మహారాష్ట్ర ఆర్టీసీ అత్యధిక బస్సులు నడుపుతోంది. అక్కడ దాదాపు 17 వేల వరకు బస్సులున్నాయి. గిన్నిస్ నుంచి ఏపీఎస్ ఆర్టీసీ పేరు తొలగిపోగానే దాన్ని మహారాష్ట్ర ఆక్రమించే అవకాశం ఉంది. ఇదీ ఆర్టీసీ స్వరూపం... * నిజాం స్టేట్ రైల్వే-రోడ్ ట్రాన్స్పోర్టు డిపార్టుమెంట్ పేరుతో 1932లో 27 బస్సులు.. 166 మంది సిబ్బందితో మొదలైంది. దేశంలో తొలుత జాతీయమైన రవాణా సంస్థ ఇదే. * 1958లో ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థగా ఆవిర్భవించింది. ప్రస్తుతం 22459 బస్సులు, 1.22 లక్షల మంది సిబ్బంది ఉన్నారు. * డిపోలు: 216, స్టేషన్లు 777 * వెన్నెల స్లీపర్ బస్సులు, గరుడ ప్లస్, గరుడ, ఇంద్ర, శీతల్ పేరుతో ఏసీ బస్సులు, సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్ప్రెస్, పల్లెవెలుగు, ఆర్డీనరీ పేరుతో నాన్ ఏసీ బస్సులు నడుపుతోంది. -
ఆర్టీసీ విభజనలో వుళ్లీ కదలిక
అధికారులతో నిపుణుల కమిటీ భేటీ ఉద్యోగులు, ఆస్తులు, అప్పులపై ఆరా హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ఆర్టీసీ) విభజన ప్రక్రియులో వుళ్లీ కదిలిక వచ్చింది. రాష్ట్ర పునర్విభజన బిల్లులోని పదో షెడ్యూల్లో ఉన్న సంస్థల విభజన వ్యవహారాలను పర్యవేక్షించే నిపుణుల కమిటీ వుంగళవారం ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమావేశమైంది. ఆర్టీసీ ఎండీ పూర్ణచందర్ రావుతో పాటు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లతో భేటీ అయిన కమిటీ సభ్యులు.. సంస్థ విభజనకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారుల నుంచి సేకరించారు. సంస్థలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల సంఖ్య, రెండు రాష్ట్రాల వుధ్య ఉద్యోగుల పంపిణీకి ప్రాతిపదిక, ఉన్నతస్థారుు అధికారుల కేటారుుంపు, ఆర్టీసీ డిపోల సంఖ్య, బస్సుల సంఖ్య, వాటి కేటారుుంపులు, ఆస్తులు, అప్పుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గతంలో విభజనకు సంబంధించి ఆర్టీసీ అంతర్గత కమిటీ కసరత్తు చేసి ప్రభుత్వానికి అందజేసిన నివేదికను కూడా అధికారులు కమిటీ వుుందుంచారు. ఉవ్ముడి రాజధానిగా ఉన్న హైదరాబాద్, చుట్టుపక్కల ఉన్న ఆర్టీసీ ఆస్తులపై కమిటీ ప్రత్యేక దృష్టి సారించింది. -
ఆర్టీసీ విభజనకు ఆమోదం
- హైదరాబాద్లోని ఆస్తుల పంపిణీపై పాలకమండలి చర్చ - కార్మిక సంఘాల అభిప్రాయాలను - ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయం - అక్కడి నుంచి వచ్చే సూచనల ఆధారంగా చర్యలు - కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణకు పచ్చజెండా సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట రోడ్డు రవాణా సంస్థ(ఎపీఎస్ఆర్టీసీ)ను రెండుగా విభిజించేందుకు ఆర్టీసీ పాలకమండలి ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉమ్మడిగా ఉన్న ఈ సంస్థను ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ(ఏపీఎస్ ఆర్టీసీ), తెలంగాణ ఆర్టీసీ (టీజీఎస్ ఆర్టీసీ)గా విభజిస్తూ ఆర్టీసీ విభజన కమిటీ చేసిన ప్రతిపాదనకు గురువారం జరిగిన పాలకమండలి సమావేశంలో ఆమోదముద్ర పడింది. ఈ మేరకు విభజన నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అధికారులు పంపారు. అక్కడి నుంచి అది గవర్నర్ కార్యాలయానికి చేరుతుంది. విభజన నేపథ్యంలో ఏ ప్రాంతంలోని ఆస్తులను ఆ ప్రాంతానికే కేటాయించే విషయంలో ఎలాంటి అభ్యంతరాలు రాకున్నా, ఉమ్మడి రాజధానిగా ఉంటున్న హైదరాబాద్, దాని శివారులోని ఆర్టీసీ ఆస్తుల పంపకం విషయంలో వ్యక్తమైన భిన్నాభిప్రాయాలపై పాలక మండలి చర్చించింది. ఉమ్మడి రాష్ట్రంలోని ఆదాయం ద్వారా ఏర్పాటైన ఆస్తుల్లో జనాభా ప్రాతిపదికన 58:42 నిష్పత్తి ప్రకారం రెండు రాష్ట్రాలకు వాటా కల్పించే అంశంపై తెలంగాణ ప్రాంత కార్మిక సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మరోవైపు తమకు వాటా ఉండాల్సిందేనని సీమాంధ్ర ప్రాంత కార్మిక సంఘాలు పట్టుబట్టాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బోర్డు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని తీర్మానించింది. ప్రభుత్వం సూచనల మేరకు నడుచుకోవాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న ప్రధాన పరిపాలనా భవనం, ఆర్టీసీ ఆసుపత్రి, కల్యాణమండపం, ప్రింటింగ్ ప్రెస్, బస్ బాడీ కేంద్రం తదితరాలను సీమాంధ్ర ప్రభుత్వం తన సొంత ఖర్చుతో నిర్మించి ఆర్టీసీకి అందజేసిన పక్షంలో హైదరాబాద్లోని ఆస్తుల్లో వాటా అవసరం లేదంటూ సీమాంధ్ర సిబ్బంది పేర్కొన్న విషయాన్ని ప్రభుత్వం ముందుంచాలని బోర్డు నిర్ణయించింది. కాగా, తెలంగాణ రాష్ర్ట ఆర్టీసీకి ప్రత్యేక పాలకమండలి ఏర్పాటుకానుంది. ఉమ్మడి రాష్ట్రంలో కార్మికులకు అందాల్సిన బకాయిలన్నింటినీ ఈ నెలాఖరులోపు చెల్లించాలని కార్మిక సంఘాల పక్షాన గుర్తింపు యూనియన్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ పాలకమండలి సభ్యుడు పద్మాకర్ పేర్కొన్నారు. దీనికి బోర్డు సానుకూలంగా స్పందించింది. గత ఏడాది ఆర్టీసీ కార్మిక సంఘాలతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో భాగంగా మిగిలిన 1792 మంది కండక్టర్లు, 1655 మంది కాంట్రాక్టు డ్రైవర్ల సర్వీసుల క్రమబద్ధీకరణకు కూడా పాలకమండలి పచ్చజెండా ఊపింది. ఈ ప్రక్రియ వచ్చే సెప్టెంబరులో పూర్తికానుంది. తొలి విడతలో క్రమబద్ధీకరణ పొందిన వారికి చెల్లించాల్సిన దాదాపు రూ. 13 కోట్ల వేతన బకాయిల చెల్లింపునకూ బోర్డు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం రవాణా శాఖ మంత్రి, ఆర్టీసీ చైర్మన్ లేనందున ఆర్టీసీ ఎండీ పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో పాలక మండలి భేటీ జరిగింది. -
రెట్.. రైట్
బెంగళూరు, న్యూస్లైన్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులు సమ్మె విరమించడంతో ప్రవాసాంధ్రులు ఊపిరి పీల్చుకున్నారు. దసరా పండుగకు సొంత ఊర్లకు పయనమయ్యారు. నగరం నుంచి ఆంధ్రప్రదేశ్కు రోజూ 350కి పైగా బస్సు సర్వీసులు తిరుగుతుంటాయి. ఉద్యోగులు సమ్మె విరమించి విధుల్లో పాల్గొనడంతో బస్సులన్నీ క్రమంగా బెంగళూరు వైపు వస్తున్నాయి. శనివారం ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు 250కి పైగా బస్సు సర్వీసులు పంపించామని స్థానిక అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్వ్రీంద్రనాథ రెడ్డి తెలిపారు. హైదరాబాద్, కడప, అనంతపురం, కర్నూలు, నెల్లూరు, తిరుపతి, మదనపల్లి, కాళహస్తి తదితర ప్రాంతాలకు బస్సు సర్వీసులు నడిపామని చెప్పారు. నెల్లూరు జిల్లాలోని కనిగిరి, ఉదయగిరి, కావలి ప్రాంతాల నుంచి శనివారం రాత్రి బస్సులు ఇక్కడికి చేరుకున్నాయని తెలిపారు. కనుక ఆ మార్గాల్లో కూడా సర్వీసులను పునరుద్ధరిస్తామని ఆయన చెప్పారు. కేఎస్ ఆర్టీసీ కూడా... సమైక్యాంధ్ర ఉద్యమంతో ఇన్నాళ్లూ ఆంధ్రప్రదేశ్కు నిలిపి వేసిన బస్సు సర్వీసులను కేఎస్ ఆర్టీసీ కూడా పునరుద్ధరించింది. చిత్తూరు, తిరుపతి మార్గంలో 450కి పైగా సర్వీసుల సంచారం ప్రారంభమైంది.
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
జాతీయ రాజకీయాల్లో కపిలేశ్వరపురం జమీందార్లు
ఎటువంటి వివాదాలూ లేకుండా..
ఆలయ గోడపై సత్యదేవుని చరిత్ర
ప్రచార ఖర్చులపై ప్రత్యేక దృష్టి
No Headline
‘పల్లె’వించిన ప్రగతి
ప్రశాంత పోలింగ్కు ఏర్పాట్లు
పోలింగ్ రోజున సెలవు
రూ.193 కోట్లతో 28 సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి
పిఠాపురం వంగా గీత అడ్డా.. పవన్ కళ్యాణ్ కి మాస్ కౌంటర్ సాక్షి
తప్పక చదవండి
- రెడ్ లిప్స్టిక్ను ఉత్తరకొరియా ఎందుకు బ్యాన్ చేసిందో తెలుసా!
- పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ హీరో.. అమ్మాయి ఎవరంటే?
- ముద్రగడ మరో లేఖ.. కీలక వ్యాఖ్యలు
- ద్రవిడ్ గుడ్ బై!.. టీమిండియా కొత్త కోచ్గా ఫారినర్?.. జై షా కామెంట్స్ వైరల్
- నాకోసం ఆ స్టార్ హీరో నెలలతరబడి వెయిట్ చేశాడు: కమెడియన్
- ఏఐ యూనివర్సిటీ.. ఒడిశా మేనిఫెస్టోలో ఆసక్తికర హామీలు
- ‘సత్య’ మూవీ రివ్యూ
- అతిపెద్ద ఐటీ కంపెనీ.. సీఈవో జీతం మాత్రం..
- మద్యం మత్తుతో ఓటర్ల చిత్తుకు చంద్రబాబు కుట్ర
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement