టెర్మినల్ భవనం ఆధునీకరణ
వీఐపీ లాంజ్తోపాటు సీఐపీ లాంజ్
త్వరలో మరిన్ని విమాన సర్వీసులు
సాక్షి, విజయవాడ బ్యూరో: గన్నవరం విమానాశ్రయానికి రాజధాని హంగు తీసుకురానున్నారు. ప్రస్తుతం ఉన్న టెర్మినల్ భవనాన్ని ఆధునీకరించడంతోపాటు విస్తరించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సాధ్యమైనంత త్వరగా ఈ పనులు చేయడానికి ఎయిర్పోర్టు అథారిటీ ప్రయత్నాలు చేస్తోంది. విజయవాడను తాత్కాలిక రాజధానిగా ప్రకటించడం, విజయవాడ పరిసరాల్లో రాజధాని నిర్మించడానికి ప్రభుత్వం అడుగులు వేస్తున్న నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయానికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. అందుకు తగ్గట్లుగా ఎయిర్పోర్టు లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. ఎయిర్పోర్టులో సరైన వసతులు కూడా లేకపోవడం కొత్త రాజధానిలో పెద్ద లోపంగా భావిస్తున్నారు. ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు, ముఖ్య రాజకీయ నాయకులు తరచూ ఎయిర్పోర్టుకు వచ్చి వెళుతున్నారు. వీఐ పీలు, కార్పొరేట్ ప్రముఖులు, ముఖ్యులు తరచూ ఈ ప్రాంతానికి వస్తున్నారు. వచ్చిన వారంతా రాజధానిలో ఇంత చిన్న విమానాశ్రమయమా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. విమానాశ్రయం అందరినీ ఆకర్షించేలా తయారు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పదేపదే ఎయిర్పోర్టు అధికారులకు సూచిస్తున్నారు. దీంతో దీని రూపురేఖలు మార్చాలని ఎయిర్పోర్టు అథారిటీ భావిస్తోంది.
తొలుత అంతర్జాతీయ స్థాయిలో కొత్త టెర్మినల్ భవనాన్ని నిర్మించాలని యోచించారు. దానికి ఆమోదం లభించి, డిజైన్లు ఖరారై నిర్మాణం పూర్తికావడానికి ఎంతలేదన్నా మూడు సంవత్సరాలు పడుతుందనే అంచనాకు వచ్చారు. ఈలోపు రాజధాని ప్రాధాన్యత రోజు రోజుకు పెరుగుతూ దేశ, విదేశీ ప్రముఖులు వచ్చి పోతుండడం, సాధారణ ట్రాఫిక్ కూడా పెరుగుతుండడంతో ఉన్న టెర్మినల్ భవనాన్నే ఆధునీకరించాలని చూస్తున్నారు. అత్యాధునికి హంగులపై ప్రతిపాదనలను ఎయిర్పోర్టు అథారిటీ ఉన్నతాధికారులకు పంపామని, త్వరలో ఆమోదం లభిస్తుందని గన్నవరం ఎయిర్పోర్టు డెరైక్టర్ రాజకిశోర్ సాక్షికి చెప్పారు.
గన్నవరం ఎయిర్పోర్టుకు రాజధాని హంగులు
Published Wed, Oct 29 2014 3:23 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement