బాలికలే టాప్, ప్రధమ స్థానంలో 'తూర్పు' | Sakshi
Sakshi News home page

బాలికలే టాప్, ప్రథమ స్థానంలో 'తూర్పు'

Published Thu, May 15 2014 12:08 PM

బాలికలే టాప్, ప్రధమ స్థానంలో 'తూర్పు' - Sakshi

హైదరాబాద్ : పదో తరగతి ఫలితాల్లో బాలికలే పై చేయిగా నిలిచారు. మొత్తం 88.62 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. బాలురు 87.96 శాతం ఉత్తీర్ణులవగా, బాలికలు 89.33 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో తూర్పు గోదావరి జిల్లా 96.26 శాతం ఉత్తీర్ణతతో ప్రధమ స్థానంలో నిలవగా,  58.31 శాతం ఉత్తీర్ణతతో ఆదిలాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. 77 పాఠశాలల్లో సున్నా శాతం ఉత్తీర్ణత రాగా, 5,784 పాఠశాలల్లో వంద శాతం ఫలితాలు నమోదు చేశాయి.

 

Advertisement
Advertisement