ఏపీ మంత్రి దేవినేని ఉమ
* తెలంగాణ సర్కార్ ఉల్లంఘనను సీడబ్ల్యూసీ దృష్టికి తీసుకెళతాం
* రైతులను కాపాడాలన్న చిత్తశుద్ధి తెలంగాణ ప్రభుత్వానికి లేదు
సాక్షి, న్యూఢిల్లీ: శ్రీశైలంలో జల విద్యుదుత్పత్తికి నీటి వాడకంలో బోర్డు ఇచ్చిన తీర్పును తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘించడాన్ని కృష్ణానది యాజమాన్యబోర్డు దృష్టికి తీసుకెళ్లనున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఉదయం ఆయన ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావుతో కలసి కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతితో ఢిల్లీ అక్బర్రోడ్డు-6లోని ఆమె నివాసంలో భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘనకు పాల్పడుతోందని, ఏపీ ప్రభుత్వం తరఫున పలు అభ్యర్థనలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం దేవినేని ఉమ, కంభంపాటి రామ్మోహనరావు మీడియాతో మాట్లాడుతూ ఏం చెప్పారంటే...
కృష్ణానది యాజమాన్య బోర్డు ఇచ్చిన తీర్పు అమలు విషయంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే బోర్డు దృష్టికి తీసుకెళ్లాలని కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతి చెప్పారు. సోమవారం తనను కలిసిన తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి హరీష్రావుకు అదే విషయాన్ని చెప్పినట్టు ఆమె మాతో చెప్పారు. అయితే విద్యుత్ ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం తమకు అనుమతిచ్చిందంటూ తెలంగాణ మంత్రి హరీష్రావు చెప్పుకోవడం సరికాదు.
పంతాలకు పోయి శ్రీశైలం నీటి మట్టాన్ని 854 అడుగుల కంటే తగ్గిస్తే ఎస్ఆర్బీసీకి నీరందించలేం. ఇదే జరిగితే రాయలసీమలోని రెండు లక్షల ఎకరాల పంట ఎండుతుంది. కేసీకెనాల్కు నీరు సరఫరా చేయలేము. రాయలసీమ ప్రాంతానికి మంచినీరు సైతం అందించలేని దుస్థితి ఏర్పడుతుంది.
ఇప్పటికే శ్రీశైలం, నాగార్జున సాగర్లో 60 టీఎంసీలు తక్కువగా ఉన్నాయి. కరెంటు ఉత్పత్తి చేస్తూ నీళ్లని సముద్రంలోకి వ దిలితే తెలంగాణ జిల్లాల్లో నల్లగొండ, ఖమ్మంతోపాటు కృష్ణ, ప్రకాశం జిల్లాలకు భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయి. నీటిని కాపాడుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబు పెద్దమనసుతో తెలంగాణ 300 మెగావాట్ల విద్యుత్ ఇచ్చేందుకు ముందుకు వస్తే కేసీఆర్ అంగీకరించలేదు.
కేసీఆర్ ఇచ్చిన ప్రతిపాదనలతోనే విభజన చట్టంలో కృష్ణానది యాజమాన్యబోర్డు అంశాన్ని యూపీఏ చేర్చింది. సీలేరు విద్యుత్ను తెలంగాణకు ఇవ్వాలని గోదావరి బోర్డు ఆర్డర్ ఇవ్వలేదు, అలా ఉంటే కేసీఆర్ని చూపించమనండి.
‘కృష్ణా బోర్డు’కు ఫిర్యాదు చేస్తాం
Published Wed, Nov 5 2014 1:15 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement