పొందూరు : కీలక సబ్టెకులు బోధించే ఉపాధ్యాయులంతా బదిలీపై వెళ్లిపోయారు. రెండు నెలలుగా క్లాసులు నిర్వహించడం లేదు. బడికి వెళ్లడం.. ఆడుకోవడం.. ఇంటికి వెళ్లిపోవడం విద్యార్థుల దినచర్య! మండలంలోని కేసవదాసుపురంలోని ప్రాథమికోన్నత పాఠశాల దుస్థితిది! కొత్తగా టీచర్లను నియమిస్తారేమోనని ఇన్నాళ్లూ వేచిచూసిన తల్లిదండ్రుల్లో ఒక్కసారిగా ఆగ్రహం పెల్లుబికింది. పిల్లల భవిష్యత్ నాశనమవుతుందని భయపడిన వీరంతా సోమవారం పాఠశాలకు తాళాలు వేశారు. ఎంఈవో, డీఈవో, కలెక్టర్ వచ్చేంత వరకూ తెరబోమని భీష్మించారు.
నిలిచిపోయిన బోధన
కేసవదాసుపురం పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు 80 మంది విద్యార్థులు చదువుతున్నారు. గతంలో ఇక్కడ ఆరుగురు ఉపాధ్యాయులు ఉండేవారు. జూలై చివరి వారంలో రేషనలైజేషన్ సమయంలో జరిగిన ఉపాధ్యాయ బదిలీల్లో ముగ్గురు వేరే పాఠశాలకు వెళ్లిపోయారు. అప్పటి నుంచి తెలుగు, ఇంగ్లిషు, సోషల్ సబ్జెక్టులు తప్ప మిగిలినవి బోధించటం లేదు. కీలకమైన హిందీ, లెక్కలు, పి.ఎస్, ఎన్.ఎస్. సబ్జెక్టులు చెప్పేందుకు ఉపాధ్యాయులు లేరు. దీంతో ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు బోధన నిలిచిపోయింది.
పాఠాలు చెప్పనపుడు ఇంకెదుకు?
ఆరు నుంచి ఎనిమిదవ తరగతి వరకు 26 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి పరీక్షలు నిర్వహించట్లేదు. ఫార్మేటివ్–1, ఫార్మేటివ్–2 పరీక్షలు ఇప్పటివరకూ జరగలేదు. జి.ఓ నెంబర్ 43 ప్రకారం ప్రాథమికోన్నత పాఠశాలలో 30 మంది కంటే తక్కువ మంది ఉంటే.. ఆ పాఠశాలలో ఒకటో నుంచి ఐదో తరగతి వరకు తరగతులు నిర్వహిస్తారు. బదిలీపై ఉపాధ్యాయులు వెళ్లిపోయినా కొత్తగా ఎవరైనా వస్తారని ఇప్పటివరకూ విద్యార్థుల తల్లిదండ్రులు భావించారు. కానీ కొత్త ఉపాధ్యాయులు ఎవరూ రారని తెలియడంతో వారిలో ఆందోళన నెలకొంది. పాఠాలు చెప్పలేని పరిస్థితుల్లో ఉండటంలో ‘మాకెందుకీ పాఠశాల’అని తాళాలు వేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ బయటే ఉండిపోయారు. ఎంఈఓ, డీఈఓ, కలెక్టర్ వచ్చి తమకు న్యాయం చేయాలని అభ్యర్థిస్తున్నారు. తమ పాఠశాలకు కొత్త ఉపాధ్యాయులను తీసుకురావాలని కోరుతున్నారు.
భయాందోళనలో తల్లిదండ్రులు
కేసవదాసుపురం గ్రామానికి దగ్గరల్లో లోలుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉంది. ఆ పాఠశాలకు వెళ్లి చదువుకునేందుకు నిర్ణయించుకున్నామని విద్యార్థులు చెప్పారు. ఆ పాఠశాలలో చేరుతామంటే ప్రధానోపాధ్యాయులు వద్దన్నారని తెలిపారు. చిలకపాలెం హైవే మీదుగా అల్లినగరం వెళ్లి చదువుకొనే అవకాశం ఉంది. నిత్యం ప్రమాదాలు జరిగే రహదారి కావడంతో ఆ పాఠశాలకు వెళ్లేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో తమ గ్రామంలోనే ఎనిమిదో తరగతి వరకు పాఠశాలను కొనసాగించాలని కోరుతున్నారు.
బడికి తాళాలు!
Published Tue, Oct 17 2017 11:46 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
వైభవంగా త్రిశూల చక్ర స్నానం
రాజంపేట సెంటిమెంట్ ఎవరికో !
ఎన్నికల్లో బీజేపీకి సహకరించిన బీఆర్ఎస్
నృసింహుడికి ప్రత్యేక పూజలు
లెక్కలతో కుస్తీ
జరిమానాలతోనే సరి.. కల్తీ యథావిధి
అప్రమత్తతో తప్పిన ముప్పు
టీడీపీ నేతలకు అనిల్ కుమార్ యాదవ్ సీరియస్ వార్నింగ్
గ్రీన్లో ట్రేడవుతున్న స్టాక్మార్కెట్లు
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
తప్పక చదవండి
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- అజిత్ షాకిచ్చిన త్రిష.. ఏకంగా చిరు, కమల్ కోసం!
- గనిలో చిక్కుకున్న 14 మంది అధికారులు.. కొనసాగుతున్న సహాయక చర్యలు!
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- దేశంలో ఐఐఎం–అహ్మదాబాద్ టాప్
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం
Advertisement