కడప ఎడ్యుకేషన్:
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభివృద్ధికి కృషి చేస్తాం.. నాణ్యతతోపాటు గుణాత్మకమైన విద్య అందిస్తాం.. విద్యార్థులకు అన్ని రకాల మౌలిక వసతులను కల్పిస్తామని ఊకపుదంపుడు ఉపన్యాసాలు చేస్తున్న పాలకులు, అధికారులు పాఠశాలలు తెరుచుకుని మూడునర్న నెలలవుతున్నా ఇప్పటికీ జిల్లావ్యాప్తంగా కేవలం 18 మండలాలకు మాత్రమే యూనిపాంను సరఫరా చేశారు. ఇక పాఠ్య పుస్తకాల విషయానికి వస్తే అధార్కార్డులేని విద్యార్థులతోపాటు ఈ ఏడాది అదనంగా చేరిన విద్యార్థులకు ఇంకా పాఠ్యçపుస్తకాలను అందించలేదు. దీని బట్టి చూస్తే విద్యావ్యవస్థ ఎంతమాత్రం çపటిష్టంగా ఉందో అర్థమవుతోంది.
ఇటీవల మైదుకూరులో జరిగిన న్యాయసదస్సుకు హాజరయ్యేందుకు వెళ్లుతూ మైదుకూరు జెడ్పీ ఉన్నత పాఠశాలను జిల్లా జడ్జి గోకవరపు శ్రీనివాస్ సందర్శించి పిల్లలను పలుకరించారు. మౌలిక వసతులపై ఆరా తీశారు. పాఠ్యపుస్తకాల గురించి కూడా విద్యార్థులతో చర్చించారు. ఈ సందర్భంగా కొంతమంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందలేదని జిల్లా జడ్జీకి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన హెచ్ఎంను మందలించారు. పాఠశాలల తెరుచుకుని ఇన్ని రోజులైనా ఇంకా ఎందుకు పిల్లలకు పాఠ్యపుస్తకాలు అందలేదని ప్రశ్నించారు. డీఈఓ, ఎంఈఓలు ఏం చేస్తున్నారని నిలదీశారు. మళ్లీ త్వరలో పాఠశాల వస్తానని అప్పటికి కూడా సమస్యలుంటే మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించి వెళ్లిపోయారు.
పాఠశాలల తెరుచుకున్న మూడున్నరð నెలలు దాటినా..
పాఠశాలలు తెరుచుకుని మూడున్నర నెలలు దాటినా నేటికీ కేవలం 18 మండలాల్లో పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మాత్రమే స్కూల్ యూనిఫాంలను అందించారు. రెండు మండలాలకు రెండు, మూడు రోజుల్లో పంపిణీ చేయనున్నారు. మిగతా 31 మండలాలకు ఈనెల చివరి లోపు అందిస్తామని సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు కమ్యూనిటీ మొబలైజేషన్ అధికారి రవిశంకర్ తెలిపారు.
మూడు కేంద్రాలలో యూనిఫాం తయారీ
స్కూల్ యూనిఫాంలçను కడపలోని మోస్మా ఆధ్వర్యంలో, అలాగే పోట్లదుర్తిలోని కుట్టుకేంద్రంతోపాటు ఖాజీపేటలోని నందిని ప్రాబ్రిక్స్లో పిల్లల యూనిఫాంలను కుడుతున్నట్లు అధికారులు తెలిపారు.
పాఠ్యపుస్తకాలకు సంబంధించి..
యూడైస్ ప్రకారం రెగ్యులర్గా వచ్చే అందరి పిల్లలకు పుస్తకాలను అందజేశారు. ఈ ఏడాది అదనంగా చేరిన పిల్లలకు , ఆధార్కార్డులు లేనివారికి మాత్రం పుస్తకాలను అందించలేదు. వీరికి కూడా అడిషినల్ కోటా కింద డీఈఓతో అనుమతి తీసుకుని అందచేస్తున్నట్లు పుస్తకాల డిపోమేనేజర్ పెంచలమ్మ తెలిపారు.
యూనిఫాం అందక అవస్థలు
Published Tue, Oct 3 2017 11:26 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలింగ్ కేంద్రాల తనిఖీ
పట్టుదలతో చదవండి
స్వర్ణకారుల సమస్యలు పరిష్కరిస్తాం
ఆదాయపు పన్ను మాఫీ చేయిస్తాం
ఓపెన్ కాస్టుల్లో పనివేళలు మార్చండి
కమిషనింగ్ పూర్తిచేయండి
ఓదెల మల్లన్న సాక్షిగా చెబుతున్నా..
సర్కారు ఆస్పత్రిలో గడువు ముగిసిన మందులు!
ఎన్నికల ప్రచార వ్యయం నమోదుపై సమావేశం
వేడెక్కిన ప్రచారం
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement