పార్టీలకు నామమాత్రపు రేట్లతో భూములపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
సామాన్యుడికి మార్కెట్ రేటు.. పార్టీలకు మాత్రం నామమాత్రపు ధరా?
మీది ధనిక పార్టీయే కదా.. మార్కెట్ ధర చెల్లించమనండి
కాంగ్రెస్ పార్టీ న్యాయవాదిని ఉద్దేశించి వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రిమండలి ఏ అధికారంతో రాజకీయ పార్టీలకు నామమాత్రపు ధరకు భూములను కట్టబెట్టిందో చెప్పాలని హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏ నిబంధనలకు అనుగుణంగా, ఏ విధి విధానాలకు లోబడి పార్టీలకు నామమాత్రపు ధరలకు భూములు కట్టబెట్టారో అఫిడవిట్ రూపంలో వివరించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్జ్యోతి సేన్గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్కుమార్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. చట్ట ప్రకారం భూమిని కోరే పౌరుల నుంచి మార్కెట్ ధర వసూలు చేసే ప్రభుత్వం, అదే భూమికి రాజకీయ పార్టీల నుంచి మాత్రం నామమాత్రపు ధరను వసూలు చేయటంలో ఔచి త్యాన్ని ప్రశ్నించింది. భూముల కేటాయింపు వ్యవహారంలో ప్రభుత్వ తీరు తీవ్ర ఆశ్చర్యానికి గురి చేస్తోందని వ్యాఖ్యానిం చింది. నెల్లూరు జిల్లా గూడూరులో జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ)కి దాదాపు ఎకరా భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం 2009లో జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ వి.గోపీకృష్ణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. పార్టీలకు భూముల కేటాయింపునకు సంబంధించి ప్రభుత్వం గత వారం సమర్పించిన మంత్రి మండలి తీర్మానాలను ధర్మాసనం పరిశీలించింది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చైర్మన్ సి.దామోదర్రెడ్డి లేచి తాను కాంగ్రెస్ పార్టీ తరఫున వాదనలు వినిపిస్తానని తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ‘మీ పార్టీ ధనిక పార్టీ కదా? మరి మీరు పొందిన భూమికి మార్కెట్ ధర చెల్లించవచ్చు. అందులో ఇబ్బందేముంది..? మీ నాయకులను చూస్తూ ఉన్నాం. వారు ఎప్పుడూ విమానాల్లో తిరుగుతూ ఉంటారు. వారు ధనికులే కదా. మార్కెట్ ధర చెల్లించమని వారికి చెప్పండి’ అని దామోదర్రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. అనంతరం విచారణను వచ్చే వారానికి వాయిదా వేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఏ అధికారంతో ఈ కేటాయింపులు?
Published Thu, Feb 13 2014 12:14 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
యాదాద్రీశుడి క్షేత్రంలో భక్తుల రద్దీ
ఉరివేసుకొని యువకుడి బలవన్మరణం
తెలంగాణను పాలించే హక్కు కాంగ్రెస్కే ఉంది
ద్వంద్వ పౌరసత్వం కల్పించేందుకు కృషి
అరచేతిలో ఎన్నికల సమాచారం
ఈవీఎంల కమిషనింగ్ పరిశీలన
సైడ్ ఇవ్వలేదని బస్సు డ్రైవర్పై రాయితో దాడి
టీ20 ప్రపంచకప్కు ఉగ్ర ముప్పు
ఉత్తరాఖండ్ అడవుల్లో ఆరని మంటలు.. ఐదుగురు మృతి!
వ్యాపారులు, వృత్తి నిపుణులకు.. ఫారం 3
తప్పక చదవండి
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
- జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
Advertisement