ఆరు లేన్లుగా
అనకాపల్లి-ఆనందపురం రహదారి
కేంద్ర మంత్రి అశోక్గజపతిరాజుతో
చర్చించిన అధికారులు
‘డీపీఆర్’ తయారు చేయాలని నిర్ణయం
విశాఖపట్నం :
ఆరేళ్లుగా పెండింగ్లో ఉన్న అనకాపల్లి-ఆనందపురం రోడ్డు విస్తరణలో మరోసారి కదలిక వచ్చింది. ఈ సమస్యకు మోక్షం కలి గించాలని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు నిర్ణయించారు. వెయ్యి కోట్లతో నిర్మాణం చేపట్టడానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారు చేయాల్సిందిగా జాతీ య రహదారుల అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాజెక్టు డెరైక్టర్ విజయకుమార్, విశాఖ ఆర్అండ్బి పర్యవేక్షక ఇంజనీర్ జి.కాంతులను శనివారం ఆదేశించారు. 58.22 కిలోమీటర్ల పొడవున నాలుగులేన్లుగా విస్తరించడానికి ఆరేళ్ల క్రితం రూ.535 కోట్ల అంచనాతో శ్రీకారం చుట్టారు.
కార్యరూపం దాల్చలేదు. దీనిని నాలుగు కాదు ఆరు లేన్లుగా విస్తరించాలని రూ.839 కోట్ల అంచనాలతో 2012లో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. 143 కల్వర్టులు, 10 సర్వీస్ రోడ్లు, 8 ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు, 11 వెహికల్ అండర్ పాసెస్లు, 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, 4ట్రక్ లే బేలు, 267 జంక్షన్ల ఆధునీకరణ, 25 బస్ బేలు, 34 బస్ షెల్టర్లు ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించాలనుకున్నారు. దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేశారు. 30 నెలల్లో పనులు పూర్తి చేయాల్సిందిగా ట్రాన్స్ట్రాయ్ ఇండియా లిమిటెడ్కు టెండరు అప్పగించారు. 2013లో ఆ కాంట్రాక్టు రద్దు చేశారు. అప్పటి నుంచీ ప్రాజెక్టు మూలన పడింది. టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టి పది నెలలు పూర్తయినా, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు ఉన్నా నేటికీ ఈ ప్రాజెక్టులో కదలిక రాలేదు.
2012లో టెండర్లు ఆమోదించినపుడు విశాఖ ఎంపీగా ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి ప్రస్తుతం బీజేపీలోనే ఉన్నారు. ఆమె కూడా ఈ ప్రాజెక్టును గాడిన పెట్టే ప్రయత్నం చేయడం లేదు. తాజాగా అశోక్గజపతిరాజు ఈ ప్రాజెక్టుపై దృష్టిసారించారు. సుమారు రూ.1000కోట్లతో ఆరులేన్లగా అభివృద్ధి చేయడానికి విజయనరంలోని తన నివాసంలో అధికారులతో చర్చించి ఆరు నెలల్లో డీపీఆర్ పూర్తి తయారు చేసి టెండర్ల స్థాయికి తీసుకురావాలని నిర్ణయించారు.
ఈ రోడ్డు విస్తరణకు సంబంధించి ఢిల్లీలోని జాతీయ రహదారుల అధికారులు, కేంద్ర రోడ్డు , రవాణా,హైవేస్, షిప్పింగ్ శాఖామంత్రి నితిన్ గడ్కరీతో చర్చించి, పనులు మంజూరు చేయిస్తానని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు.
హైవే విస్తరణకు మోక్షం
Published Sun, May 17 2015 2:48 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్
అమెరికా వరల్డ్కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్గా
గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement