భార్యను చంపిన భర్త | Sakshi
Sakshi News home page

భార్యను చంపిన భర్త

Published Mon, Feb 23 2015 5:55 PM

husband killed his wife

నెల్లూరు టౌన్: నెల్లూరు పట్టణంలోని సంజయ్‌గాంధీ నగర్‌లో కాపురానికి రాలేదని ఓ వ్యక్తి భార్యను బండరాయితో మోది చంపాడు. వివరాలు ఏసు నిర్మలా దేవి, విక్టర్ ఇద్దరూ భార్యాభర్తలు. ఇద్దరికీ రెండో వివాహం. విక్టర్ మొదటి సంతానం పిల్లలు ఇంటికి వచ్చారనే కోపంతో అతనిని వదిలేసి నాలుగు నెలలుగా తల్లి వేదమణి ఇంటి వద్ద ఉంటోంది. సోమవారం కాపురానికి రమ్మని విక్టర్, నిర్మలాను కోరాడు. ఆమె ససేమిరా అనడంతో కోపోద్రిక్తుడైన విక్టర్ బండరాయితో మోది చంపాడు. అడ్డొచ్చిన తల్లిని కూడా తీవ్రంగా గాయపర్చాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement
Advertisement