ఈ బ డ్జెట్లో ఏపీ కొత్త రాజధాని ఎక్కడ పెడతారు, దానికోసం ఎంత కేటారుుస్తారో చెప్పనేలేదు. అసలా ప్రస్తావనే లేదు’’ అని జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్త రాజధాని ఎక్కడుండాలనుకుంటున్నారు అని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘ఈ విషయంలో తొలి నుంచీ నేను చెబుతున్నది ఒక్కటే. ఎక్కడ 30 వేల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంటుందో అక్కడ నిర్మించాలని చెబుతున్నాను. రాజధాని నగరం అంటే నడిబొడ్డు నుంచి ఎటు చూసినా 6 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉండాలి. కనీసం 144 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఉండాలని చెబుతున్నాను’’ అని చెప్పారు.
విజయవాడలో రాజధాని నిర్మాణానికి మీరు వ్యతిరేకమా అని ఓ విలేకరి ప్రశ్నించగా.. ‘‘నేనెప్పుడైనా ఆ మాట అన్నానా? ఫలానా చోట రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం అని చెప్పానా?’’ అని అన్నారు. ‘‘ఒక సామాన్యుడు లేదా ఒక ఉద్యోగి రాజధాని నగరంలో నివాసానికి ఇల్లు కొనుక్కోవాలంటే సాధ్యమవుతుందా? ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంటేనే అది సాధ్యమవుతుంది. అందుకే 30 వేల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండే చోట రాజధాని
నిర్మించాలని అంటున్నాను. - వైఎస్ జగన్
Breadcrumb
ఫలానా చోట రాజధానికి వ్యతిరేకమని. నేనెప్పుడైనా అన్నానా?
Published Thu, Aug 21 2014 1:04 AM
# Tag
Related news
-
రక్షణరంగ బడ్జెట్ను మరింత పెంచిన చైనా
చైనా తన రక్షణరంగ బడ్జెట్ను నిరంతరం పెంచుకుంటూ పోతోంది. ఈ ఏడాది చైనా తన రక్షణ బడ్జెట్ను 7.2 శాతం మేరకు పెంచింది. ఈ పెంపుతో ఈ ఏడాది చైనా రక్షణ బడ్జెట్ 1.67 ట్రిలియన్ యువాన్లకు (231 బిలియన్ డాలర్లు.. ఒక బిలియన్ అంటే రూ. ఒక కోటి) చేరుకుంది. చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ వార్షిక నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది. అమెరికా తర్వాత రక్షణ బడ్జెట్కు అత్యధిక కేటాయింపులు చేస్తున్న రెండో దేశం చైనా. ఇది భారతదేశ బడ్జెట్ కంటే మూడు రెట్లు అధికం. రక్షణరంగాన్ని ఆధునీకరించే విషయంలో భారత్ కంటే చైనా చాలా ముందున్నట్లు కనిపిస్తోంది. దీనికి కారణం చైనా భారీ రక్షణ బడ్జెట్. 2024కి భారతదేశ రక్షణ బడ్జెట్ రూ. 6,21,541 కోట్లు. ఇది దాదాపు $74.8 బిలియన్లు. అయితే 2024కి చైనా బడ్జెట్ సుమారు $232 బిలియన్లు. ఇది భారతదేశ బడ్జెట్ కంటే అత్యధికం. చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్ తన ఆర్మీ పీఎల్ఏను 2027 నాటికి ఆధునీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇదే రక్షణ రంగ బడ్జెట్ పెరుగుదలకు కారణం. సైనికుల సంఖ్య పరంగా చైనా సైన్యం అతిపెద్దది. చైనా సైన్యంలో రెండు రాకెట్ దళాలు ఉన్నాయి. ఈ రాకెట్ ఫోర్స్ అణ్వాయుధాల ఆపరేషన్ను నిర్వహిస్తుంది. చైనా తన రాకెట్ బలగాన్నిరహస్యంగా విస్తరిస్తున్నదనే ఆరోపణలున్నాయి. -
గరం మసాలా!
సాక్షి, హైదరాబాద్: సగటుజీవి నెలవారీ ఆదాయం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండగా.. నిత్యావసరాల ధరలు మాత్రం నింగినంటుతున్నాయి. వంటింట్లోకెళదామంటే కాసింత ధైర్యం కూడగట్టుకోవాల్సిన పరిస్థితి. కుటుంబాన్ని నెట్టుకురావాలంటే బడ్జెట్ ఏ మూలకూ సరిపోవడంలేదు. ఈ రోజు ఉన్న రేటు రేపు ఉండడం లేదు. కిరాణా షాపులో వారం క్రితం కొన్న సామగ్రి రేటు మరో వారానికి మారిపోతోంది. ధరలు పెరగడమే తప్ప తగ్గే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదు. పెరిగిన ధరలతో ఒక్కో కుటుంబంపై నెలకు రూ.1000 నుంచి రూ.1500 వరకు అదనపు భారం పడుతోంది. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఘాటెక్కి.. హీటెక్కి.. కొన్ని నెలలుగా గరం మసాలా ఘాటెక్కింది. కేరళలో వరదల ప్రభావంతో ఇలాచీతో పాటు విదేశాల నుంచి ఇతర మసాలాల దినుసుల దిగుమతులు తగ్గడంతో ధరలు విపరీతంగా పెరిగాయి. గత మూడు నెలల్లో దాదాపు అన్ని మసాలాల ధరలు విపరితంగా పెరిగాయని హోల్సెల్ వ్యాపారులు అంటున్నారు. దీంతో యాలకుల ధర కేజీ రూ. 2,600కు చేరింది. మిరియాలు రూ. 800, లవంగాలు రూ.900, జీలకర్ర రూ.220కు చేరాయి. వామ్మో.. వెల్లుల్లి.. ♦ నగరంలో వెల్లుల్లి ధరలు విపరీతంగా పెరిగాయి. నగర మార్కెట్లకు సరఫరా తగ్గడంతో ప్రస్తుతం కిలో వెల్లుల్లి రూ.480కి చేరుకుంది. హోల్సేల్ మార్కెట్కు వెల్లుల్లిని రవాణా చేసే ట్రక్కులు, టెంపోల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది, సుమారు 15 వాహనాలు మాత్రమే వస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. సాధారణంగా మార్కెట్కు 24 నుంచి 30 వాహనాలు వస్తాయని హోల్సేల్ వ్యాపారులు తెలిపారు. పర్యవసానంగా దాదాపు 40 శాతం వెల్లుల్లి సరఫరా తగ్గడమే ధరల పెరుగుదలకు ప్రాథమిక కారణమని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. ♦ గతేడాది మే నెల తొలినాళ్లలో కిలో వెల్లుల్లి ధర రూ.30 నుంచి రూ.60 వరకు పలికింది. పోయిన నెల వరకు కూడా కేజీ రూ. 160 ఉందని వర్షాకాలంలో దిగుబడి తగ్గడంతో ధరలు పెరిగినట్లు సమాచారం. అక్టోబర్, నవంబర్లలో కురిసిన అ కాల వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. ము ఖ్యంగా వెల్లుల్లి అధికంగా పండించే రాజస్థాన్లో వెల్లుల్లి ధర పెరిగింది. ఈ ప్రభావం దేశ వ్యాప్తంగా పడిందని తెలుస్తోంది. రానున్న రోజుల్లో వెల్లుల్లి ధర మరింత పెరిగే అవకాశం ఉంది. రైస్.. రైజ్.. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రేటర్లో బియ్యం ధరలు రికార్డు స్థాయిలో పలుకుతున్నాయి. నాణ్యమైన సన్న బియ్యం కిలోకు రూ. 65 నుంచి రూ. 70కి పైగానే చెల్లించాల్సి వస్తోంది. డిమాండ్ కంటే ఎక్కువ బియ్యం మార్కెట్కు వచ్చినా ధరలు మాత్రం తగ్గడం లేదు. కూర‘గాయాలే’.. నగరంలో అన్ని కూరగాయలు (టమాటాలు మినహా) కిలోకు రూ.80– 120 వరకు రిటైల్ మార్కెట్లో ధరలు పలుకుతున్నాయి. ఆశించిన స్థాయిలో దిగుబడులు లేకపోవడంతో రాజధాని అవసరాలకు సరిపడా కాయగూరలు, ఆకు కూరలు రావడంలేదు. దీంతో కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. ప్రధానంగా బోయిన్పల్లి, గుడిమల్కాపూర్, ఎల్బీ నగర్, మాదన్నపేట, సికింద్రాబాద్ మోండా మార్కెట్లకు కూరగాయల సరఫరా 60 శాతానికి పడిపోయింది. కొన్ని రకాల కూరగాయలు మండీల జాబితా నుంచి కనుమరుగయ్యాయంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. -
ఇది వాస్తవిక బడ్జెట్
సాక్షి, హైదరాబాద్: సామాజిక సమానత్వం తెచ్చే రీతిలోనే బడ్జెట్ రూపకల్పన చేశామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క పేర్కొ న్నారు. గురువారం శాసనసభలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్పై జరిగిన చర్చకు మంత్రి బదులిస్తూ..అడ్డగోలుగా హామీలిచ్చిన ప్రభుత్వాలు, వాటి అమలుకు ఆదాయం ఎలా సమకూరుతుందో తెలియని స్థితిలో బడ్జెట్ ప్రవేశపెట్టాయని దుయ్యబట్టారు. బడ్జెట్లో నిధులు కేటాయించినా, మంజూరులేని పరిస్థితిలో అనేక వర్గాలు ఫలితం పొందలేకపోయారని తెలిపారు. ఇలాంటి పొరపాటుకు తావులేకుండా వాస్తవిక బడ్జెట్ రూపొందించామని చెప్పారు. అందుకే బడ్జెట్ను కుదించాల్సి వచ్చిదని వివరించారు. ప్రవేశపెట్టిన రూ.2,75, 891 బడ్జెట్... ఆదాయం, ఖర్చు కు మధ్య మహా అయితే 6% కన్నా తక్కువ ఉండబోదని తెలిపారు. గత పదేళ్ల కాలంలో మొత్తం బడ్జెట్ కేటాయిపులు రూ.14,87,834 కోట్లు అయితే, ఖర్చు చేసింది మాత్రం రూ.12,25,312 కోట్లు అని తెలిపారు. ఆదాయమే లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టడం వల్ల ఈ పదేళ్లలో రూ. 2,65,212 కోట్లు కేటాయింపుల్లో ఖర్చు చేయలేదన్నారు. కేంద్రనిధులు తెచ్చేందుకు బీజేపీ సభ్యులు కూడా సహకరించాలని కోరారు. ఆర్థికలోటు అధిగమించేందుకు అప్పులు చేయక తప్పదన్నారు. ఇచ్చిన ఆరు గ్యారంటీలు తప్పకుండా అమలు చేస్తామన్నారు. నిరుద్యోగుల కష్టాలు తొలగించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేశామని, నిరుద్యోగుల కలలు నిజం చేస్తూ ఉద్యోగాల జాతర కొనసాగుతుందని చెప్పారు. -
2032–33 నాటికి కట్టాల్సింది.. రూ.2.5 లక్షల కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంపై అప్పుల భారం తీవ్రంగా ఉందని, రానున్న పదేళ్లలో రుణాల తిరిగి చెల్లింపు ఇబ్బందిగా మారే అవకాశం ఉందని ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)’నివేదికలో పేర్కొంది. మార్కెట్ రుణాల మీద వడ్డీ, అసలు కలిపి.. 2032–33 నాటికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2,52,048 కోట్లను చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. 2022 మార్చి 31తో ముగిసిన (2021–22) ఆర్థిక సంవత్సరం నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, నిర్వహణ తీరుపై కాగ్ రూపొందించిన ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం గురువారం అసెంబ్లీ ముందుపెట్టింది. బడ్జెట్లో పేర్కొనకుండా తీసుకున్న రుణాల్లో (ఆఫ్ బడ్జెట్) కాళేశ్వరానికే ఎక్కువగా ఉన్నాయని కాగ్ పేర్కొంది. ‘కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ (కేఐపీసీఎల్)’కింద రూ.66,854 కోట్లు తీసుకున్నారని.. ఈ రుణాల అసలు, వడ్డీ కలిపి 14 ఏళ్లలో రూ.1,45,545 కోట్లు చెల్లించాలని పేర్కొంది. దీనితో సమీప భవిష్యత్తులో అభివృద్ధి ప్రణాళికల విషయంలో రాష్ట్ర సామర్థ్యం పరిమితం అవుతుందని వ్యాఖ్యానించింది. కాగ్ నివేదికలోని అంశాలివీ.. ► రెవెన్యూ రాబడులు 26 శాతం పెరిగినా మిగులును సాధించడంలో రాష్ట్రం వరుసగా మూడో ఏడాది కూడా విఫలమైంది. బడ్జెట్ నుంచి చెల్లిస్తున్న ఆఫ్ బడ్జెట్ రుణాలు, ఇతర చెల్లింపులను కలిపితే.. జీఎస్డీపీలో అప్పుల నిష్పత్తి 37.77 శాతంగా ఉంది. ఇది ఎఫ్ఆర్బీఎం చట్టం నిర్దేశించిన దానికంటే 12.77 శాతం, 15వ ఆర్థిక సంఘం నిర్దేశించిన దానికంటే 8.47 శాతం ఎక్కువ. ►2021–22లో రెవెన్యూ వ్యయం 11 శాతం పెరిగింది. ఇందులో జీతాలు, వడ్డీ చెల్లింపులే ఎక్కువ భాగం ఉన్నాయి. విద్య, ఆరోగ్యం మీద ఖర్చు విషయంలో రాష్ట్రం వెనుకంజలో ఉంది. మొత్తం వ్యయంలో 8శాతం విద్య, 4శాతం ఆరోగ్యంపై ఖర్చు చేశారు. ► అంతకుముందు ఏడాదితో పోలిస్తే మూలధన వ్యయం 81శాతం పెరిగింది. 2021–22లో రూ.28,874 కోట్లు మూలధన వ్యయం కింద ఖర్చుపెట్టారు. అయితే 2022 నాటికి పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల మీద రూ.1,09,612 కోట్లు మూలధనం ఖర్చయింది. ► బడ్జెట్ వ్యయం కింద రూ.2,30,872 కోట్లకు ప్రభుత్వం అసెంబ్లీ అనుమతి తీసుకుంది. తర్వాత అనుబంధంగా రూ.24,144 కోట్ల మేర అంచనాలకు ఆమోదం తెలిపింది. అయితే రెవెన్యూ ఖర్చు రూ.2,63,092 కోట్లుకాగా.. నికర అధిక వ్యయం రూ.8,076 కోట్లు. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులను పరిగణనలోకి తీసుకోకపోతే అయిన ఖర్చు రూ.1,95,818 కోట్లే. అంటే బడ్జెట్ అంచనాల్లో వాస్తవఖర్చు 77శాతమే. ► 2014–15 నుంచి 2020–21 వరకు కలిపి బడ్జెట్లకు అదనంగా చేసిన రూ.2,14,062 కోట్ల ఖర్చుకు అసెంబ్లీ ఆమోదం పొందాల్సి ఉంది. ఇది ప్రజావనరుల నిర్వహణలో క్రమశిక్షణ రాహిత్యమే. ► దళితబంధు కోసం రూ.1,000 కోట్లు కేటాయించారు. కానీ వినియోగ పద్దులో రూ.4,442 కోట్లు ఖర్చు చూపెట్టారు. వాస్తవంగా ఖర్చయినది రూ.2,101 కోట్లు మాత్రమే. అనర్హులకు ‘ఆసరా’తో రూ.1,175 కోట్లు నష్టం అర్హతలేని 2.02 లక్షల మందికి లబ్ధి కలిగిందన్న కాగ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ కేటగిరీల కింద అనర్హులకు ఆసరా పింఛన్లు అందుతున్నాయని కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక పేర్కొంది. పంచాయతీరాజ్–గ్రామీణాభివృద్ధి శాఖ కొందరు లబ్ధిదారులను అనర్హులుగా గుర్తించినా కూడా వారిని జాబితా నుంచి తొలగించారని తెలిపింది. దీనితో 2021 మార్చి 31తో ముగిసిన (2020–21) ఆర్థిక సంవత్సరంలో 2.02 లక్షల మంది అనర్హులకు రూ.1,175 కోట్ల మేర అక్రమ చెల్లింపులు జరిగినట్టు తేల్చింది. కుటుంబ ఆదాయానికి సంబంధించిన సిస్టమ్లో అంతర్గతంగా కచ్చితమైన నియంత్రణలు లేవని.. దీనితో నిర్దేశిత పరిమితి కంటే ఎక్కువ ఆదాయమున్నవారికీ లబ్ధి కలిగిందని తెలిపింది. సమగ్ర కుటుంబ సర్వే (ఎస్కేఎస్) డేటాలోని వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని 16శాతం కుటుంబాలకు ఆసరా పింఛన్లకు అర్హత లేదని స్పష్టమవుతోందని, అయినా పింఛన్ దరఖాస్తుల పరిశీలన, మంజూరు, గుర్తింపు ప్రక్రియలను సమర్థవంతంగా చేయలేదని తప్పుపట్టింది. 2018 ఏప్రిల్ నుంచి 2021 మార్చి మధ్య సగటున నెలకు 2.30 లక్షల (6 శాతం) మంది లబ్ధిదారులకు పింఛన్ల చెల్లింపు జరగలేదని పేర్కొంది. ఇసుక విధానంలో లోపాలతో ఖజానాకు గండి ఇసుక వెలికితీతలో టీఎస్ఎండీసీ తీరును తప్పుపట్టిన కాగ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇసుక విధానంలోని లోపాలతో, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ) తీరుతో ఖజానాకు నష్టం వాటిల్లిందని ‘కాగ్’పేర్కొంది. టీఎస్ఎండీసీతో ఒప్పందం కుదుర్చుకున్న గిరిజన సంఘాలు నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలను సబ్ లీజ్కు అప్పగించడంతో.. థర్డ్ పార్టీకి రూ.11.61 కోట్లు అనుచిత లబ్ధి జరిగిందని పేర్కొంది. దుమ్ముగూడెం వద్ద ఇసుక కాంట్రాక్టర్లకు చెల్లించే ధర నిర్ణయంలో ఆలస్యంతో రూ.172.64 కోట్ల మేర ప్రభుత్వం ఆదాయం కోల్పోయిందని పేర్కొంది. అధిక లోడింగ్, వాహనాల కదలికలను గుర్తించే సీసీ కెమెరాలు, జీపీఎస్ పరికరాలను అరకొరగా ఏర్పాటు చేయడం సరికాదని తెలిపింది. ఇసుక రేవులు, నిల్వ కేంద్రాల కార్యకలాపాలపై టీఎస్ఎండీసీ పర్యవేక్షణ లోపభూయిష్టమని పేర్కొంది. అనుమతులు లేకుండా చేపట్టిన తవ్వకాలతో 2022 మార్చి నాటికి రూ.108.96 కోట్ల మేర ప్రభుత్వ ఆదాయానికి గండిపడిందని కాగ్ తెలిపింది. 2016–21 మధ్య రూ.171.32 కోట్లు రహదారి చార్జీలు వసూలైతే.. అందులో ప్రభుత్వం రూ.162.27 కోట్లను ఇతర ప్రయోజనాలకు మళ్లించిందని పేర్కొంది. -
బడ్జెట్లో కానరాని ‘కల్యాణలక్ష్మి’
సిద్దిపేట జోన్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను బడ్జెట్లో విస్మరించిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేటలోని స్థానిక క్యాంపు కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారు లకు నగదుతోపాటు తులం బంగారం ఇస్తామన్న కాంగ్రెస్ బడ్జెట్లో ఆ ఊసే ఎత్తలేదన్నారు. అలాగే మైనార్టీలకు పెద్దపీట వేస్తామని చెప్పి నిధుల కేటాయింపులో మొండి చెయ్యి చూపిందని విమర్శించారు. బడ్జెట్లో మైనార్టీలకు రూ.4 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి, నేడు రూ.2,200 కోట్లే కేటాయించిందని, రెండు నెలలుగా వృద్ధులకు పింఛన్లు కూడా అందడం లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 13 లక్షల పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు రూ.12 వేల కోట్ల ఆర్థిక సాయం చేసిందని గుర్తు చేశారు. వ్యవసాయానికి కనీసం 16 గంటలు కూడా విద్యుత్ ఇవ్వడం లేదని, పంటలు ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. సిద్దిపేట ప్రాంతానికి చెందిన మైనార్టీల ఉమ్రా యాత్ర కోసం తన సొంత డబ్బు వెచ్చిస్తున్నట్లు హరీశ్రావు తెలిపారు.
Related News by category
-
బెదిరింపుల పర్వం!
సాక్షి ప్రతినిధి, కడప: ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తే, దరిదాపుల్లో కూడా నిలవలేం. అవకాశం ఉన్న చోట పోలింగ్ ఏకపక్షంగా నిర్వహించుకునే చర్యలు చేపట్టాలి. అందుకు ఎవరి స్థాయిలో వారు పనిచేయండి. నా ప్రమేయం అవసరమైన చోట చెప్పండి. నేనే స్వయంగా రంగంలోకి దిగుతా. నయానో.. భయానో ఈమారు అనుకూలంగా మలుచుకోవాలి. ఎవరి పాత్ర వారు సమర్థవంతంగా నిర్వర్తించండి. మరీ ముఖ్యంగా ఈ ఏడు గ్రామాల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.. అని జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి కుటుంబ సభ్యులకు దిశా–నిర్దేశం చేశారు. ఆపై బెదిరింపుల పర్వానికి తెరలేపుతున్నారు. దేవగుడి పరిసర ప్రాంతాలైన గొరిగెనూరు, ధర్మాపురం, సున్నపురాళ్లపల్లె, పెద్దదండ్లూరు, సుగమంచిపల్లె, శేషారెడ్డిపల్లె, శిరిగేపల్లె గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అనుచరులుగా ఉన్నప్పుడు ఆయా గ్రామాల ప్రజలు దేవగుడి కుటుంబానికి మద్దతుగా ఉండేవారు. దేవగుడి సోదరులు తెలుగుదేశం పారీ్టలో చేరిన తర్వాత అదే గ్రామాలకు చెందిన వారు వైఎస్ కుటుంబం వెంట నడుస్తూ వైఎస్సార్సీపీకి మద్దతుగా నిలిచారు. తాజాగా బీజేపీ అభ్యర్థిగా ఆదినారాయణరెడ్డి తెరపైకి వచ్చాక, ఇప్పుడు అవే గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించారు. సోదరులను ఆయా నేతలపైకి ఉసిగొల్పారు. సౌమ్యంగా మద్దతు కోరండి, డబ్బు ఆశ చూపండి, అప్పటికీ మీమాట వినని వారితో నేను స్వయంగా మాట్లాడతా.. తర్వాత దౌర్జన్యం చేసేందుకు కూడా వెనుకడవద్దని వెల్లడించినట్లు విశ్వసనీయ సమాచారం. అందులో భాగంగా ఇప్పటికే ఆ ఏడు గ్రామాలకు చెందిన నాయకులతో వివిధ సందర్భాల్లో మాట్లాడుతూ మంచిగా మద్దతు కోరుతున్నట్లు సమాచారం. రాబోవు రోజుల్లో మరింత స్పీడు పెంచి భయపెట్టుకోవాలనే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తే... ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలకు వెళ్తే దరిదాపుల్లో కూడా పోటీలో నిలువలేమనే అంచనాకు దేవగుడి సోదరులు వచ్చినట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో దాదాపు 87 శాతం ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందినట్లు గుర్తించారు. ఓటుకు వెళ్తే అభ్యర్థులతో నిమిత్తం లేకుండా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అండగా వైఎస్సార్సీపీకి మద్దతు లభిస్తున్నట్లు గ్రహించారు. ఇక పాత తరహాలో పోలింగ్ చేపట్టకపోతే ఉపయోగం లేదనే అంచనాకు వచ్చారు. ఈ క్రమంలోనే మైలవరం మండలంలో ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన ఓ సర్పంచ్పై బెదిరింపులకు దిగినట్లు తెలిసింది. వైఎస్సార్సీపీకి ప్రచారం వరకే పరిమితం కావాలని, పోలింగ్కు మూడు రోజుల ముందు నుంచి గ్రామంలో ఉండొద్దని హెచ్చరించినట్లు తెలిసింది. నియోజకవర్గ వ్యాప్తంగా ఇదే సూత్రాన్ని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. పాత రోజులను గుర్తు చేయవద్దనే తరహాలో బెదిరిస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. పరిస్థితిని బట్టి డబ్బులకు మెత్తబడే వారిని డబ్బుతో వశపరుచుకోవాలని, అలా కాదన్నవారి విషయాలపై దౌర్జన్యాకు సైతం వెనుకాడవద్దనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటి నుంచే పటిష్టమైన చర్యలు చేపట్టి గ్రామస్థాయి నేతలు భయభాంత్రులకు గురి కాకుండా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
సమస్య ఏదైనా.. సత్తిబాబు మీ వెంటున్నాడు..
ఎంవీపీ కాలనీ: ‘మీ సమస్య ఏదైనా.. ఏ అవసరమొచ్చినా బొత్స సత్తిబాబు మీ వెంట ఉన్నాడు. అన్నదమ్ముడిగా మీ మధ్య పెరిగాను.. మీ ప్రోత్సాహంతోనే రాజకీయాల్లో ఈ స్థాయికి చేరాను.. ఆ ఆదరణ ఎల్లప్పుడూ నాకు, మా పార్టీకి కావాలి’అంటూ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్ర వాసుల ఎదుట తన ఆకాంక్షను వెల్లడించారు. విశాఖ నగరంలో నివసిస్తున్న ఉత్తరాంధ్ర వాసుల ఆత్మీయ సమావేశం లాసన్స్ బే కాలనీలోని వైఎస్సార్సీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ కార్యాలయంలో జరిగింది.మంత్రితో పాటు బొత్స ఝాన్సీ పాల్గొని ఉత్తరాంధ్ర వాసులను ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రజల అభివృద్ధే లక్ష్యంగా రాజకీయాల్లో సేవలు అందించానన్నారు. ఇందుకు అనుగుణంగానే ఉత్తరాంధ్ర ప్రజానీకం తనకు, తన కుటుంబానికి వెన్నుముకగా నిలిచిందన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల తరువాత కూడా తమ నుంచి మునుపటి భరోసాను పొందవచ్చునన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు ఉత్తరాంధ్ర ప్రజలంతా అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ అభ్యర్థుల గెలుపునకు సైనికుల్లా పనిచేసి అఖండ మెజారీ్టతో గెలిపించాలని కోరారు. రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక పేజీ ఉండాలన్నదే సీఎం జగన్మోహన్రెడ్డి ఆకాంక్ష అని మంత్రి బొత్స పేర్కొన్నారు.ఇందుకు అనుగుణంగానే అవినీతికి తావులేకుండా రాష్ట్ర ప్రజలకు ఐదేళ్లుగా సుపరిపాలన అందించడంతో పాటు పేదల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా సీఎం జగన్ పాలన సాగించారన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే సీఎం జగన్ వంటి నాయకుడు దేశ రాజకీయ చరిత్రలో లేరన్నారు. మేనిఫెస్టో ద్వారా రాష్ట్ర ప్రజలకు నమ్మకం, భరోసా, ధైర్యం అందించారన్నారు. ప్రతిపక్ష పార్టీల మాదిరిగా ఎలాంటి బూటకపు హామీలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ మాట్లాడుతూ ప్రజల అవసరాలు తీర్చిడమే సీఎం జగన్ అజెండా అన్నారు. లక్ష కోట్లతో విజన్ విశాఖ పేరిట నగరాన్ని అభివృద్ధి చేసేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయానికి ఉత్తరాంధ్ర వాసులు కష్టపడి పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు కోలా గురువులు, తదితరులు పాల్గొన్నారు. -
నా పేరు గణ.. నా అరాచకాలేంటో.. పదేళ్లలో చూసే ఉంటారు...
నా పేరు గణ.. నా అరాచకాలేంటో.. పదేళ్లలో చూసే ఉంటారు. ఈ ఎన్నికల్లో మీరు సపోర్ట్ చేయకపోతే నా గూండాయిజం మళ్లీ చూస్తారు. నా వెంట లేకపోతే మీ అంతు చూస్తా.. ఖబడ్దార్.. ఈ డైలాగ్లు ఏదో యాక్షన్ సినిమాలో వీధి రౌడీ చెప్పిన మాటలు కాదు.. పశ్చిమ నియోజకవర్గ ప్రజలు రెండు పర్యాయాలు గుణవంతుడని ఎమ్మెల్యేగా ఎన్నుకున్న అక్రమాల గణబాబు హెచ్చరికలు. ఓటమి భయంతో.. టీడీపీ అధినేత చంద్రబాబు ఎలాగైతే.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారో.. అదే తానుముక్కైన గణబాబు కూడా బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారు. సాక్షి, విశాఖపట్నం : ప్రచారం పేరుతో విశాఖ పశ్చిమ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గణబాబు వస్తున్నాడంటే వ్యాపారులు బెదిరిపోతున్నారు. చిన్న చిన్న దుకాణదారులు హడలిపోతున్నారు. బడా బంగారు వ్యాపారులు భయపడుతున్నారు. ఆర్పీ లు ఆందోళన చెందుతున్నారు. రోడ్డుపై తోపుడు బళ్లు వ్యాపారులు బిక్కుబిక్కుమంటున్నారు. ఎవరు కనిపించినా.. నవ్వుతూ పలకరిస్తూ.. ఆత్మీయ ఆలింగనం చేసుకుంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్కుమార్ ఓటర్లను అభ్యర్థిస్తుంటే.. టీడీపీ అభ్యర్థి గణబాబు మాత్రం బెదిరింపు రాజకీయాలతో బెదరగొడుతున్నారు.బెదిరింపులకు నాలుగు బ్యాచ్లు ఎన్నికల్లో తనకు సహకరించకపోతే భవిష్యత్లో సమస్యలు తప్పవని గణబాబు.. నియోజకవర్గంలోని వ్యాపారస్తులు, వ్యాపార సంస్థల యజమానులను బెదిరిస్తున్నారని కొందరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వ్యాపారులను బెదిరించేందుకు గణబాబు తన అనుచరులను నాలుగు బ్యాచ్లుగా విభజించి.. వస్త్ర వ్యాపారుల ను ఒక బ్యాచ్, బంగారు వ్యాపారులను మరో బ్యాచ్, కిరాణా దుకాణాలవైపు ఇంకో బ్యాచ్, మిగిలిన వాటిని కవర్ చేస్తూ మరో బ్యాచ్ పశ్చిమ నియోజకవర్గంలో హల్చల్ చేస్తున్నాయి. ఆయా వర్తక సంఘాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను గణబాబు రప్పించుకొని వేలు చూపిస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు సమాచారం. ఇలాంటి వ్యక్తి గెలిస్తే నియోజకవర్గాన్ని గూండాల చేతిలో పెట్టేటట్లుగా ఉన్నారంటూ వ్యాపారులు హడలిపోతున్నారు.ఫిర్యాదులు చేస్తామని ఆర్పీలకు బెదిరింపు స్వయం సహాయక బృందాల్లో కీలకంగా వ్యవహరించే రిసోర్స్ పర్సన్స్(ఆర్పీ) ఏ ఒక్క పార్టీకి కొమ్ముకాయకుండా వ్యవహరిస్తున్నారు. అయితే.. వీరిపైనా గణబాబు బెదిరింపుల బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తూ వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఇటీవలే కొందరు ఆర్పీలను మభ్యపెట్టేందుకు కాసులపేర్లను బహూకరించారు. ఆర్పీలు తీసుకోమని చెప్పడంతో వారందర్నీ బెదిరించారు. దీంతో ఒకరిద్దరు గణబాబు గూండాయిజానికి భయపడి తీసుకున్నారు. మిగిలిన వారు మాత్రం తాము ఏ పార్టీకి సపోర్ట్ చేయమనీ.. స్వయం సహాయక బృందాల అభివృద్ధి కోసమే తమని ప్రభుత్వాలు నియమించాయని కరాఖండిగా చెప్పడంతో గణబాబు అహం దెబ్బతింది.దీంతో తనకు సహకరించని ఆర్పీలపై గణబాబు వర్గం ఎన్నికల సంఘానికి తప్పుడు ఫిర్యాదులు చేయడం ప్రారంభించింది. గతంలో ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్న ఫొటోల్ని సంపాదించి.. ఆ ఫొటోలతో బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని కొందరు ఆర్పీలు వాపోతున్నారు. పాత ఫొటోల ద్వారా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ముందుగా ఆర్పీలకు ఆ ఫొటోలు చూపించి.. మీరు తన తరఫున ప్రచారం చేయకపోతే.. ఈ ఫొటోలతో ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తాననీ.. అప్పుడు మీ ఉద్యోగాలు ఊడిపోతాయంటూ గణబాబు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. గణబాబు బ్లాక్ మెయిల్ రాజకీయాలు పశ్చిమ నియోజకవర్గాన్ని కుదిపేస్తున్నాయి. దిగజారుడు బెదిరింపులతో చిల్లర రాజకీయాలు చేస్తున్న గణబాబు అరాచకాలకు ఫుల్స్టాప్ పెట్టేందుకు నియోజకవర్గ ప్రజలు సిద్ధమవుతున్నారు. -
రంగారెడ్డి జిల్లా.. విభిన్నతల ఖిల్లా!
సాక్షి, హైదరాబాద్: పల్లె.. పట్నం కలబోత. భౌగోళికంగా ఏడు జిల్లాల సరిహద్దులతో విస్తరించి ఉన్న అరుదైన ఘనత. తెలంగాణలోనే శరవేగంగా విస్తరిస్తోంది రంగారెడ్డి జిల్లా. ఐటీ, పారిశ్రామిక, రియల్ ఎస్టేట్ రంగాల్లో దూసుకుపోతోంది. జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఈ జిల్లా ప్రస్తుతం కొంత విభిన్న పరిస్థితులను ఎదుర్కొంటోంది. తెలంగాణలోనే కాదు.. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రంగారెడ్డి జిల్లా అయిదు లోక్సభ స్థానాల పరిధిలో విస్తరించి ఉండటం.. ఇటు రాజకీయంగానే కాదు అటు పరిపాలనా పరంగా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం ఒక్కో లోక్సభ స్థానం పరిధిలో కొనసాగుతుండటంతో ఎన్నికల రిటరి్నంగ్ అధికారులకే కాదు, పోలీసు యంత్రాంగానికి కొత్త చిక్కులు తప్పడం లేదు. దేశంలోనే మొదటి స్థానంలో మల్కాజిగిరి.. దేశంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న జాబితాలో మల్కాజిగిరి మొదటిస్థానంలో ఉంది. మల్కాజిగిరి. కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, కంటోన్మెంట్, మేడ్చల్ సహా జిల్లాలోని ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఇదే పార్లమెంట్ పరిధిలో కొనసాగుతోంది. ఇక్కడ మొత్తం 37,28,417 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో ఎల్బీనగర్ ఓటర్లే 6,00,552 మంది ఉండటం విశేషం. అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించడంలో జిల్లా పరిధిలోని ఎల్బీనగర్కు చెందిన ఓటర్లే కీలక పాత్ర పోషించబోతున్నారు. తెలంగాణలో చేవెళ్ల రెండోది.. తెలంగాణలో అత్యధిక ఓటర్లు ఉన్న రెండో అతిపెద్ద లోక్సభ స్థానంగా చేవెళ్లకు గుర్తింపు ఉంది. వికారాబాద్, పరిగి, తాండురు సహా రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజక వర్గాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ మొత్తం 29,19,465 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో చేవెళ్ల, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లికి చెందిన వారే 21,72,811 మంది ఓటర్లు ఉండటం గమనార్హం. అక్కడి అభ్యర్థులు..ఇక్కడి ఓటర్లు రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గం భువనగిరి లోక్సభ స్థానం పరిధిలో కొనసాగుతోంది. ఈ లోక్సభ స్థానంలో 18,04,930 మంది ఓటర్లు ఉండగా, వీరిలో ఒక్క ఇబ్రహీంపట్నంలోనే 3,37,134 మంది ఓటర్లు ఉన్నారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధిక ఓటర్లు ఇక్కడే ఉండటం, అభ్యర్థుల గెలుపోటములు వీరిపైనే ప్రధానంగా ఆధారపడ్డాయి. ⇒ జిల్లాలోని కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నాగర్కర్నూల్ లోక్సభ పరిధిలో కొనసాగుతోంది. ఈ లోక్సభ స్థానంలో మొత్తం 17,34,773 మంది ఓటర్లు ఉండగా, వీరిలో కల్వకుర్తికి చెందిన వారు 2,43,098 మంది ఉన్నారు. ⇒ షాద్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం మహబూబ్నగర్ లోక్సభ స్థానం పరిధిలో కొనసాగుతోంది. ఈ స్థానంలో 16,80,417 మంది ఓటర్లు ఉండగా, వీరిలో షాద్నగర్ ఓటర్లే 2,38,392 మంది ఉన్నారు. ఆయా పారీ్టల అభ్యర్థుల జయాపజయాలను జిల్లా ఓటర్లే నిర్దేశించనున్నారు. -
ప్రియాంక విజయానికి ‘స్పెషల్ 24’!
యూపీలోని కాంగ్రెస్ కంచుకోట రాయ్ బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ విషయమై పార్టీ అధిష్టానం ఏ క్షణంలోనైనా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. రాయ్బరేలీలో ఎన్నికల నిర్వహణ కోసం రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ 24 మంది సభ్యులతో కూడిన సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. దీనిలో అసెంబ్లీ ప్రతినిధులు, ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, జిల్లా కాంగ్రెస్ కమిటీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.రాయ్బరేలీ నుంచి ఎవరు పోటీ చేయనున్నారనేది కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించనున్నారు. తాజాగా జరిగిన కాంగ్రెస్ సెంట్రల్ కోర్ కమిటీ సమావేశంలో మల్లికార్జున్ ఖర్గేకు టికెట్ ఖరారు చేసే అధికారాన్ని పార్టీ అధిష్టానం అప్పగించింది. ప్రస్తుతానికి ప్రియాంకగాంధీ పేరు ఫైనల్ అయినట్లు భావిస్తున్నప్పటికీ, అధిష్టానం అధికారికంగా ప్రకటించలేదు.రాయ్బరేలీ లోక్సభ ఎన్నికల కోసం సోనియా గాంధీ ప్రత్యేకంగా 24 మంది సభ్యులతో కూడిన సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో సోనియాగాంధీతోపాటు ఆమె ప్రతినిధి కేఎల్ శర్మ, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పంకజ్ తివారీ, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు ధీరజ్ శ్రీవాస్తవ, బచ్రావాన్ ఎమ్మెల్యే సుశీల్ పాసి, హర్చంద్పూర్ మాజీ ఎమ్మెల్యే సురేంద్ర విక్రమ్సింగ్, డాక్టర్ మనీష్ సింగ్ చౌహాన్, సరేని ఎమ్మెల్యే సుధా ద్వివేది, అతుల్ సింగ్, ఉంచహార్ ఎమ్మేల్యే సాహబ్ శరణ్ పాశ్వాన్, రాయ్బరేలీ మున్సిపాలిటీ అధ్యక్షుడు శత్రోహన్ సోంకర్, లాల్ గంజ్ నగర్ పంచాయతీ అధ్యక్షురాలు సరితా గుప్తా, రాయ్ బరేలీ మాజీ అధ్యక్షుడు ఇలియాస్, ఏఐసీసీ మాజీ సభ్యుడు కళ్యాణ్ సింగ్ గాంధీ, డీడీసీకి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత వీకే శుక్లాలు ఉన్నారు. ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్, ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జ్ అవినాష్ పాండే, రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆరాధన మిశ్రా రాయ్బరేలీ ఎన్నికల్లో వ్యూహకర్తలుగా కీలక పాత్ర పోషిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
Advertisement
Photos
View allVideo
View allబ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
కదన రంగంలోకి కమల దళపతులు
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- సడన్ బ్రేక్... జీవితాలనే మార్చేసింది
- బెదిరింపుల పర్వం!
- సమస్య ఏదైనా.. సత్తిబాబు మీ వెంటున్నాడు..
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
- దుబాయ్లో అతి పెద్ద విమానాశ్రయం.. ప్రత్యేకతలు ఇవే..
- నా పేరు గణ.. నా అరాచకాలేంటో.. పదేళ్లలో చూసే ఉంటారు...
- ప్రియాంక విజయానికి ‘స్పెషల్ 24’!
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement