'నాని ఆవేదన అర్థమైంది' | Sakshi
Sakshi News home page

'నాని ఆవేదన అర్థమైంది'

Published Fri, Dec 26 2014 1:10 PM

'నాని ఆవేదన అర్థమైంది' - Sakshi

విజయవాడ: ఎంపీ కేశినేని నాని ఆవేదన తనకు అర్థమైందని ఏపీ మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి నారాయణ శుక్రవారం విజయవాడలో అన్నారు. తమ మధ్య కొంత సమన్వయలోపం ఉన్న మాట వాస్తవమే అని ఆయన అంగీకరించారు. ఇక ముందు అందరం కలిసి నిర్ణయాలు తీసుకుని పని చేస్తామని నారాయణ చెప్పారు.

మంత్రి పి. నారాయణ శుక్రవారం విజయవాడ నగరంలోని ఆటోనగర్లో పర్యటించారు. ఈ సందర్బంగా స్థానిక ఎంపీ కేశినేని నాని ఉన్నతాధికారులు అనుసరిస్తున్న వైఖరిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరంతా భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ చెప్పినట్లు నడుచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఏ అంశంలోనూ దేవినేని ఉమ... తమను సంప్రదించడం లేదని కేశినేని నాని అసంతృప్తి వెలిబుచ్చారు.

అలాగే అధికారులు కూడా ఏ విషయాన్ని తమ దృష్టికి తీసుకురావటం లేదని విమర్శించారు. నగరంలో జరిగే ఏ విషయాల్లోనైనా మంత్రిని ఒక్కరినే సంప్రదిస్తే సరిపోదని... నగర ఎమ్మెల్యేలు, ఎంపీలను కూడా కలుపుకొని వెళ్లాలని సూచించారు. కేశినేని నాని వ్యాఖ్యలపై పి.నారాయణ పై విధంగా స్పందించారు.

Advertisement
Advertisement