సిఎం కిరణ్ గారూ సర్వేలు చూసి భయపడుతున్నారా?: గట్టు | Sakshi
Sakshi News home page

సిఎం కిరణ్ గారూ సర్వేలు చూసి భయపడుతున్నారా?: గట్టు

Published Sat, Dec 7 2013 7:48 PM

సిఎం కిరణ్ గారూ సర్వేలు చూసి భయపడుతున్నారా?: గట్టు - Sakshi

హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారూ సర్వేలు చూసి భయపడుతున్నారా? అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్ర రావు ప్రశ్నించారు. వైఎస్ జగన్మోహన రెడ్డిని ఉద్దేశించి సీఎం చేసిన వ్యాఖ్యలను గట్టుతోపాటు వైఎస్ఆర్ సిపి నాయకురాళ్లు శోభానాగిరెడ్డి, వాసిరెడ్డి పద్మ ఖండించారు. ఇప్పుడొచ్చిన ఈ ఆవేశం నాలుగు నెలల క్రితం ఏమైందని అడిగారు.

 సమైక్యం కోసం మీరు చేసిందేమిటి? అని సీఎంను ప్రశ్నించారు. కిరణ్ కుమార్ రెడ్డి‌, చంద్రబాబు నాయుడు ఇద్దరూ సమైక్య చీడపురుగులని వారు విమర్శించారు.

Advertisement
Advertisement