ఫలించని గాలింపు చర్యలు
చెరువు వద్ద కుటుంబ సభ్యుల రోదన
రెండో రోజూ లభ్యంకాని మృతదేహం
పలమనేరు: పలమనేరు మండలం కరి డిమడుగు సమీపంలోని అటవీ ప్రాంత ంలో క్రిష్ణమనాయని చెరువులో విహా రానికెళ్లి నీట మునిగిన రియాజ్ అలి యాస్ అబ్బు (22) మృతదేహం సోమవారం సాయంత్రం వరకు కూడా కానరాలేదు. ఈ చెరువులో రెండ్రోజులుగా పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లు గాలి స్తున్నా లాభం లేకపోయింది. శవం దా నంతట అదే తేలితే గానీ ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. ఆదివారం స్నేహితులతో కలసి చెరువులో ఈతకెళ్లి రియాజ్ నీట మునిగిన విషయం తెలిసిందే. అ ప్పటి నుంచి మృతదేహం కోసం గాలిం పు సాగుతూనే ఉంది. ఇప్పటికే చెరువు లో చాలా వరకు గాలింపు చేపట్టామ ని, ఇక కొంత భాగం మాత్రమే మిగిలి ఉం దని ఎస్ఐ రవినాయక్ తెలిపారు. రి యాజ్ కుటుంబ సభ్యులు చెరువు వద్దే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నేటి ఉదయం తిరిగి గాలింపు చేపట్టనున్నా రు.
మృతదేహం వెతుకుతూ మృత్యువాత..
రియాజ్ మృతదేహం కోసం గాలిస్తున్న గజ ఈతగాళ్లలో పలమనేరుకు చెందిన రెడ్డిప్రకాష్(52) ఉన్నారు. రెండు రో జు లుగా చలి ఎక్కువగా ఉండడం, నీళ్లలో మునుగుతూ ఉండడంతో ఊపిరి ఆడక ఆయన సోమవారం సాయంత్రం మృతి చెందాడు. రెడ్డిప్రకాష్ చేపలు పట్టుకుం టూ కుటుంబాన్ని పోషించేవాడు. ఆయన కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కు టుంబ పెద్ద మృతితో వారు దిక్కులేని వారయ్యారు. తమకు దిక్కెవరంటూ కు టుంబ సభ్యులు రోదించడం పలువురికి కలచివేసింది.
ఇక శవం తేలితేనే!
Published Tue, Jan 13 2015 2:47 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement