పెద్దారవీడు, న్యూస్లైన్ : పాత కక్షల నేపథ్యంలో ఓ యువకుడిని ప్రత్యర్థులు నడిరోడ్డుపై గొడ్డలితో నరికి చంపారు. ఈ ఘటన తోకపల్లె సమీపంలోని తీగలేరు బ్రిడ్జి వద్ద గురువారం సాయంత్రం జరిగింది. వివరాలు.. గొబ్బూరుకు చెందిన గోతం వెంకటేశ్వర్లు(35) కొద్ది రోజుల నుంచి మార్కాపురం పూలసుబ్బయ్య కాలనీలో నివసిస్తున్నాడు. త్రిపురాంతకం మండలం సోమేపల్లిలో నివసిస్తున్న తన సోదరులు కృష్ణ, శ్రీనుల వద్దకు వెంకటేశ్వర్లు బైకుపై వెళ్లాడు.
తన అన్న కుమారుడు శివతో కలిసి తిరిగి మార్కాపురం వస్తుండగా మార్గమధ్యంలో ప్రత్యర్థులు కాపుగాసి వెంకటేశ్వర్లును హైవేపై అడ్డగించారు. ఆ బాలుడిని పక్కకు తీసి వెంకటేశ్వర్లు తలపై రాయితో విచక్షణారహితంగా మోదారు. గొంతుపై గోడ్డళ్లతో నరకటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ సమయంలో బాలుడు బిత్తరపోయి పెద్దగా ఏడ్వటం ప్రారంభించాడు. ఆ రహదారిపై నిత్యం వాహనాలు తిరుగుతుంటాయి. హంతకులు క్షణాల్లో తమ ప్రత్యర్థిని చంపి పరారయ్యారు. నిందితులు కూడా బైకులపై వచ్చినట్లు సమాచారం.
ప్రతీకారం తీర్చుకున్న హంతకులు
రెండేళ్ల కిందట గొబ్బూరు బీసీ కాలనీలో నివసిస్తున్న నాలి సాంబయ్యను చంపిన కేసులో వెంకటేశ్వర్లు మొదటి ముద్దాయి. ఆయన తాలుకా మనుషులే వెంకటేశ్వర్లును చంపి ప్రతీకారం తీర్చుకుని ఉంటారని సంఘటనా స్థలం వద్దకు వచ్చిన గొబ్బూరు వాసులు అనుమానం వ్యక్తం చేశారు. మృతుడు చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. కొన్నేళ్ల కిందట స్వగ్రామం గొబ్బూరు విడిచి వెళ్లి మార్కాపురం, త్రిపురాంతకం మండలంలోని సోమేపల్లిలో వెంకటేశ్వర్లు సోదరులు నివాసం ఉంటున్నారు. మృతునికి భార్య, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.
హత్య జరగడంతో హైవేరోడ్డుకు ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. తహశీల్దార్ గర్నెపూడి లెవి, వీఆర్వో అచ్చయ్య, మార్కాపురం రూరల్, పట్టణ ఎస్సైలు దేవకుమార్, రాంబాబు, ఏఎస్సై సుదర్శనం, రైటర్ రామకృష్ణారెడ్డిలు సంఘటన స్థలానికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించారు. పెద్దారవీడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రతీకారం తీర్చుకున్న హంతకులు
Published Fri, Jun 6 2014 2:58 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నందీశ్వరస్వామికి విశేషపూజలు
కేఎంసీలో పలువురు వైద్యుల బదిలీ
టీడీపీపై ప్రజల తిరుగుబాటు
నయవంచకుడు చంద్రబాబు
ప్రకృతి వ్యవసాయంతోనేల ఆరోగ్యం
బీసీ స్వగ్రామంలోనే టీడీపీకి షాక్
మాటిచ్చాడంటే.. చేస్తాడంతే
చంద్రబాబు కేరాఫ్ కరువు
కర్నూలు టీడీపీలో ‘పోల్ మేనేజ్మెంట్’ కేటుగాళ్లు!
మళ్లీ వచ్చేది ప్రజా ప్రభుత్వమే!
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement