మోడల్ బోగీని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి
2015 మార్చి నాటికి పట్టాలపైకి రైలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరానికి మెట్రోరైలు మరో మణిహారం అని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి అభివర్ణించారు. కొరియాలోని హ్యుండాయ్ రోటన్ కంపెనీ నుంచి దిగుమతి చేసుకున్న మెట్రోరైలు నమూనా కోచ్(బోగీ)ను బుధవారం నెక్లెస్రోడ్డులోని పీవీ జ్ఞానఘాట్ వద్ద ప్రజల సందర్శనార్థం సీఎం ఆవిష్కరించారు. అనంతరం డ్రైవర్ సీట్లో కూర్చుని ఎలక్ట్రానిక్ యంత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రూ.14 వేల కోట్ల వ్యయంతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు తొలిదశ 2015 మార్చి 31వ తేదీ నాటికి ప్రారంభమవుతుందని తెలిపారు. పీవీ ఎక్స్ప్రెస్ వే, ఔటర్ రింగ్రోడ్డుతో పాటు మెట్రోరైలు నగరంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరుస్తుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
అంతకుముందు హైదరాబాద్ మెట్రోరైలు లిమిటెడ్ ఎమ్డీ ఎన్వీఎస్ రెడ్డి ఈ కోచ్ విశేషాలను వివరించారు. ‘ఇది పూర్తి ఎయిర్ కండిషన్డ్ బోగీ. ప్రారంభంలో ఒక్కో రైలుకు మూడు బోగీలు ఉంటాయి. ఒక్కో రైల్లో వెయ్యిమంది వరకు ప్రయాణించవచ్చు. ప్రయాణీకుల సంఖ్య పెరిగిన కొద్దీ గరిష్టంగా ఆరు బోగీలు ఏర్పాటుచేస్తాం. నిలుచుని ప్రయాణించేవారికి ఎక్కువ స్థలం కేటాయించినందువల్ల ఒక్కో రైలులో 126 మంది కూర్చుని వెళితే, 848 మంది నిలుచుని ప్రయాణించాల్సి ఉంటుంది. రైలు సరాసరి వేగం గంటకు 33 కిలోమీటర్లు. గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.
ప్యాసింజర్ అడ్రస్ సిస్టమ్ ద్వారా రైల్వేస్టేషన్ సమీపిస్తున్న విషయాన్ని, ఎటువైపు తలుపులు తెరుచుకుంటాయనే వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. అన్ని కోచ్లలో సీసీటీవీలుంటాయి..’ అని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ కోచ్ను నెలరోజులపాటు ప్ర జల సందర్శనార్థం నెక్లెస్ రోడ్డులో ఉంచుతామని, ఆ తరువాత అందరికీ అందుబాటులో ఉండేలా మరోస్థానంలో ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. మంత్రులు దానం నాగేందర్, ముఖేష్గౌడ్, కాసు వెంకటకృష్ణారెడ్డి, ఎల్ అండ్ టీ ఎమ్డీ గాడ్గిల్, హ్యుండాయ్ ప్రతినిధులు పాల్గొన్నారు.
బోగీలో ఉండే సౌకర్యాలివే...
24 రూట్ మ్యాప్లు ఫుల్ ఏసీ
12 ఎల్సీడీ టీవీలు
మొబైల్, ల్యాప్టాప్ చార్జింగ్ సాకెట్లు
వైఫై, ఇంటర్నెట్ సదుపాయం
సీసీటీవీలతో నిరంతర నిఘా
బోగీలో బ్యాటరీ బ్యాక్అప్ ఫుల్
నిరంతరాయంగా ఎల్ఈడీ కాంతులు
అగ్నిప్రమాదాల నివారణకు ఉపకరణాలు, ఆక్సీజన్ సిలిండర్లు
వికలాంగులు, వృద్ధులు కూర్చునేందుకు అనువైన సీట్లు ఆటోమేటిక్ ట్రెయిన్ ప్రొటెక్షన్, ఆపరేషన్, పర్యవేక్షణ
ఎమర్జెన్సీలోఆటోమేటిక్గా మోగే అలారం
సమీపించే స్టేషన్ పేరును తెలుగు, హిందీ, ఇంగ్లిష్లో తెలిపే ప్యాసింజర్ అడ్రస్ సిస్టం
న్యుమాటిక్ ఎమర్జెన్సీ ఎయిర్బ్రేక్ వ్యవస్థతో కుదుపులు లేని ప్రయాణం
బ్రేకులు వేసినపుడు విద్యుత్ ఉత్పత్తి జరిగి బోగీకి ఉపయోగపడుతుంది.
మరో మణిహారం మెట్రో
Published Thu, Oct 3 2013 5:03 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement