* ప్రతి నాలుగు వార్డులకో ఖాళీ స్థలం ఎంపిక చేయాలి
* పట్టణ స్థానిక సంస్థలకు పురపాలక శాఖ ఆదేశాలు
అమలాపురం టౌన్ : పట్టణాల్లో సేకరించే పొడి చెత్త నుంచి ఆదాయాన్ని రాబట్టాలని పురపాలక శాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి మున్సిపాలిటీలకు మార్గదర్శకాలు పంపింది. వాడి పారేసే ప్లాస్టిక్ సామాన్లు, పాలిథిన్ కవర్లు, ప్లాస్టిక్ బాటిళ్ల వంటివి పొడి చెత్త కేటగిరీలోకి వస్తాయి. అలాగే పట్టణాల్లోని ఆసుపత్రులు, ల్యాబ్లు తదితర చోట్ల నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువగా వస్తాయి. ఇవి పర్యావరణానికి హాని కలిగిస్తాయి. వీటిని ఎక్కడికక్కడ చెత్తకుప్పల్లో పాడేస్తారు. వాటిని ఓ క్రమ పద్ధతిలో సేకరించి ఏకమొత్తంగా విక్రయిస్తే కిలో ప్లాస్టిక్ వస్తువులకు రూ.10 నుంచి రూ.20 వరకూ ఆదాయం వచ్చే వీలుంది.
దీనిపై పురపాలక శాఖ దృష్టి సారించింది. పారిశుధ్య సిబ్బంది రోజూ వీధులను శుభ్రం చేస్తూ, చెత్త సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నప్పుడు పొడి చెత్తను వేరేగా సేకరించే ఏర్పాట్లు చేయనున్నారు. ప్రస్తుతం నగరాలు, పట్టణాల్లోని డ్రెయిన్లలో కూడా ప్లాస్టిక్ వ్యర్థాలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. వీటిల్లో పూడికలు తీసేటప్పుడు ఇకనుంచి పొడి చెత్తను వేరేగా సేకరించనున్నారు.
ప్రతి నాలుగు వార్డులకో పాయింట్
పొడి చెత్తను సేకరించిన తర్వాత దానిని ఓచోట వేసి, ఆ తర్వాత విక్రయించేందుకు వీలుగా మున్సిపాలిటీలో ప్రతి నాలుగు వార్డులకో స్థలాన్ని ఎంపిక చేయాలని పురపాలక శాఖ ఆదేశించింది. ఆ ఖాళీ స్థలంలో రోజువారీ సేకరించిన పొడిచెత్తను గ్రేడింగ్ చేసి విక్రయించేలా చేయాలని సూచించింది. ఇప్పటికే మున్సిపాలిటీల్లో సేకరిస్తున్న మామూలు చెత్తను పోసేందుకు సరైన డంపింగ్ యార్డులు లేవు.
ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ పొడిచెత్త పేరుతో నాలుగు వార్డులకో ఖాళీ స్థలం ఎంపిక చేయటం ఇబ్బందేనని పారిశుధ్య సిబ్బంది అంటున్నారు. పెపైచ్చు రోజూ పొడి చెత్తను సేకరించి దానిని విక్రయించి ఆదాయ వనరుగా మార్చటం కూడా సాధ్యం కాదేమోనని కొందరు అంటున్నారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలూ ఈ ఆదేశాలకు ఇప్పటికే ఆమోద ముద్ర కూడా వేశాయి. అయితే అమలు ఎప్పటినుంచి మొదలవుతుందో వేచి చూడాలి.
ఇక చెత్త నుంచీ ఆదాయం
Published Sat, Dec 13 2014 1:13 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement