ఏలూరు : పేదలకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేందుకు ప్రారంభించిన దీపం పథకం క్రమంగా కొండెక్కుతోంది. మహిళల కష్టాలను తొలగించేది టీడీపీ ప్రభుత్వమేనంటూ ప్రకటనలు గుప్పిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. దీపం గ్యాస్ కనెక్షన్ల మంజూరు విషయాన్ని పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీపం పథకంలో గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయాలని మహిళలు మొరపెట్టుకుంటున్నా ఫలితం మాత్రం ఉండడం లేదు.
పెండింగ్లో దరఖాస్తులు
రెండేళ్లుగా దీపం గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయడం లేదు. దీంతో వేల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. గత ఎన్నికల సమయానికి జిల్లాలో 65 వేల మంది మహిళలు దరఖాస్తులు చేసుకున్నారు. ఎన్నికలకు ముందు దీపం గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఆయిల్ కంపెనీలకు ప్రభుత్వ తరఫున నుంచి సబ్సిడీ మొత్తాలను డిపాజిట్ చేయకపోవడంతో పాత దరఖాస్తులన్నింటిని టీడీపీ ప్రభుత్వం రద్దు చేసింది. రద్దు చేసి నాలుగు నెలలైనా కొత్త కనెక్షన్ల పంపిణీకి షెడ్యూల్ను విడుదల చేయలేదు. కొత్త షెడ్యూల్ విడుదలైతే మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు మహిళలు వేచి చూస్తున్నారు. అయితే టీడీపీ ప్రభుత్వం స్పందించడం లేదు.
40 వేల కనెక్షన్లు మంజూరన్నారు.. 22 వేలు ఇచ్చారు
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత మహిళల వంటింటి కష్టాలను గటెక్కిస్తామంటూ జిల్లాకు 40 వేల దీపం కనెక్షన్లు మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. సెప్టెంబర్లో జిల్లా పర్యటనకు వచ్చిన ఆమె ఆర్భాటంగా ప్రకటించారు. కానీ 22 వేల కనెక్షన్లు మంజూరు చేస్తూ జిల్లా పౌరసరఫరాల శాఖకు ఉత్తర్వులు వచ్చాయి. అయితే ఆయిల్ కంపెనీల వారీగా ఈ కనెక్షన్లు కేటాయింపు జరగకపోవడంతో అవి పెండింగ్లోనే ఉన్నాయి. దీంతో అవి ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెల కొంది. మహిళల కట్టెల కష్టాలను తొలగించేందుకు దీపం కనెక్షన్లు ఇచ్చింది మేమే అంటూ మహిళల మెప్పు కోసం పాకులాడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు కొత్త కనెక్షన్లు ఇచ్చే విషయంలో జాప్యం చేస్తుండడంపై మహిళల్లో సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ప్రభుత్వం ఆదేశిస్తే నెల రోజుల్లో ఇచ్చేస్తాం
దీపం గ్యాస్ కనెక్షన్లు పంపిణీ విషయంలో ప్రభుత్వం షెడ్యూల్ ఇస్తే నెల రోజుల్లోనే పంపిణీ చేస్తామని డీఎస్వో డి.శివశంకరరెడ్డి తెలిపారు. ఏయే కంపెనీలను ఏయే మండలాలకు కేటాయించారో స్పష్టంగా షెడ్యూల్ వస్తే గ్యాస్ కనెక్షన్ల పంపిణీని ప్రారంభిస్తామని చెప్పారు. మండలాల్లో కొత్త వాటికి దరఖాస్తులను తీసుకోవడంతో పాటు వాటిని రెవెన్యూ, పౌరసరఫరాలు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో కలిసి విచారణ చేశాకే మంజూరు ఇస్తామన్నారు. దీనికి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉందన్నారు.
కొండెక్కుతున్న ‘దీపం’
Published Thu, Nov 6 2014 3:06 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Haryana: మైనార్టీలో బీజేపీ! మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు
దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్
తెలంగాణ: మళ్లీ భారీ వర్షం కురిసే ఛాన్స్
శతక్కొట్టిన ఆటపట్టు.. టీ20 వరల్డ్కప్ క్వాలిఫయర్ ఛాంపియన్గా శ్రీలంక
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్
హీరోయిన్ జాన్వీ కపూర్.. తిరుపతిలో పెళ్లి చేసుకోనుందా?
సీవీడ్తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..!
మిస్టర్ బీస్ట్ బర్త్డే గిఫ్ట్ : ఖరీదైన టెస్లా కారు కావాలా నాయనా?
తప్పక చదవండి
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- ఓటు వేద్దాం ఇలా.!
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
Advertisement