అనుమానంతో ఒకరి హత్య, ఇద్దరికీ గాయాలు | Sakshi
Sakshi News home page

అనుమానంతో ఒకరి హత్య, ఇద్దరికీ గాయాలు

Published Thu, May 12 2016 9:31 AM

man murdered in krishna district

తిరుపూరు : కృష్ణాజిల్లా తిరుపూరు మండలం ఏ.కొండూరు తండాలో వివాహేతర సంబంధం అనుమానంతో ఒక వ్యక్తిని కత్తితో నరికి చంపిన సంఘటన గురువారం చోటు చేసుకుంది.  భూక్యా జాను(38) అనే వ్యక్తిని దుండగుడు కత్తితో నరికి హతమార్చాడు. అడ్డొచ్చిన భూక్యా జాను భార్య జ్యోతి, కుమారుడు బాలాజి నాయక్‌ను కూడా దుండగుడు  తీవ్రంగా గాయపర్చాడు.

అనంతరం అతడు పరారైయ్యాడు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను తిరుపూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుని కోసం గాలిస్తున్నారు.
 

Advertisement
Advertisement