వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మేం వ్యతిరేకం కాదు | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మేం వ్యతిరేకం కాదు

Published Fri, Jan 23 2015 3:27 AM

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మేం వ్యతిరేకం కాదు - Sakshi

నమ్మించి మోసగించడం చంద్రబాబు నైజం - మందకృష్ణ

కడప: నమ్మించి మోసగించడం చంద్రబాబు నైజమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నిప్పులు చెరిగారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు ఎస్సీ వర్గీకరణను చేపట్టి పెద్ద మాదిగనవుతానని చెప్పడంతోపాటు ఆయనను నమ్మి ఓట్లేశామన్నారు.  రాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టాక చంద్రబాబు మాదిగలను నిండా ముంచారన్నారు. గురువారం వైఎస్సార్ జిల్లా కడపలో ఎమ్మార్పీఎస్, ఎంఈఎఫ్ సదస్సు జరిగింది.

ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నమ్మించి మోసగించిన చంద్రబాబుకు ఉద్యమాలతోనే బుద్దిచెప్పాలని, మాదిగలతో ఆయన పతనం తప్పదని హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి తాము వ్యతిరేకం కాదన్నారు. కేవలం అప్పుడు ఆ పార్టీలో ఉన్న జూపూడి ప్రభాకర్ కారణంగానే మద్దతు తెలుపలేకపోయామన్నారు.

Advertisement
Advertisement