ఒంగోలు సెంట్రల్ : ప్రభుత్వం వద్ద నిధులు లేవనే సాకుతో మహిళా గ్రూపులకు ఉపయోగకరమైన ఆమ్ఆద్మీ బీమాను నిలిపి వేసింది. ఈ పథకానికి సంబంధించి తక్షణం రెన్యూవల్స్ను నిలిపి వేయాలని డీఆర్డీఏ అధికారులకు మంగళవారం ఆదేశించింది. దీంతో ఈ పథకంలో సభ్యులుగా ఉన్న మొత్తం 1,70,735 మంది పరిస్థితి అయోమయంగా తయారైంది. వీరందరినీ రెన్యూవల్ చేయాల్సిందిగా గత నెలలో రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పటి వరకూ జిల్లాలో కేవలం 27,000 మందిని మాత్రమే రెన్యూవల్ చేశారు.
మిగిలిన వారిని కుడా రెన్యూవల్ చేసే హడావుడిలో ఉండగా మంగళవారం ఈ ఉత్తర్వులు విడుదల కావడంతో నిలిపేశారు. 1,70,735 మందికి రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలు కలిపి చెల్లించేది సంవత్సరానికి 5,12,20,500, అయితే ప్రస్తుతం రెన్యూవల్ అయిన 27,000 మంది లబ్ధిదారులకు 8,10,000 మాత్రము చెల్లిస్తే సరిపోతుంది. మిగతా సభ్యులకు సాయం అర్ధంతరంగా ఆపేయడంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది.
ఆమ్ ఆద్మీ పథకం ప్రయోజనం ఇలా...
తెల్ల కార్డుదారులు, భూమిలేని వ్యవసాయదారులు ఈ పథకం కింద అర్హులు. రూ.15 సర్వీసు చార్జీలు కింద చెల్లించాలి. కేంద్ర ప్రభుత్వ వాటా కింద రూ.150, రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద రూ.150 చెల్లిస్తారు. లబ్ధిదారుడు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.75 వేలు, శాశ్వత అంగవైకల్యం కలిగితే రూ.75 వేలు, పాక్షిక వైకల్యానికి రూ.37,500 సాధారణ మరణానికి రూ.30 వేలు బీమాగా చెల్లిస్తారు. ఒక కుటుంబంలో ఒక పాలసీ ఉంటే ఇద్దరు పిల్లలకు నెలకు రూ.1200 చొప్పున ఉపకార వేతనాలను కుడా అందిస్తారు.
సరాసరిన ఏటా జిల్లాలో 2000 మంది మరణిస్తుంటారు. వీరికి ఒక్కొక్కరికి కనీసంగా 30,000 వేలు చెల్లించినా సంవత్సరానికి రూ. 6 కోట్లు అదనపు భారం ప్రభుత్వం మీద పడుతుంది. దాదాపు 20,000పైగా విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఉపకార వేతనాలకుగానూ రెండున్నర కోట్లు ప్రతి సంవత్సరం ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిధులన్నీ ఇక ముందు విడుదలయ్యే అవకాశం లేదు.
ఆమ్ ఆద్మీకి మంగళం
Published Wed, Mar 11 2015 3:59 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement