రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో దారుణం చోటు చేసుకుంది. వివాహితని అసభ్యంగా చిత్రీకరించి యువకులు తరచు వేధించారు. దాంతో వివాహిత ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...శానిటోరియం చెంచులిపేటకు చెందిన పండా ఉషా అనే వివాహితకు చెందిన ఫోటోలను గువ్వల బాలాజీ అలియాస్ బాలు అనే యువకుడు అతడి స్నేహితులు సెల్ఫోన్లో చిత్రీకరించి...ఆమెను తరచు వేధించసాగారు. ఆ వేధింపులు భరించలేక ఆదివారం ఆమె ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె చనిపోతూ పోలీసులకు లేఖ రాసింది.
గువ్వల బాలరాజు అతడి స్నేహితులు తనను మానసికంగా వేధించారంటూ ఆ లేఖలో పేర్కొంది. దాంతో రాజానగరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు చెప్పారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.