సాక్షి, అమరావతి: పోలీసులపై ఆధారపడిన వారి తల్లిదండ్రులకు ఆరోగ్య భద్రత పథకంలో వైద్య సేవలు విస్తరించేలా రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏఆర్ అనురాధ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిర్దేశించిన నెట్వర్క్ ఆసుపత్రులు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో పోలీస్ కుటుంబాలకు వైద్య సేవల కోసం నిమ్స్ తరహా ప్యాకేజీలను అందిస్తున్నారు.
అత్యవసర వైద్య సేవలు చేయించుకున్న వారు మెడికల్ బిల్లులు సమర్పిస్తే రీయింబర్స్మెంట్ ఇస్తున్నారు. డీజీపీ నండూరి సాంబశివరావు ప్రతిపాదనలతో ఇకపై ఆరోగ్య భద్రత స్కీమ్లో పోలీసుల తల్లిదండ్రులకు వైద్య సేవలు అందించేలా నిర్ణయం తీసుకున్నట్టు అనురాధ ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Breadcrumb
పోలీసుల తల్లిదండ్రులకు వైద్య సేవలు
Published Sat, Dec 10 2016 2:56 AM
Related news
-
మీ ఆరోగ్యానికి పూచీ మాది
సాక్షి, అమరావతి: ప్రజారోగ్య పరిరక్షణ వ్యవస్థలో అంబులెన్స్లు కీలక పాత్ర పోషిస్తాయి. స్వతహాగా వైద్యుడైన మాజీ సీఎం వైఎస్సార్ ఆ విషయాన్ని గుర్తించి ఉమ్మడి రాష్ట్రంలో 108 అంబులెన్స్, గ్రామీణ వైద్య సేవల కోసం 104 మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయూ) వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఈ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచింది. ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఇంత గొప్ప వ్యవస్థ 2014–19 మధ్య బాబు పాలనలో నిర్విర్యమైంది. తర్వాత ప్రజారోగ్యం పట్ల చిత్తశుద్ధి కలిగిన సీఎం వైఎస్ జగన్ గడిచిన ఐదేళ్ల పాలనలో 108, 104 వ్యవస్థకు పూర్వ వైభవం తెచ్చారు. వైఎస్సార్ కన్నా మరో రెండడుగులు ముందుకు వేసి దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దారు. 108 అంబులెన్స్లు 768, ఎంఎంయూలు 936, వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు 500 చొప్పున అందుబాటులోకి తెచ్చి వైద్య పరంగా సేవలందించారు. మొత్తంగా 2,204 వాహనాల ద్వారా ప్రభుత్వ రంగంలో దేశంలోనే అతిపెద్ద వ్యవస్థను నెలకొల్పారు. దేశంలో అగ్రస్థానంలో ఏపీ దేశంలో అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో సుమారు 25 కోట్లకుపైగా ప్రజలకు 988 అంబులెన్స్లు ఉన్నాయి. యూపీ కంటే ఐదు రెట్లు తక్కువ జనాభా ఉన్న ఏపీలో 768 అంబులెన్స్లు సేవలందిస్తున్నారు. ఏపీ కంటే పెద్ద రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, గుజరాత్లో తక్కువ సంఖ్యలో అంబులెన్స్లు ఉండటం గమనార్హం. ఏపీలో సగటున 64,306 మందికి ఒక అంబులెన్స్ ఉంది. తెలంగాణలో 75,524 మందికి, కర్ణాటకలో 85,929 మందికి, యూపీలో 2,00,200 మందికి, గుజరాత్లో 1,15,000 మందికి, అస్సాంలో 1,15,000 మందికి తమిళనాడులో 1,18,000 మందికి ఒకటి చొప్పున అంబులెన్స్లు ఉన్నాయి. గిరిజన ప్రాంతాలకు సేవల విస్తరణ 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి 108 అంబులెన్స్లు 336 లే ఉన్నాయి. అంటే అప్పట్లో 679 మండలాలు (ప్రస్తుతం 686) ఉంటే మండలానికి ఒక అంబులెన్స్ కూడా లేదు. దీంతో సీఎం జగన్ 2020 జూలై1న 412 కొత్త 108 అంబులెన్స్లు ప్రారంభించారు. 26 నియోనాటల్ అంబులెన్స్ సేవలు తీసుకొచ్చారు. దీంతో అంబులెన్స్ల సంఖ్య 748కు పెరిగింది. దీనికి రూ.96.5 కోట్లు ఖర్చు చేశారు. 2022 అక్టోబర్లో అదనంగా మరో 20 అంబులెన్స్లు గిరిజన ప్రాంతాల్లో చేర్చారు. దీనికి రూ.4.76 కోట్లు వెచి్చంచారు. ఈ క్రమంలో 108 అంబులెన్స్ల సంఖ్య 768కి చేరింది. 2023లో 2.5 లక్షల కిలో మీటర్లు తిరిగిన పాత వాహనాలను తొలగించి 146 కొత్త అంబులెన్స్లు కొనుగోలు చేసింది. ఇందుకు రూ.34.79 కోట్లు ఖర్చు చేసింది. ప్రతి నెలా 108 అంబులెన్స్ల నిర్వహణ కోసం రూ.14.39 కోట్లు వెచి్చస్తోంది. అంటే ఏడాదికి రూ.172.68 కోట్లు కేవలం 108 అంబులెన్స్ల నిర్వహణ కోసం కేటాయిస్తోంది. ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ కోసం ఏడాదికి రూ.15.88 కోట్లు ఖర్చు చేస్తోంది. రోజుకు సగటున 3 వేలకు పైగా అత్యవసర కేసుల్లో అంబులెన్స్లు సేవల్లో ఉన్నాయి. 2020 జూలై నుంచి 43 లక్షల మంది ప్రాణాలను 108 అంబులెన్స్లు కాపాడాయి. పల్లె చెంతకే వైద్యులు వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ కార్యక్రమం కింద 500 వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. బాబు పాలనలో ఒక వాహనంలోనే ఆస్పత్రుల నుంచి ఇద్దరు, ముగ్గురు బాలింతలను ఇళ్లకు తరలించేవారు. ఈ ప్రభుత్వంలో విశాలమైన ఎకో మోడల్ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చి ఏసీ వాహనంలో ఒక బాలింతను, ఆమె సహాయకులను మాత్రమే ఇంటి వరకూ సురక్షితంగా చేరుస్తున్నారు. గతంలో ఒక ట్రిప్పునకు కేవలం రూ. 499 మాత్రమే ఖర్చు చేస్తుండగా, ప్రస్తుతం రూ.895 ఖర్చు చేస్తున్నారు. 2022 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకూ 4 లక్షల మందికిపైగా బాలింతలు, గర్భిణులు ఈ సేవలను పొందారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా పల్లె ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ప్రతీ పీహెచ్సీ వైద్యుడు నెలలో రెండుసార్లు పల్లెలకు 104 ఎంఎంయూలతో పాటు వెళుతున్నారు. అన్ని పల్లెలను నెలలో రెండుసార్లు సందర్శించేందుకు వీలుగా 936 ఎంఎంయూలను సమకూర్చారు. ఈ విధానంలో 2022 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు 3 కోట్లకు పైగా వైద్య సేవలను ప్రభుత్వం అందించింది. -
ప్రభుత్వ ఆస్పత్రులకు ప్రజాదరణ
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఆస్పత్రులకు ప్రజాదరణ పెరిగింది. పట్టణాల్లోనూ ఇంటి పక్కనే సర్కారు వైద్యం అందుబాటులోకి వచ్చింది. ప్రాథమిక స్థాయి నుంచి ఆస్పత్రులను సీఎం వైఎస్ జగన్ సర్కారు బలోపేతం చేయడంతో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో(యూపీహెచ్సీ)నూ సకల పరీక్షలు, వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. నాడు–నేడు పేరుతో యూపీహెచ్సీల్లో సౌకర్యాలు, వైద్య పరీక్షలు, అవసరమైన మందులతో పాటు ఇద్దరేసి వైద్యులు, నర్సుల్ని రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. సుమారు రూ.700 కోట్లతో వీటిని ఆధునికీకరించారు. ఫలితంగా ఇప్పుడు యూపీహెచ్సీలకు వైద్య సేవల కోసం వెళ్తున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. చంద్రబాబు హయాంలో పడకేసిన వైద్యం చంద్రబాబు హయాంలో యూపీహెచ్సీల్లో వైద్య పరీక్షలతోపాటు అన్ని సేవలనూ ప్రైవేట్ పరం చేయడమే కాకుండా వైద్యులు, నర్సులను భర్తీ చేయలేదు. టీడీపీ పాలనలో యూపీహెచ్సీలపై నిర్లక్ష్యం వహించడంతో ప్రజలు యూపీహెచ్సీల వైపు చూసేవారు కాదు. చిన్నపాటి అనారోగ్యమైనా జనమంతా ప్రైవేట్ ఆస్పత్రులకే వెళ్లాల్సిన దుస్థితి ఉండేది. అప్పట్లో నెలకు కేవలం వేల సంఖ్యలోనే ఔట్ పేషెంట్ల సేవలందేవి. ఇందుకు ప్రధాన కారణం వైద్య పరికరాలు, వైద్యులు, మందులు అందుబాటులో ఉండేది కాదు. దీంతో ప్రజలంతా ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సి వచ్చేదని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పేర్కొంటున్నారు. ఇప్పుడు అన్ని రకాల వైద్య పరీక్షలు, మందులు, వైద్యులు అందుబాటులో ఉండటంతో యూపీహెచ్సీలకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని, అప్పటికి ఇప్పటికీ ఇదే మార్పు అని వైద్యులతోపాటు పేషెంట్లు సైతం చెబుతున్నారు. ఇంతలోనే.. ఎంతో మార్పు సీఎం వైఎస్ జగన్ వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి.. సంపూర్ణ సౌకర్యాలు సమకూర్చడంతోపాటు వైద్యులు, వైద్య సిబ్బందిని భారీగా నియమించారు. ఫలితంగా పట్టణ పేదలు, మధ్యతరగతి ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రుల గడప తొక్కడం మానేసి.. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్తున్నారు. ఫలితంగా యూపీహెచ్సీలకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. గర్భిణి పరీక్షల నుంచి చిన్నపాటి సుస్తీ చేసినా వైద్య సేవలకు, పరీక్షలకు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ప్రజలు వెళ్తున్నారు. మొత్తం 65 రకాల పరీక్షలు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులోకి వచ్చాయి. దీంతో యూపీహెచ్సీలలో ఔట్ పేషెంట్ల సంఖ్య భారీగా పెరిగింది. 2023 ఏప్రిల్ నుంచి 2024 ఫిబ్రవరి వరకు 542 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రికార్డు స్థాయిలో 61.47 లక్షల మందికి ఔట్ పేషెంట్ సేవలను అందించారు. అంటే రోజుకు సగటున ఒక్కో యూపీహెచ్సీలో 40 మందికి పైగా ఔట్ పేషెంట్ సేవలు అందించారు. హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (హెచ్ఎంఎస్) ద్వారా ఔట్ పేషెంట్ల డేటాను నమోదు చేశారు. మరోవైపు 2022 ఫిబ్రవరి నుంచి 542 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గత నెల 21వ తేదీ వరకు 92,82,536 ల్యాబ్ పరీక్షలు సైతం నిర్వహించారు. ఖరీదైన పరీక్షలు ఉచితం గత ప్రభుత్వంలో గర్భిణి పరీక్షల్ని ప్రైవేట్ ల్యాబ్లో చేయించుకోవాల్సి వచ్చేది. ఇందుకు అధిక మొత్తంలో డబ్బులు ఖర్చయ్యేవి. వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాలు రావడంతో ఖరీదైన వైద్య పరీక్షల్ని సైతం ఉచితంగా పొందగలుగుతున్నాం. ఆర్థిక స్థోమత లేకపోతే కేజీహెచ్కి వెళ్లే వాళ్లం. ఇప్పుడు సమీపంలోని ఇసుక తోటలో పట్టణ ఆరోగ్య కేంద్రాలు రావడంతో ఆరోగ్యానికి భరోసా లభించింది. – పి.సుజాత, గర్భిణి, మద్దిల పాలెం, విశాఖపట్నం నాణ్యమైన వైద్య సేవలందుతున్నాయి పట్టణాల్లో వైఎస్సార్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేసి పేదలకు అత్యాధునిక, నాణ్యమైన వైద్యం అందిస్తోంది. ప్రజలకు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా పెద్దాస్పత్రికి పరుగులు తీయాల్సిన అవసరం లేకుండా ఇంటి పక్కనే వైద్యం అందుతోంది. టీడీపీ హయాంలో ప్రభుత్వ వైద్యం అందేది కాదు. చిన్నపాటి ఆరోగ్య సమస్య వచ్చినా దూర ప్రాంతాలకు వెళాల్సి వచ్చేది. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి ఆర్థికంగా ఇబ్బందులు పడేవాళ్లం. సీఎం వైఎస్ జగన్పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సౌకర్యాలు కల్పించడంతో పేదలకు ఉచితంగా ఆరోగ్య సేవలు అందుతున్నాయి. పరీక్షలన్నీ ఇక్కడే చేస్తున్నారు. ముందులు కూడా ఉచితంగా ఇస్తున్నారు. – సూరాడ ఈశ్వరమ్మ, 12వ డివిజన్, సంజయ్ నగర్, కాకినాడ -
30 లక్షల మందికి సేవల దిశగా ఆరోగ్య సురక్ష–2
సాక్షి, అమరావతి: ప్రజారోగ్య పరిరక్షణకు పెద్దపీట వేస్తూ ప్రతి ఒక్కరి ఆరోగ్య సమస్యను పరిష్కరించే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ‘జగనన్న ఆరోగ్య సురక్ష (జేఏఎస్)’ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. 30 లక్షల మందికి వైద్య సేవల దిశగా రెండో దశ ఆరోగ్య సురక్ష కార్యక్రమం (జేఏఎస్–2) కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరిలో ప్రారంభమైన రెండో దశ కార్యక్రమంలో నిర్దేశిత షెడ్యూల్ మేరకు గ్రామాలు, వార్డుల్లో శిబిరాలను ఏర్పాటు చేసి, స్పెషలిస్ట్ వైద్యుల ద్వారా ప్రభుత్వం ప్రజలకు సేవలందిస్తోంది. ప్రతి జిల్లాలో సగం మండలాల్లో మంగళవారం, మిగిలిన సగం మండలాల్లో శుక్రవారం శిబిరాలు నిర్వహిస్తున్నారు. పట్టణ, నగరాల్లో బుధవారం శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో మండలంలో గ్రామీణంలో వారానికి ఒక గ్రామం చొప్పున, పట్టణాల్లో ఒక వార్డు చొప్పున ఆరు నెలల్లో రాష్ట్రం మొత్తం శిబిరాలను నిర్వహించేలా కార్యాచరణ రూపొందించారు. ఒక్కో శిబిరంలో సగటున 362 మందికి సేవలు జేఏఎస్ –2 లో రాష్ట్రవ్యాప్తంగా 13,954 శిబిరాలను నిర్వహించనున్నారు. ఇప్పటివరకూ 7,974 శిబిరాలు నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో 5,929 శిబిరాలు, పట్టణ ప్రాంతాల్లో 2,045 నిబిరాలు నిర్వహించారు. ఒక్కో శిబిరంలో సగటున 362 మంది చొప్పున 28,79,408 మందికి ఇప్పటివరకూ వైద్య సేవలందించారు. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 1.63 లక్షలు, నంద్యాలలో 1.51 లక్షలు, వైఎస్సార్ జిల్లాలో 1.44 లక్షల మంది ప్రజలు వైద్యం చేయించుకున్నారు. వైద్య పరీక్షల నిర్వహణకు 7 రకాల కిట్లను, ఈసీజీ, ఇతర పరికరాలను, వందల సంఖ్యలో మందులను శిబిరాల్లో అందుబాటులో ఉంచారు. శిబిరాలకు వద్దకు వచ్చి సేవలు అందుకున్న వ్యక్తుల్లో సుమారు 13 వేల మందికి ఆస్పత్రుల్లో చికిత్సలు అవసరమని వైద్యులు నిర్ధారించి, దగ్గరలోని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు రెఫర్ చేశారు. వారందరినీ ఆస్పత్రులకు తరలించి వైద్య సేవలందించేలా స్థానిక పీహెచ్సీ వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే 5 వేల మంది ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందుకున్నారు. ప్రజలకు సొంత ఊళ్లలోనే స్పెషలిస్ట్ వైద్య సేవలందించేందుకు 543 మంది జనరల్ మెడిసిన్, 645 మంది గైనకాలజీ, 349 మంది జనరల్ సర్జన్లు, 345 ఆర్థోపెడిక్, 378 మంది ఇతర స్పెషలిస్ట్ వైద్యులు, 3 వేల మంది వరకూ వైద్యులు, కంటి సమస్యల గుర్తింపునకు 562 మంది ఆప్తాల్మిక్ ఆఫీసర్లు పనిచేస్తున్నారు. -
విప్లవ భేరి
ఐదేళ్ల కిందట అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 151 స్థానాలను గెలవటం ఓ విప్లవం.. ఆ తర్వాత.. స్కూళ్లు, విద్యార్థుల నుంచి.. చెప్పే చదువుల వరకూ విద్యా రంగం సమూలంగా మారింది. ఇంటికే వైద్యులు, గ్రామాల్లోనే పరీక్షలు సహా... పేదల ప్రతి చికిత్సకూ ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందుతోంది. ఆర్బీకేల నుంచి పంటల కొనుగోళ్లు, బీమా వరకూ ప్రతి చర్యా రైతుకు భరోసా ఇస్తోంది. ఈ రాష్ట్ర మహిళలకు సొంతింటి పట్టాలున్నాయి. సొంత కాళ్లపై నిలబడగలిగే సత్తా ఉంది. ఇవే కాదు.. ఇంటింటికీ పథకాలు చేరవేసే వలంటీర్లు, గ్రామాల్లో పాలన భవనాలు, వ్యవసాయ– వైద్యారోగ్య కేంద్రాలు.. ఇవన్నీ ఐదేళ్లలోనే. కోవిడ్ కబళించిన రెండేళ్లను మినహాయిస్తే మూడేళ్లలోనే ఇంతటి సంక్షేమాభివృద్ధితో కూడిన విప్లవాన్ని... బహుశా ఈ రాష్ట్రమే కాదు.. ఏ రాష్ట్రమూ ఇదివరకెన్నడూ చూడలేదు. సమాజంలోని అట్టడుగు వర్గాలనూ అభివృద్ధిలో భాగం చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన ఫలితమే ఈ విప్లవం. అందుకే దేశంలో ఏ నాయకుడూ చెప్పని విధంగా ఆయన ధైర్యంగా జనానికి ఓ మాట చెబుతున్నారు. ‘గత ఎన్నికల ముందు చేస్తానని చెప్పినవన్నీ చేశా. మీ కుటుంబానికి మంచి జరిగిందని మీరు నమ్మితేనే మళ్లీ నాకు ఓటెయ్యండి’ అని. ఇలాంటి నాయకత్వమే అసలైన విప్లవం. విప్లవంతోనే చరిత్ర మారుతుంది. దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేలా విప్లవాత్మక మార్పులతో గత 58 నెలలుగా రాష్ట్రంలో పాలన సాగుతోంది. ఇదివరకెన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సుపరిపాలన అందిస్తున్నారు. గత ఎన్నికల్లో 50 శాతం ఓట్లు, 151 శాసనసభ (86.28 శాతం), 22 లోక్సభ (88 శాతం) స్థానాల్లో వైఎస్సార్సీపీ చరిత్రాత్మక విజయం సాధించింది. 2019 మే 30న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వేదికపై నుంచే సుపరిపాలనకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. గత పాలకులకు భిన్నంగా మేనిఫెస్టోనే దిక్సూచిగా పరిపాలిస్తున్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేసి.. మద్యపాన నియంత్రణ, సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం) రద్దు వంటి వాటిని ఎందుకు అమలు చేయలేదో సహేతకమైన కారణాలు చెప్పడం ద్వారా విశ్వసనీయతను చాటుకున్నారు. దేశ చరిత్రలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేయడం ఇదే ప్రథమం కావడం గమనార్హం. సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించాక పరిపాలనలో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. గ్రామ, వార్డు సచివాలయాలు.. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ ద్వారా పరిపాలనను వికేంద్రీకరించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి భారీ ఎత్తున ఉద్యోగాల నియామకాలు చేపట్టారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా రాష్ట్రంలో 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే.. అందులో 58 నెలల్లో నియమించిన వారే 2.13 లక్షలు కావడం గమనార్హం. ఒకే నోటిఫికేషన్ ద్వారా గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.34 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసి రికార్డు సృష్టించారు. దేశ చరిత్రలో ఇంత భారీ ఎత్తున ఉద్యోగులను నియమించడం ఇదే ప్రథమం. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 50 ఇళ్లకూ.. పట్టణాల్లో 75 నుంచి వంద ఇళ్లకు ఒకరు చొప్పున 2.65 లక్షల మంది వలంటీర్లను నియమించారు. గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలు అందిస్తున్నారు. –సాక్షి, అమరావతి -
వైద్యరంగంలో సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మకమైన మార్పులు
వైద్యరంగంలో సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మకమైన మార్పులు
Related News by category
-
మే నెలలోనూ పింఛన్దారులకు కష్టాలే!
కర్నూలు(అగ్రికల్చర్): టీడీపీ నేతల కుట్రలు, కుతంత్రాల కారణంగా పింఛన్దారుల కష్టాలు తొలగిపోలేదు. మే నెలలో కూడా పింఛన్ పొందేందుకు అవస్థలు తప్పేలా లేవు. దాదాపు ఐదేళ్లుగా వార్డు, గ్రామ వలంటీర్ల ద్వారా ఇంటింటికి చేరుతున్న పింఛన్ను అడ్డుకున్నది టీడీపీ వారేనన్న విషయం అందరికీ తెలిసిందే. వలంటీర్లతో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే అక్కసుతో టీడీపీ అధినేత చంద్రబాబు శిష్యుడు నిమ్మగడ్డ రమేష్కుమార్ కోర్టులను, ఎన్నికల కమిషన్ను ఆశ్రయించారు. పింఛన్ల పంపిణీతో సహా సంక్షేమ పథకాల అమలులో వలంటీర్లను వినియోగించరాదని, వారిని పూర్తిగా పక్కన పెట్టాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. దీంతో పింఛన్దారులకు మొదటిసారిగా ఏప్రిల్ నెలలో కష్టాలు మొదలయ్యాయి. ఎర్రటి ఎండలో ముదిమి వయస్సులో పింఛన్ కోసం రోడ్డు ఎక్కాల్సిన దుస్థితి వచ్చింది. 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సమయంలోసచివాయాలకు వెళ్లాల్సి రావడంతో వడదెబ్బ, ఇతర కారణాలతో 35 మంది మృత్యువాత పడ్డారు. టీడీపీ నేతల కుట్రల ఫలితంగా మే నెలలో కూడా పింఛన్ల పంపిణీలో ఇబ్బందులు ఎదుర్కోక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే మే నెల పింఛన్ల పంపిణీలో అధికారులు కొన్ని మార్పులు చేశారు.నగదు బదిలీ సాధ్యమేనా? పింఛన్ల పంపిణీలో మే నెల డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానాన్ని అమలు చేస్తున్నారు.లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా పింఛన్ మొత్తం బదిలీ చేయనున్నారు. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంగా బాధపడుతున్న వారు, మంచం పట్టి వీల్చైర్కు పరిమితమైన వారు, సైనిక్ సంక్షేమ పింఛన్లు పొందుతున్న వారికి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఇంటిదగ్గరే పింఛన్లు పంపిణీ చేస్తారు. మిగిలిన కేటగిరీ పింఛన్దారులకు డీబీటీ ద్వారా బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేస్తారు. డీబీటీ పరిధిలోకి రాని వారికి మాత్రం 3వ తేదీ నుంచి నగదు రూపంలో ఇంటి వద్దనే పింఛన్ పంపిణీ చేస్తారు. చాలా మంది పింఛన్దారులకు బ్యాంకు ఖాతాలు లేవు.డీబీటీ ద్వారా బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ ఎంతవరకు విజయవంతం అవుతుందనే ప్రశ్న తలెత్తుతోంది. ఠంచన్గా ఒకటో తేదీనే పింఛన్ సొమ్ము చేతితో పడితే ఆ ఆనందమే వేరు. డీబీటీ ద్వారా బ్యాంకు ఖాతాలకు జమ చేస్తే నగదు కోసం మళ్లీ బ్యాంకులకు వెళ్లకతప్పని పరిస్థితి ఏర్పడుతుంది. అవ్వాతాతలు, వితంతువులైన అక్కచెల్లెమ్మలు, ఇతర పింఛన్దారులకు టీడీపీ నేతల కుట్రలతో కష్టాలు మొదలయ్యాయనేది బహిరంగ రహస్యమే. తమకు కష్టాలను తెచ్చి పెట్టిన వారికి ఓటుద్వారా బుద్ధి చెబుతామని అవ్వాతాతలు స్పష్టం చేస్తున్నారు. మే నెల పింఛన్ల పంపిణీ 5వ తేదీ వరకు జరగనుంది. మే నెలలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 4,68,742 పింఛన్లకు రూ.139.82 కోట్ల నిధులు విడుదల అయ్యాయి. కర్నూలు జిల్లాలో 2,46,340 పింఛన్లకు రూ.73,74,49,500, నంద్యాల జిల్లాలో 2,22,402 పింఛన్లకు రూ.66,08,47,000 పంపిణీ చేయనున్నారు.సచివాలయాలకు రావాల్సిన అవసరం లేదు ∙ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన కర్నూలు(సెంట్రల్): లబి్ధదారులు ఎవరూ పింఛన్ కోసం గ్రామ, వార్డు సచివాయాలకు రావాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన తెలియజేశారు. సామాజిక భద్రత పింఛన్ పంపిణీ అంశంపై స్పెషల్ సీఎస్ ఆజయ్జైన్, పీఆర్ అండ్ ఆర్డీ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్కుమార్ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సమీక్ష అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పింఛన్దారులు ఎవరూ పింఛన్ కోసం గ్రామ, వార్డు సచివాలయాలకు రావాల్సిన అవసరం లేదన్నారు. దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, మంచానికే పరిమితమైన వారు, వీల్ చైర్లో ఉన్న వారు, సైనిక సంక్షేమ పింఛన్ పొందుతున్న వారు, వితంతువులకు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దనే పింఛన్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మిగిలిన వారికి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే పింఛన్ జమ చేస్తామన్నారు. ఎవరికైనా బ్యాంకు ద్వారా చెల్లించలేని పక్షంలో ఇంటివద్దకే పింఛన్ తెచ్చి ఇవ్వడానికి ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్లో ట్రైనీ కలెక్టర్ చల్లా కళ్యాణి,జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, డీఆర్డీఏ పీడీ సలీం బాషా పాల్గొన్నారు. -
సకుటుంబ సపరివార సమేతంగా
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ కుటుంబానికి కంచుకోట అయిన వైఎస్సార్ జిల్లాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఘనవిజయానికి ఆయన కుటుంబమంతా కదిలింది. పులివెందుల అసెంబ్లీ స్థానంలో సీఎం వైఎస్ జగన్కు, కడప ఎంపీ స్థానంలో వైఎస్ అవినాశ్రెడ్డి, పార్టీ ఇతర అభ్యర్థులకు గత ఎన్నికల్లోకంటే ఎక్కువ మెజార్టీతో గెలిపించే బాధ్యతలను కుటుంబ సభ్యులు భుజాన వేసుకున్నారు. అందరూ కలిసి ప్రణాళిక ప్రకారం జిల్లా ప్రజల ముందుకు వెళ్తున్నారు. వైఎస్సార్ సోదరులు, సమీప బంధువులు నియోజకవర్గాలు, మండలాల వారీగా ప్రచార బాధ్యతలు తీసుకున్నారు.సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతమ్మ సహా మరికొందరు క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్తూ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ ఐదేళ్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందించిన సంక్షేమం, సాధించిన అభివృద్ధి, సుపరిపాలనను వివరిస్తూ గత ఎన్నికలకంటే మరింత ఎక్కువ మెజార్టీతో ఘనవిజయాన్ని అందించాలని ప్రజలను కోరుతున్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, సామాన్యుల ఉన్నతే లక్ష్యంగా, విశేష పారిశ్రామిక ప్రగతి సాధించిన సీఎం వైఎస్ జగన్ను, వైఎస్సార్సీపీ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరుతున్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రజలందరినీ కుటుంబ సభ్యులుగా భావించారని, మరోమారు ఎమ్మెల్యేగా వైఎస్ జగన్మోహన్రెడ్డిని, కడప ఎంపీగా వైఎస్ అవినాశ్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. కుటుంబ సభ్యులకు బాధ్యతలిలా.. వైఎస్సార్ సోదరులు వైఎస్ రవీంద్రనాథరెడ్డి, వైఎస్ సు«దీకర్రెడ్డి, వైఎస్ మధుకర్రెడ్డి కడప నియోజకవర్గ బాధ్యతలు తీసుకున్నారు. పులివెందుల నియోజకవర్గంలోని పులివెందుల మున్సిపాలిటీకి వైఎస్ మనోహర్రెడ్డి, లింగాలకు వైఎస్ అభిõÙక్రెడ్డి, తొండూరుకు వైఎస్ మదన్మోహన్రెడ్డి ఇన్చార్జిలుగా ఉన్నారు. పులివెందుల రూరల్, కొండాపురం మండలాలకు చవ్వా దుష్యంత్రెడ్డి, జమ్మలమడుగుకు చవ్వా జగదీష్రెడ్డి ప్రచార బాధ్యతలు చేపట్టారు. వేముల మండల ఇన్చార్జిగా డాక్టర్ ఈసీ దినేష్రెడ్డి, సింహాద్రిపురానికి గండ్లూరు వీరశివారెడ్డి, చక్రాయపేటకు వైఎస్ కొండారెడ్డి, వేంపల్లెకు వైఎస్సార్ మేనల్లుడు యువరాజ్రెడ్డి ప్రచార బాధ్యతలు తీసుకున్నారు. జిల్లాలో వైఎస్సార్సీపీ విజయం కోసం సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ, ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి సతీమణి వైఎస్ సమతారెడ్డి, సోదరి వైఎస్ శ్వేతారెడ్డి, చవ్వా సునీతారెడ్డి, వైఎస్ తేజారెడ్డి, దివ్య (వైఎస్సార్ మేనకోడలు) విస్తృతంగా పర్యటిస్తున్నారు. వీరంతా ఇప్పటికే పులివెందుల, కడప, మైదుకూరు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో పర్యటించారు. జగన్ చెబితే చేస్తారు.. చంద్రబాబు చెప్పినా చేయరు: వైఎస్ భారతమ్మ పులివెందుల/తొండూరు: సీఎం వైఎస్ జగన్ చెబితే చేస్తారని, చంద్రబాబు చెప్పినా చేయరని సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతమ్మ చెప్పారు. రాష్ట్ర ప్రజలందరిదీ కూడా ఇదే అభిప్రాయమన్నారు. ఆమె ఆదివారం వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని తొండూరు మండలం ఇనగలూరులో ప్రజలతో మమేకమయ్యారు. పులివెందులలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాశ్రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. సంక్షేమ పథకాలు అందుతున్న తీరుపై ప్రజలతో మాట్లాడారు.తమకు సీఎం జగన్ వల్ల అన్ని పథకాలూ అందుతున్నాయని అక్కడున్న వారంతా చెప్పారు. తమ కుటుంబాలన్నీ ఎంతో సంతోషంగా ఉన్నాయని, తమ ఓట్లు వైఎస్సార్సీపీకే అని బదులిచ్చారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు భారతమ్మ స్పందించారు. పులివెందుల నియోజకవర్గంలో ప్రజలు వైఎస్ జగన్మోహన్రెడ్డికి గత ఎన్నికల్లోకంటే మరింత ఎక్కువ మెజార్టీని ఇస్తారని చెప్పారు. ఇందుకు వారే నిదర్శనమంటూ ప్రజలను చూపించారు. అక్కడున్న ప్రజలంతా జగన్మోహన్రెడ్డికి లక్ష ఓట్ల మెజార్టీని అందిస్తామంటూ నినదించారు. మేనిఫెస్టో గురించి భారతమ్మ మాట్లాడుతూ ఇప్పుడున్న పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఆ పథకాలకు సీఎం జగన్ మరింత మెరుగులు దిద్ది అందిస్తారని చెప్పారు. పులివెందుల అంటే వైఎస్ కుటుంబానికి బలమని, 40 ఏళ్లుగా ప్రజలు ఆదరిస్తున్నారని, వారి రుణం ఎప్పటికీ తీర్చుకోలేమన్నారు. ఆమెతో పాటు వైఎస్ సమత, వైఎస్ మధురెడ్డి కోడలు చైతన్య, డాక్టర్ చందన ఉన్నారు.ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో ఎదురు లేని వైఎస్సార్ కుటుంబంఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో వైఎస్సార్ కుటుంబానికి ఇప్పటివరకు ఎదురే లేదు. కడప పార్లమెంటు నుంచి 1989లో తొలిసారి వైఎస్సార్ ఎంపీగా ఎన్నికయ్యారు. వరసగా నాలుగు పర్యాయాలు ఆయనదే విజయం. 1989 నుంచి 2019 వరకు 10 సార్లు కడప పార్లమెంటుకు ఎన్నికలు జరగ్గా, అన్ని ఎన్నికల్లో జిల్లా ప్రజానీకం వైఎస్ కుటుంబానికే పట్టం కట్టారు. నాటి నుంచి నేటి వరకు వైఎస్ కుటుంబ సభ్యులే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
మేనిఫెస్టోలో చెప్పినదానికి మించి కాపులకు భారీ ఆర్థిక సాయం
సాక్షి, అమరావతి: ప్రజలకు మేలు చేయడంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిది ఎప్పుడూ ముందడుగే. ఏ వర్గానికి చేసిన మేలయినా మేనిఫెస్టోలో చెప్పిన దానికంటే ఎక్కువే చేశారు కానీ, ఒక్క రూపాయి తక్కువ చేయలేదు. రాష్ట్రంలోని కాపు సామాజికవర్గం ప్రజలకు సీఎం జగన్ ఈ ఐదేళ్లలో చేసిన మేలు, కల్పించిన ప్రయోజనాలు ఇప్పటివరకు ఏ ప్రభుత్వమూ చేయలేదు.చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా కాపులకు చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు. 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు కూడా ఆయన సీఎంగా ఉన్న ఐదేళ్లలో చేయకుండా ఆ వర్గ ప్రజలను వంచించారు. కాపు సామాజిక వర్గం ప్రజలను చంద్రబాబు వేధించిన తీరు అందరికీ ఇప్పటికీ కళ్లకు కడుతూనే ఉంటుంది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కాపుల దశ తిరిగింది. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో కాపు సామాజిక వర్గానికి ఏడాదికి రూ.2,000 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు సాయం చేస్తామని పేర్కొన్నారు. అయితే వాస్తవంగా ఈ ఐదేళ్లలో కాపులకు డీబీటీ, నాన్ డీబీటీ కలిపి చేసిన మొత్తం ఆర్థిక సాయం రూ.34,005.12 కోట్లు. అంటే చెప్పినదానికంటే రూ. 24 వేల కోట్లు ఎక్కువ ఆర్థిక ప్రయోజనం కల్పించారు. డీబీడీ ద్వారానే 65,34,600 ప్రయోజనాల కింద కాపులకు రూ.26,232.93 కోట్లు నేరుగా నగదు బదిలీ ద్వారా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. నాన్ డీబీటీ కింద మరో రూ.7,772.19 కోట్లు ఆర్థిక ప్రయోజనాలను కాపులకు అందించారు. చంద్రబాబు గతంలో ఏడాదికి రూ.1,000 కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు కాపులకు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. వాస్తవంగా చంద్రబాబు పాలన ఐదేళ్లలో కాపులకు కేవలం రూ.1,340 కోట్లే కేటాయింపులు చేశారు. అంటే ఇచ్చిన హామీని నెరవేర్చనేలేదు. రూ.5 వేల కోట్లలో పావు వంతే కేటాయింపులు చేసి, కాపు వర్గాలను మోసం చేశారు. అంతే కాదు.. కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేసిన వారిపై చంద్రబాబు తన పాలనలో ఉక్కుపాదం మోపారు. ఆఖరికి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను, వారి కుటుంబసభ్యులను ఇంట్లోనే నిర్బధించడంతో పాటు ఉద్యమకారులపై అనేక కేసులు పెట్టి వేధించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కాపు రిజర్వేషన్ల ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేశారు. అంతే కాకుండా ఏకంగా నలుగురు కాపు వర్గీయులకు మంత్రివర్గంలో స్థానం కల్పించారు.ప్రత్యేకంగా కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. అర్హతగల కాపులందరినీ నవరత్నాల పథకాలకు ఎంపిక చేశారు. సిఫార్సులు, లంచాలకు తావులేకుండా, పార్టీలకు అతీతంగా కాపు సోదరులు, కాపు సోదరిలకు సీఎం జగన్ భారీ ఆర్థిక సాయం అందించారు. ఈ ఐదేళ్లలో వైఎస్సార్ కాపు నేస్తం కింద 3,58,613 మంది కాపు మహిళలకు రూ.2029.92 కోట్లు నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. వచ్చే ఐదేళ్లలో మళ్లీ ఇంత ఆర్థిక సాయం అందుకోవాలంటే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఉంటేనే సాధ్యం అవుతుందనేది జగమెరిగిన సత్యం. -
డిజిటల్ టెక్నాలజీకి అర్థం తెలుసా రామోజీ
పాతికేళ్ల క్రితం... » రైల్వే ప్రయాణంలో టీసీ టికెట్ చూపించమని అడిగితే... చిన్న అట్టముక్కలాంటి టికెట్ చూపించేవాళ్లం. ఇప్పుడు సెల్ ఫోన్లో టిజిటల్ కాపీ చూపిస్తున్నాం. టీసీల దగ్గర కూడా ఓ అట్ట దానికి తగిలించిన కాగితాలు ఉండేవి. దాన్లో ఉన్న పేర్లపై టిక్కులు పెట్టుకునేవారు. ఇప్పుడు వారి చేతుల్లోకి ట్యాబ్లు వచ్చాయి. » బ్యాంకుల్లో విత్డ్రాయల్కు గాని, డిపాజిట్ చేయడానికి గాని వెళ్తే పని పూర్తవడానికి ఓ పూట పట్టేది. నేడు మన చేతుల్లోకి ఏటీఎం కార్డులు వచ్చాయి. క్షణాల్లో డబ్బులు డ్రా చేసుకోవచ్చు. డిపాజిట్ చేసుకోవచ్చు. అసలు బ్యాంకులకే వెళ్లకుండా ఈ–బ్యాంకింగ్ ద్వారా ఇంటి వద్ద నుంచే లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. అసలు పాసు పుస్తకాలనే బ్యాంకులు ఇవ్వడం మానేసాయి. మన చేతిలో ఉన్న ఆ చిన్న కార్డులోనే మన వివరాలన్నీ పొందుపరిచి ఉంటాయి. ఆ కార్డు ద్వారానే మన లావాదేవీలన్నీ క్షణాల్లో తెలుసుకోవచ్చు. » ఒకప్పుడు మన వాహన రిజిస్ట్రేషన్, లైసెన్సు, ఇన్సూరెన్సు పత్రాలు కాగిత రూపంలో ఉండేవి. వాటిని ఓ పర్సులాగా బైండ్ చేయించుకునే వాళ్లం. ఇప్పుడు ఓ బెత్తెడంత డిజిటల్ ప్లాస్టిక్ కార్డు చాలు. అందులోనే మన వాహనం పుట్టుపూర్వోత్తరాలు ఉంటాయి. » వ్యవసాయ భూములు వివరాల కోసం ప్రాథమికంగా చూసేది అడంగల్–బి ఫారం. ఒకప్పుడు దీన్ని పొందాలంటే వారాలు, నెలలు పట్టేది. ఇప్పుడది మీ చేతుల్లో సెల్ ఫోన్ ఉంటే చాలు క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఏ ఈ–సేవ కేంద్రానికి వెళ్లినా ప్రింట్ కూడా తీసుకోవచ్చు. గత పాతికేళ్లుగా ప్రపంచమంతా విస్తరించిన డిజిటల్ విప్లవం ద్వారా ఇవన్నీ సాధ్యమయ్యాయి. ప్రపంచగతినే మార్చేసిన ఈ సాంకేతికతను రిజిస్ట్రేషన్ల శాఖ కూడా అందిపుచ్చుకుంది. స్టాంపు పేపర్లపై జరిపే లావాదేవీలను డిజిటల్ రూపంలోకి మార్చి తన సర్వర్లో నిక్షిప్తం చేస్తుంది. దాన్నే మనకు అందిస్తుంది. అంతేగానీ అవి జిరాక్సు కాపీలు కాదు. ప్రతి డిజిటల్ కాపీపై క్యూఆర్ కోడ్ ముద్రించి ఉంటుంది. దాన్ని స్కాన్ చేస్తే చాలు. మన ఆస్తి రిజిస్ట్రేషన్ వివరాలన్నీ ప్రత్యక్షమవుతాయి. ఈ నూతన సాంకేతిక విధానాన్నే ఈ–స్టాంపింగ్ అంటున్నాం. ఇంత గొప్ప సాంకేతిక వ్యవస్థను వ్యతిరేకిస్తున్నది ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, అతని తాబేదారు రామోజీరావు మాత్రమే. ప్రజల్లో గందరగోళం సృష్టించడానికి చంద్రబాబు పిచ్చి కూతలు కూస్తే... దాన్ని వ్యాప్తి చేయడానికి రామోజీ పచ్చిరాతలు రాస్తున్నాడు.సాంకేతికత అందిపుచ్చుకోవడం తప్పా గురివిందా సాంకేతికత అభివృద్ధి చెందిన కొద్దీ ప్రభుత్వ వ్యవస్థల్లో జరిగే మార్పుల్ని కూడా రామోజీ పత్రిక తప్పుదోవ పట్టిస్తూ పచ్చ పైత్యం పరాకాష్టకు చేరిందని నిరూపించుకుంటోంది. అనేక రాష్ట్రాల్లో అమలవుతున్న ఈ–స్టాంపింగ్ విధానంలో జారీ అయ్యే స్టాంపు పత్రాలను జిరాక్స్ కాపీలని తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. నాన్–జ్యుడీíÙయల్ స్టాంప్ పేపర్ల వినియోగం చాలా రాష్ట్రాల్లో తగ్గిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే నేషనల్ స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ వివిధ రాష్ట్రాల్లో ఈ–స్టాంపింగ్ విధానాన్ని అమలు చేస్తోంది. టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో అభివృద్ధి చెందిన దేశాల్లో మాదిరిగా డిజిటల్ స్టాంపుల వినియోగం తప్పనిసరి అనే ఉద్దేశంతో ఈ–స్టాంపింగ్ వ్యవస్థను చాలా ఏళ్ల క్రితమే కేంద్రం ప్రవేశ పెట్టింది. అదే సమయంలో నాన్–జ్యుడీíÙయల్ స్టాంప్ పేపర్లను పూర్తిగా రద్దు చేయలేదు. ప్రజల్లో అవగాహన కోసం స్టాంప్ పేపర్లు, ఈ–స్టాంపింగ్ వ్యవస్థ రెండింటినీ అందుబాటులో ఉంచింది.మన రాష్ట్రంలోనూ ఏడాదిన్నరగా నేషనల్ స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ అనుమతించిన కామన్ సర్విస్ సెంటర్ల ద్వారా ఈ–స్టాంపులను జారీ చేస్తోంది. ఇవి జిరాక్స్ కాపీలని చెప్పడం అంటే కేంద్ర ప్రభుత్వ విధానాన్ని తప్పు పట్టడమే. ఆస్తి కొనుగోళ్ల వ్యవస్థను గతం కంటే పారదర్శకంగా చేయడాన్ని వ్యతిరేకించడమేకాకుండా సాంకేతికాభివృద్ధిని కూడా తప్పుదోవ పట్టించే స్థాయికి రామోజీ దిగజారిపోయారు.ఆన్లైన్ రిజిస్ట్రేషన్లపై తప్పుడు ప్రచారం అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్డ్ ప్రైమ్ రిజిస్ట్రేషన్ల విధానంపైనా ఈనాడు తన పైత్యపు రాతలు రాసింది. ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్లు చేసుకునే క్రమంలో కార్డ్ ప్రైమ్ సాఫ్ట్వేర్ను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అభివృద్ధి చేసింది. దీని ద్వారా వినియోగదారులు డాక్యుమెంట్ రైటర్లపై ఆధారపడకుండానే రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్లోనే మోడల్ డాక్యుమెంట్ ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకునే వెసులుబాటు కల్పించింది. రిజిష్టర్ చేసుకునే ఆస్తి, వివరాలను ఎవరికివారే పూర్తి చేసుకునే డేటా ఎంట్రీ విధానం ఇందులో భాగమే. అంటే గతంలో మాదిరిగా తమ ఆస్తి డాక్యుమెంట్ను డాక్యుమెంట్ రైటర్లు కాకుండా తామే తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న డాక్యుమెంట్ను సబ్ రిజి్రస్టార్ కార్యాలయంలో రిజిష్టర్ చేసి ప్రింట్ ఇస్తారు. దీనిపైనా ఎల్లో మీడియా విష ప్రచారం చేసి రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక డాక్యుమెంట్లు ఇవ్వకుండా జిరాక్స్ పత్రాలు ఇస్తారనే దు్రష్పచారం చేస్తోంది. జిరాక్స్ పత్రాలనే ప్రచారం ప్రజల్లో భయాందోళనలు సృష్టించడానికి ఎల్లో మీడియా, కొందరు డాక్యుమెంట్ రైటర్లు చేసేదే తప్ప నిజానికి అది స్టాంప్ పేపర్ల కంటే అత్యంత భద్రమైన ఆన్లైన్ విధానం. ఇటీవల కార్డ్ ప్రైమ్ అమలుకు సంబంధించి జారీ అయిన మెమోను ల్యాండ్ టైట్లింగ్ చట్టం అమలు కోసం జారీ చేసిందిగా పేర్కొంటూ దు్రష్పచారానికి తెరదీశారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని అధికారులు కోరుతున్నారు. -
రాజ్యాంగబద్ధ సంస్థలను కించపరిచేలా ఈనాడు రాతలు
సాక్షి, అమరావతి: రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ఎన్నికల సంఘం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నేతృత్వంలో పనిచేసే కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య అగాధం సృష్టించడం, వాటిని కించపరచడమే లక్ష్యంగా ఈనాడు దురుద్దేశపూర్వక కథనాలను ప్రచురిస్తోందంటూ పౌర సంఘాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. రెండు వ్యవస్థల ప్రతిష్టను దిగజార్చి, ప్రజల్లో చులకన చేసే లక్ష్యంతో పెన్షన్ల పంపిణీపై ‘ఎవరి ఆధీనంలో ఎవరు’ అంటూ కథనాన్ని ప్రచురించారంటూ ఏపీ ఇంటిలెక్చువల్ అండ్ సిటిజన్స్ ఫోరం, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ఫోరం ఆదివారం ఫిర్యాదు చేశాయి.ఈ సందర్భంగా ఏపీ ఇంటిలెక్చువల్ అండ్ సిటిజన్స్ ఫోరం అధ్యక్షుడు పి. విజయబాబు మాట్లాడుతూ.. ఈనాడు కథనం ప్రజల్లో అపోహలు సృష్టించేలా ఉందన్నారు. ఎన్నికల సంఘం పారదర్శకత, సమగ్రత, నిబద్ధతను ఈ కథనం ప్రశి్నంచేదిగా ఉందన్నారు. ఈ కథనాన్ని ప్రచురించిన ఈనాడుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ తరహా వార్తలు పత్రికా విలువలను, నైతికతను దిగజార్చేలా ఉన్నందున, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా జోక్యం తీసుకొని చర్యలు తీసుకోవాలని కోరారు.ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ఫోరం అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు మాట్లాడుతూ.. పింఛన్ల పంపిణీపై ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచి్చందని, వాటిని కార్యనిర్వాహక వ్యవస్థ కూడా పాటించిందని చెప్పారు. అయినప్పటికీ, ఈ రెండు వ్యవస్థల మధ్య సమన్వయం లేదనే విధంగా ఈనాడు కథనం ఉండటం శోచనీయమన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్న సమయంలో ఎన్నికల సంఘం ఇస్తున్న ఆదేశాలను సీఎస్ తూచ తప్పకుండా పాటిస్తున్నప్పటికీ, ఆయన పనితీరుపై అపోహలు కలి్పంచేలా తప్పుడు కథనాలను ప్రచురిస్తున్నారన్నారు. రాష్ట్రంలోని కొన్ని మీడియా సంస్థలు ప్రభుత్వాలను దించి వేయడం, వాటికి అనుకూలమైన పార్టీలను అందలం ఎక్కించడం అనే రాజ్యాంగ విరుద్ధమైన బాధ్యతను భుజాలకెత్తుకున్నాయని కృష్ణంరాజు విమర్శించారు. ప్రభుత్వాల పనితీరుపై ఎన్నికల సమయంలో ప్రజలే వారి నిర్ణయాన్ని ప్రకటిస్తారని, కానీ వారి నిర్ణయాన్ని ప్రభావితం చేసేలా తప్పుడు కథనాలను ప్రచురించడం మానుకోవాలని ఆయన హితవు పలికారు.
Advertisement
Photos
View allVideo
View allఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
కదన రంగంలోకి కమల దళపతులు
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- స్టార్ హీరో సినిమా కోసం ఎంట్రీ ఇస్తున్న మీనా,సిమ్రాన్
- ఏఐ టూల్స్ తయారీ సంస్థల్లో పెట్టుబడి పెంచనున్న ప్రముఖ సంస్థ
- అమరజీవికి అవమానం
- క్యూటెస్ట్ వీడియో.. అక్కతో మహేశ్ బాబు ఫన్ మూమెంట్స్
- మే నెలలోనూ పింఛన్దారులకు కష్టాలే!
- సడన్ బ్రేక్... జీవితాలనే మార్చేసింది
- బెదిరింపుల పర్వం!
- ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవేంటంటే?
- సమస్య ఏదైనా.. సత్తిబాబు మీ వెంటున్నాడు..
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement