వేరుశెనగ విత్తనకాయల ధరలను అమాంతం పెంచేసిన మిల్లర్లు
కిలోకు రూ.10 నుంచి 12 దాకా పెంపు
వేరుశెనగ సాగుకు ఇదే మంచి అదను
ఇప్పటిదాకా జిల్లాకు చేరని సబ్సిడీ విత్తనకాయలు
విత్తనాలు లేని రైతుల గుండెల్లో రైళ్లుట
పలమనేరు: ఖరీఫ్ సీజన్కు సంబంధించి జిల్లాలో అదునులోనే వర్షాలు పడ్డాయి. దీంతో వేరుశెనగ సాగుకు దుక్కులు దున్నుకుని రైతులు సిద్ధం చేసుకున్నారు. అయితే ప్రభుత్వం పంపిణీ చేసే సబ్సిడీ వేరుశెనగ విత్తన కాయలు సకాలంలో అందలేదు. ఈ తంతును గమనించిన ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లు విత్తన కాయల ధరలను అమాంతం పెంచేశారు. విత్తనాలను ఉంచుకున్న రైతులు మాత్రం ఇప్పటికే చేలల్లో విత్తనాలు వేస్తున్నారు. సబ్సిడీ విత్తనాలను నమ్ము కున్న రైతులు మాత్రం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోవైపు అదను మీరిపోతే సకాలంలో మళ్లీ వర్షాలు కురవకపోతే విత్తనాలు ఎలా వేసేదని మిగిలిన రైతులు మధనపడుతున్నారు. మొత్తం మీద వ్యవసాయశాఖ పుణ్యకాలం పూర్తయ్యే లోపు విత్తనాలను పంపిణీ చేసే పరిస్థితులు కనిపించడం లేదు. జిల్లాలో 53 మండలాలు, 9 వ్యవసాయశాఖ డివిజన్లలో ఈ దఫా లక్ష క్వింటాళ్ల వేరుశెనగ విత్తన కాయలను పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ భావిం చింది. ఈ డివిజన్ల పరిధిలో సుమారు 1,45,800 హెక్టార్లలో వేరుశెనగ సాగు కావాల్సి ఉంది. లక్షా ఎనబై వేల మంది రైతులు వేరుశెనగ సాగుపైనే ఆధారపడి ఉన్నారు. మొన్న కురిసిన వర్షాలతో భూమిలో తేమ మరో వారం రోజుల వరకు ఉంటుంది. ఈ అదను లోపు విత్తనాలు వేయకపోతే పంట దిగుబడి అంతంత మాత్రమే. సీజన్ గడిచే కొద్దీ రైతులకు ఇబ్బందులే. జిల్లాలోని పడమటి ప్రాంతాలైన కుప్పం,పలమనేరు, పుంగనూరు, మదనపల్లెల్లో విత్తనాలు తమ వద్ద ఉంచుకున్న రైతులు ఇప్పటికే విత్తనాలు వేసేశారు. మిగిలిన రైతులు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
కిలోకు రూ.10 ధర పెంచేసిన మిల్లర్లు
ఇప్పటికీ సబ్సిడీ విత్తనాలు జిల్లాకు చేరకపోవడంతో ఇదే అదునుగా భావించిన మిల్లర్లు, వ్యాపారులు విత్తనకాయల ధరలను పెంచేశారు. ఇన్నాళ్లు బహిరంగ మార్కెట్లో కిలో వేరుశెనగ విత్తన కాయలు రూ.34లుగా ఉండగా ఆ ధర ఇప్పుడు 44కు చేరింది. అయినా గత్యంతరం లేక రైతులు వీటిని కొనుగోలు చేస్తున్నారు.
సబ్సిడీ విత్తనాల ధర పెరిగే అవకాశం
ప్రభుత్వానికి విత్తనాలను పంపిణీ చేసే కంపెనీలు ధర విషయంలో పేచీకి దిగాయి. దీంతో గత రెండు రోజులుగా ప్రభుత్వ అధికారులు, కంపెనీల మధ్య చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది. ధర పెంచితే గానీ విత్తనకాయలను అందివ్వబోమని వారు చెబుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రభుత్వం కిలో రూ.46 పూర్తి ధర కాగా, 33 శాతం సబ్సిడీ పోనూ కిలో రూ.31కే అందిస్తామంది. అయితే ధరలు పెరిగితే ఈ ధర కూడా పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.
సబ్సిడీ లేకున్నా బహిరంగ మార్కెట్లోనూ అంతే
ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో వేరుశెనగ విత్తన కాయలు కిలో రూ. 36 నుంచి 44 దాకా పలుకుతున్నాయి. అదే ప్రభుత్వ సబ్సిడీతో అయితే పాత ధర ప్రకారం రూ.31, కొత్త ధర మరో నాలుగు రూపాయలు పెరిగినా రూ.35 అవుతుంది. ఆ లెక్కన ప్రభుత్వం నుంచి రైతులకు ఒరిగేది అంతంతమాత్రమే. దానికి తోడు ప్రభుత్వం సరఫరా చేసే విత్తన కాయల నాణ్యత ఏమాత్రం ఉంటుందనే చెప్పలేం. ఏదేమైనా ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా అటు విత్తనాలు అందక, ఇటు ప్రైవేటు మార్కెట్లో ధరలు పెరిగి వేరుశెనగ రైతన్నలు నలిగిపోతున్నారు.
సంప్రదింపులు జరుగుతున్నాయి
విత్తనాలు పంపిణీ చేసే ఏజెన్సీలు, ప్రభుత్వం మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయి. అది ధర విషయమా లేక ఇంకొటా మాకు తెలీదు. అక్కడ సమస్య పరిష్కారమైతేనే జిల్లాకు విత్తన కాయలు చేరుతాయి. ఆపై వీటిని రైతులకు పంపిణీ చేస్తాం.
- రవికుమార్, వ్యవసాయశాఖ , చిత్తూరు
ఫోటోరైటప్స్:
11పీఎల్ఎన్ఆర్06,07: భారీగా ధర పెరిగిన వేరుశెనగ విత్తనాలు
11పీఎల్ఎన్ఆర్08,09: కుప్పం ప్రాంతంలో ఇప్పటికే చేళల్లో వేరుశెనగ విత్తనాలను వేస్తున్న రైతులు ఠ మొదటిపేజీ తరువాయి
పలమనేరు, పుంగనూరు, మదనపల్లెల్లో విత్తనాలు తమ వద్ద ఉంచుకున్న రైతులు ఇప్పటికే విత్తనాలు వేసేశారు. మిగిలిన రైతులు ఏం చేయాలో దిక్కుతోచని స్థితి లో ఉన్నారు.
కిలోకు రూ.10 ధర పెంచేసిన మిల్లర్లు
ఇప్పటికీ సబ్సిడీ విత్తనాలు జిల్లాకు చేరకపోవడంతో ఇదే అదునుగా భావించిన మిల్లర్లు, వ్యాపారులు విత్తనకాయల ధరలను పెంచేశారు. ఇన్నాళ్లు బహిరంగ మా ర్కెట్లో కిలో వేరుశెనగ విత్తన కాయలు రూ.34లుగా ఉండగా ఆ ధర ఇప్పుడు 44కు చేరింది. అయినా గత్యంతరం లేక రైతులు వీటిని కొనుగోలు చేస్తున్నారు.
సబ్సిడీ విత్తనాల ధర పెరిగే అవకాశం
ప్రభుత్వానికి విత్తనాలను పంపిణీ చేసే కంపెనీలు ధర విషయంలో పేచీకి దిగా యి. దీంతో గత రెండు రోజులుగా ప్రభు త్వ అధికారులు, కంపెనీల మధ్య చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది. ధర పెంచితే గానీ విత్తనకాయలను అందివ్వబోమని వారు చెబుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రభుత్వం కిలో రూ.46 పూర్తి ధర కాగా, 33 శాతం సబ్సిడీ పోనూ కిలో రూ.31కే అందిస్తామంది. అయితే ధరలు పెరిగితే ఈ ధర కూడా పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.
సబ్సిడీ లేకున్నా బహిరంగ మార్కెట్లోనూ అంతే
ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో వేరుశెనగ విత్తన కాయలు కిలో రూ. 36 నుంచి 44 దాకా పలుకుతున్నాయి. అదే ప్రభుత్వ సబ్సిడీతో అయితే పాత ధర ప్రకారం రూ.31, కొత్త ధర మరో నాలుగు రూపాయలు పెరిగినా రూ.35 అవుతుంది. ఆ లెక్కన ప్రభుత్వం నుంచి రైతులకు ఒరిగేది అంతంతమాత్రమే. దానికి తోడు ప్రభుత్వం సరఫరా చేసే విత్తన కాయల నాణ్యత ఏమాత్రం ఉంటుందనేది చెప్పలేం. ఏదేమైనా ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా అటు విత్తనాలు అందక, ఇటు ప్రైవేటు మార్కెట్లో ధరలు పెరిగి వేరుశెనగ రైతన్నలు నలిగిపోతున్నారు.
సంప్రదింపులు జరుగుతున్నాయి
విత్తనాలు పంపిణీ చేసే ఏజెన్సీలు, ప్రభుత్వం మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయి. అది ధర విషయమా లేక మరొకటా మాకు తెలీదు. అక్కడ సమస్య పరిష్కారమైతేనే జిల్లాకు విత్తన కాయలు చేరుతాయి. ఆపై వీటిని రైతులకు పంపిణీ చేస్తాం.
- రవికుమార్, వ్యవసాయశాఖ, చిత్తూరు
యిత్తనం కొనలేం!
Published Thu, Jun 12 2014 2:15 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement