-
ఒక్కరోజులోనే 3.09 లక్షల కార్డులు
భూపాలపల్లి: ఇది సరికొత్త రేషన్ రికార్డు.. సోమవారం ఒక్కరోజే రాష్ట్ర ప్రభుత్వం 3,09,083 రేషన్కార్డులను లబ్ధిదారులకు అందజేసింది. పేదల ఖాళీ కడుపులను నింపే క్రమంలో రికార్డు సృష్టించింది. ఇంత పెద్దసంఖ్యలో రేషన్కార్డులు పంపిణీ చేయడం దేశంలోనే ఇది తొలిసారి అని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కొత్త రేషన్కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 90.50 లక్షల రేషన్కార్డుల ద్వారా 2.88 కోట్లమంది లబ్ధిదారులకు రూ.2,766 కోట్ల విలువైన ఆహారధాన్యాలు అందిస్తున్నట్లు తెలిపారు. కరోనా సంక్షోభంలోనూ సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. 2014కు ముందు అర్హులు సైతం రేషన్కార్డు కోసం పైరవీకారులను ఆశ్రయించేవారని, తాను 2009లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు అడుక్కున్నా అప్పటి ప్రభుత్వం ఒక్క కార్డు కూడా ఇవ్వలేదని గుర్తుచేశారు. ఇప్పుడు పైరవీలకు తావివ్వకుండా, పారదర్శకంగా అర్హులందరికీ రేషన్కార్డులు మంజూరు చేస్తున్నామని చెప్పారు. మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ పేదల కడుపు నింపాలనే సదుద్దేశంతో కొత్త రేషన్కార్డులను మంజూరు చేయడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్కుమార్ పాల్గొన్నారు. -
దళితుల భూములు అమ్మినా, కొన్నా నేరమే
కొండపాక: నిరుపేదలైన దళితులకు ప్రభుత్వం పంపిణీ చేసే భూములు అమ్మినా, కొన్నా చట్టరీత్యా నేరమని జేసీ శరత్ హెచ్చరించారు. కొండపాక మండలం బందారం గ్రామంలో దళితులకు మూడెకరాల భూపంపిణీ పథకం కింద కొనుగోలు చేయనున్న భూములను ఆయన సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డితో కలిసి గురువారం పరిశీలించారు. 15 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయనున్న 44 ఎకరాల స్థలంలో కంప చెట్ల తొలగింపు పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడుతూ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న భూములను సాగు చేసుకొని బతుకులు బాగుచేసుకోవాలన్నారు. లబ్ధిదారులకు బోర్లు తవ్వి, కరెంట్ సరఫరా చేస్తామన్నారు. సబ్సిడీపై డ్రిప్ పరికరాలు, ఎరువులు, విత్తనాలు అందజేస్తామన్నారు. సాగు యోగ్యమైన సాగు భూమినే దళితులకు పంపిణీ చేస్తామని శరత్ పేర్కొన్నారు. పంపిణీ కోసం కొనుగోలు చేయనున్న భూమిపై లబ్ధిదారులు సంతృప్తిగా ఉన్నారా లేదా అని ఆయన ప్రశ్నించారు. భూమిని పంపిణీ చేయడానికి ముందే ముళ్లపొదలు తొలగించి ఇస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అనంతుల పద్మానరేందర్, తహశీల్దార్ పరమేశ్వర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ర్యాగల దుర్గయ్య, ఎగుర్ల వెంకటేశం, గొట్టె ఐలయ్య, ఆర్ఐ నీలిమ తదితరులు పాల్గొన్నారు. -
యిత్తనం కొనలేం!
వేరుశెనగ విత్తనకాయల ధరలను అమాంతం పెంచేసిన మిల్లర్లు కిలోకు రూ.10 నుంచి 12 దాకా పెంపు వేరుశెనగ సాగుకు ఇదే మంచి అదను ఇప్పటిదాకా జిల్లాకు చేరని సబ్సిడీ విత్తనకాయలు విత్తనాలు లేని రైతుల గుండెల్లో రైళ్లుట పలమనేరు: ఖరీఫ్ సీజన్కు సంబంధించి జిల్లాలో అదునులోనే వర్షాలు పడ్డాయి. దీంతో వేరుశెనగ సాగుకు దుక్కులు దున్నుకుని రైతులు సిద్ధం చేసుకున్నారు. అయితే ప్రభుత్వం పంపిణీ చేసే సబ్సిడీ వేరుశెనగ విత్తన కాయలు సకాలంలో అందలేదు. ఈ తంతును గమనించిన ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లు విత్తన కాయల ధరలను అమాంతం పెంచేశారు. విత్తనాలను ఉంచుకున్న రైతులు మాత్రం ఇప్పటికే చేలల్లో విత్తనాలు వేస్తున్నారు. సబ్సిడీ విత్తనాలను నమ్ము కున్న రైతులు మాత్రం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోవైపు అదను మీరిపోతే సకాలంలో మళ్లీ వర్షాలు కురవకపోతే విత్తనాలు ఎలా వేసేదని మిగిలిన రైతులు మధనపడుతున్నారు. మొత్తం మీద వ్యవసాయశాఖ పుణ్యకాలం పూర్తయ్యే లోపు విత్తనాలను పంపిణీ చేసే పరిస్థితులు కనిపించడం లేదు. జిల్లాలో 53 మండలాలు, 9 వ్యవసాయశాఖ డివిజన్లలో ఈ దఫా లక్ష క్వింటాళ్ల వేరుశెనగ విత్తన కాయలను పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ భావిం చింది. ఈ డివిజన్ల పరిధిలో సుమారు 1,45,800 హెక్టార్లలో వేరుశెనగ సాగు కావాల్సి ఉంది. లక్షా ఎనబై వేల మంది రైతులు వేరుశెనగ సాగుపైనే ఆధారపడి ఉన్నారు. మొన్న కురిసిన వర్షాలతో భూమిలో తేమ మరో వారం రోజుల వరకు ఉంటుంది. ఈ అదను లోపు విత్తనాలు వేయకపోతే పంట దిగుబడి అంతంత మాత్రమే. సీజన్ గడిచే కొద్దీ రైతులకు ఇబ్బందులే. జిల్లాలోని పడమటి ప్రాంతాలైన కుప్పం,పలమనేరు, పుంగనూరు, మదనపల్లెల్లో విత్తనాలు తమ వద్ద ఉంచుకున్న రైతులు ఇప్పటికే విత్తనాలు వేసేశారు. మిగిలిన రైతులు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కిలోకు రూ.10 ధర పెంచేసిన మిల్లర్లు ఇప్పటికీ సబ్సిడీ విత్తనాలు జిల్లాకు చేరకపోవడంతో ఇదే అదునుగా భావించిన మిల్లర్లు, వ్యాపారులు విత్తనకాయల ధరలను పెంచేశారు. ఇన్నాళ్లు బహిరంగ మార్కెట్లో కిలో వేరుశెనగ విత్తన కాయలు రూ.34లుగా ఉండగా ఆ ధర ఇప్పుడు 44కు చేరింది. అయినా గత్యంతరం లేక రైతులు వీటిని కొనుగోలు చేస్తున్నారు. సబ్సిడీ విత్తనాల ధర పెరిగే అవకాశం ప్రభుత్వానికి విత్తనాలను పంపిణీ చేసే కంపెనీలు ధర విషయంలో పేచీకి దిగాయి. దీంతో గత రెండు రోజులుగా ప్రభుత్వ అధికారులు, కంపెనీల మధ్య చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది. ధర పెంచితే గానీ విత్తనకాయలను అందివ్వబోమని వారు చెబుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రభుత్వం కిలో రూ.46 పూర్తి ధర కాగా, 33 శాతం సబ్సిడీ పోనూ కిలో రూ.31కే అందిస్తామంది. అయితే ధరలు పెరిగితే ఈ ధర కూడా పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. సబ్సిడీ లేకున్నా బహిరంగ మార్కెట్లోనూ అంతే ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో వేరుశెనగ విత్తన కాయలు కిలో రూ. 36 నుంచి 44 దాకా పలుకుతున్నాయి. అదే ప్రభుత్వ సబ్సిడీతో అయితే పాత ధర ప్రకారం రూ.31, కొత్త ధర మరో నాలుగు రూపాయలు పెరిగినా రూ.35 అవుతుంది. ఆ లెక్కన ప్రభుత్వం నుంచి రైతులకు ఒరిగేది అంతంతమాత్రమే. దానికి తోడు ప్రభుత్వం సరఫరా చేసే విత్తన కాయల నాణ్యత ఏమాత్రం ఉంటుందనే చెప్పలేం. ఏదేమైనా ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా అటు విత్తనాలు అందక, ఇటు ప్రైవేటు మార్కెట్లో ధరలు పెరిగి వేరుశెనగ రైతన్నలు నలిగిపోతున్నారు. సంప్రదింపులు జరుగుతున్నాయి విత్తనాలు పంపిణీ చేసే ఏజెన్సీలు, ప్రభుత్వం మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయి. అది ధర విషయమా లేక ఇంకొటా మాకు తెలీదు. అక్కడ సమస్య పరిష్కారమైతేనే జిల్లాకు విత్తన కాయలు చేరుతాయి. ఆపై వీటిని రైతులకు పంపిణీ చేస్తాం. - రవికుమార్, వ్యవసాయశాఖ , చిత్తూరు ఫోటోరైటప్స్: 11పీఎల్ఎన్ఆర్06,07: భారీగా ధర పెరిగిన వేరుశెనగ విత్తనాలు 11పీఎల్ఎన్ఆర్08,09: కుప్పం ప్రాంతంలో ఇప్పటికే చేళల్లో వేరుశెనగ విత్తనాలను వేస్తున్న రైతులు ఠ మొదటిపేజీ తరువాయి పలమనేరు, పుంగనూరు, మదనపల్లెల్లో విత్తనాలు తమ వద్ద ఉంచుకున్న రైతులు ఇప్పటికే విత్తనాలు వేసేశారు. మిగిలిన రైతులు ఏం చేయాలో దిక్కుతోచని స్థితి లో ఉన్నారు. కిలోకు రూ.10 ధర పెంచేసిన మిల్లర్లు ఇప్పటికీ సబ్సిడీ విత్తనాలు జిల్లాకు చేరకపోవడంతో ఇదే అదునుగా భావించిన మిల్లర్లు, వ్యాపారులు విత్తనకాయల ధరలను పెంచేశారు. ఇన్నాళ్లు బహిరంగ మా ర్కెట్లో కిలో వేరుశెనగ విత్తన కాయలు రూ.34లుగా ఉండగా ఆ ధర ఇప్పుడు 44కు చేరింది. అయినా గత్యంతరం లేక రైతులు వీటిని కొనుగోలు చేస్తున్నారు. సబ్సిడీ విత్తనాల ధర పెరిగే అవకాశం ప్రభుత్వానికి విత్తనాలను పంపిణీ చేసే కంపెనీలు ధర విషయంలో పేచీకి దిగా యి. దీంతో గత రెండు రోజులుగా ప్రభు త్వ అధికారులు, కంపెనీల మధ్య చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది. ధర పెంచితే గానీ విత్తనకాయలను అందివ్వబోమని వారు చెబుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రభుత్వం కిలో రూ.46 పూర్తి ధర కాగా, 33 శాతం సబ్సిడీ పోనూ కిలో రూ.31కే అందిస్తామంది. అయితే ధరలు పెరిగితే ఈ ధర కూడా పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. సబ్సిడీ లేకున్నా బహిరంగ మార్కెట్లోనూ అంతే ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో వేరుశెనగ విత్తన కాయలు కిలో రూ. 36 నుంచి 44 దాకా పలుకుతున్నాయి. అదే ప్రభుత్వ సబ్సిడీతో అయితే పాత ధర ప్రకారం రూ.31, కొత్త ధర మరో నాలుగు రూపాయలు పెరిగినా రూ.35 అవుతుంది. ఆ లెక్కన ప్రభుత్వం నుంచి రైతులకు ఒరిగేది అంతంతమాత్రమే. దానికి తోడు ప్రభుత్వం సరఫరా చేసే విత్తన కాయల నాణ్యత ఏమాత్రం ఉంటుందనేది చెప్పలేం. ఏదేమైనా ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా అటు విత్తనాలు అందక, ఇటు ప్రైవేటు మార్కెట్లో ధరలు పెరిగి వేరుశెనగ రైతన్నలు నలిగిపోతున్నారు. సంప్రదింపులు జరుగుతున్నాయి విత్తనాలు పంపిణీ చేసే ఏజెన్సీలు, ప్రభుత్వం మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయి. అది ధర విషయమా లేక మరొకటా మాకు తెలీదు. అక్కడ సమస్య పరిష్కారమైతేనే జిల్లాకు విత్తన కాయలు చేరుతాయి. ఆపై వీటిని రైతులకు పంపిణీ చేస్తాం. - రవికుమార్, వ్యవసాయశాఖ, చిత్తూరు
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
సంక్షేమ సిరిమల్లిక
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
Advertisement