సాక్షి ప్రతినిధి,కడప: ‘నవ్విపోదురుగాక నాకేటిసిగ్గు’ అన్న చందంగా వ్యవహరిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. జెడ్పీ పీఠం కైవసం చేసుకునేందుకు అడ్డదారులు ఎంచుకుంటున్నారు. ప్రజాతీర్పుకు భిన్నంగా మైండ్ గేమ్ ఆడుతున్నారు. నీచరాజకీయాలకు తెరలేపుతున్నారు. అధికారిక హోదాను వినియోగించుకొని ఛైర్మన్గిరిని సొంతం చేసుకునేందుకు కుటిలనీతిని ప్రదర్శిస్తున్నారు. వైఎస్సార్సీపీ సభ్యులు తమతో సంప్రదింపులు జరుపుతున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
జిల్లాలో 50 జెడ్పీటీసీ స్థానాలుండగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు 11 స్థానాల్లో, వైఎస్సార్సీపీ అభ్యర్థులు 39 స్థానాల్లో గెలుపొందారు. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ జెడ్పీ ఛెర్మైన్గిరి ఆశించడం అత్యాశే అవుతుంది. ఒకటి, రెండు స్థానాలు తేడా ఉంటే ప్రలోభాలకు గురిచేసి సాధించుకునే ప్రయత్నం చేయడం సహజమే. కానీ టీడీపీకి ఏకంగా 15 మంది జెడ్పీటీసీల మద్దతు అవసరం ఉంది. అందులో భాగంగా కొందరిని ప్రలోభాలకు గురిచేసినట్లు సమాచారం. అయితే చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రలోభాలను తిరస్కరించిన ట్లు తెలుస్తోంది. అయినప్పటికీ తమకు 11 మంది వైఎస్సార్సీపీ జెడ్పీటీసీల మద్దతు ఉందని మైండ్గేమ్ ఆడుతున్నారు.
ప్రజాక్షేత్రంలో ఓటమిపాలై..
తెలుగుదేశం పార్టీ ప్రజాతీర్పుకు విలువ నివ్వడంలేదు. ఆ పార్టీని జెడ్పీ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారు. ప్రతి ఎన్నికల్లోనూ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి తిరస్కారమే ఎదురైంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజావిశ్వాసం పొందేందుకు కృషి చేయాల్సిన టీడీపీ చీప్ పాలి‘ట్రిక్స్’కు పాల్పడుతోంది. ఒకరంటే ఒక్కరు కూడా తాము వైఎస్సార్సీపీని వీడతామంటూ జెడ్పీటీసీలు ప్రకటించలేదు. అయినప్పటికీ అధినేత వద్ద మెప్పుకోసం జిల్లాలో తమకు ప్రజాబలం ఉందని చెప్పుకునేందుకు తెలుగుదేశం నేతలు తాపత్రయపడుతున్నారు. అందుకు కర్త, కర్మగా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, పార్లమెంటుకు పోటీచేసి ఓడిపోయిన శ్రీనివాసులురెడ్డిలు వ్యవహరిస్తున్నారు. వీరికి జిల్లాకు చెందిన టీడీపీ నేతలు వంత పాడుతున్నారు. ప్రజా మద్దతు లేకపోయినా అధికారం ఆశించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆ పార్టీ నేతలు ఏ ఒక్కరూ భావించడం లేదు. కేవలం మైండ్ గేమ్ను అమలుపర్చి అవకాశం వస్తే జెడ్పీపీఠం దక్కించుకుందామనే ఎత్తుగడలో ఉన్నట్లు తెలుస్తోంది.
వారి ఆశలు అడియాసలే....
వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధుల విశ్వాసం ముందు తెలుగుదేశం పార్టీ ఆశలు అడియాసలు కాకతప్పదని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అత్మాభిమానం ముందు టీడీపీ ప్రలోభాలు దిగదుడుపేనని, వైఎస్సార్సీపీ జెడ్పీటీసీలు ఒక్కరు కూడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడరనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వారు ఉంటే ప్రజల కోసం గడిచిన నాలుగు సంవత్సరాలుగా పోరాటం చేసేవారే కాదని, నాయకుల మధ్య అపోహలు సృష్టించేందుకే టీడీపీ నేతల ప్రకటనలు పరిమితమని వైఎస్సార్సీపీ కార్యకర్తలు పేర్కొంటున్నారు. టీడీపీ కుయుక్తులు ఏమాత్రం చెల్లవని జెడ్పీ పీఠంపై వైఎస్సార్సీపీ విజయకేతనం ఎగురవే సి తీరుతుందనే విశ్వాసాన్ని ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.
మైండ్ గేమ్!
Published Sun, Jun 8 2014 2:14 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement