సమీక్షా సమావేశంలో ఎక్సైజ్ డీసీ విజయకుమారి
కడప అర్బన్ : జిల్లాలోని 209 మద్యం షాపుల యజమానులు, 17 బార్ల యజమానులు ఎక్సైజ్శాఖ నిర్దేశించిన నిబంధనలను తప్పక పాటించాలని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ విజయకుమారి తెలిపారు. బుధవారం రాత్రి తమ కార్యాలయంలో అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి షాపు యజమాని హోలోగ్రామ్ యంత్రాలను తప్పక తమ షాపులో వినియోగించుకోవాలన్నారు.
జిల్లాలో 209 వైన్ షాపులకుగాను ఇప్పటికే 208 షాపుల వారు హోలోగ్రామ్ యంత్రాలను అద్దెకు తీసుకున్నట్లు సంబంధిత సీఐలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అలాగే 17 బార్లలో 16 బార్ల యజమానులు హోలోగ్రామ్ యంత్రాలను అద్దెకు తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా డీసీ మాట్లాడుతూ గతేడాది నవంబరు నెలలో, ఈ ఏడాదిలో ఈనెల 26వ తేదీ వరకు మొత్తం మద్యం అమ్మకాలపై సమీక్ష నిర్వహించామన్నారు.
2013 నవంబరులో 1 లక్ష 34 వేల 231 కేస్ల మద్యం, 55,532 కేస్ల బీరు కొనుగోలు చేశారని, తద్వారా రూ. 49.31 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. ఈ ఏడాది ఈనెల 26వ తేదీ వరకు 93,995 కేస్ల మద్యం, 51,044 కేస్ల బీరును కొనుగోలు చేశారని, తద్వారా రూ. 37.25 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. ఈ నాలుగు రోజుల్లో మరింత ఆదాయం వచ్చేందుకు లెసైన్స్దారులకు అధికారులు సూచించాలని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో కడప ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసాచారి, ప్రొద్దుటూరు ఎక్సైజ్ సూపరింటెండెంట్ శంభుప్రసాద్, ఏఈఎస్లు బాబు శ్రీధర్, బాలకృష్ణన్, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.
మద్యం లెసైన్స్దారులు నిబంధనలు పాటించాలి
Published Thu, Nov 27 2014 2:45 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement