రద్దుచేసిన నాలుగు వేల పింఛన్ల పునరుద్ధరణ
ఏప్రిల్ నుంచి పంపిణీకి చర్యలు
జన్మభూమిలో 45,974 దరఖాస్తులు
జిల్లాకు 17 వేల పింఛన్ల కేటాయింపు
ఎంపిక బాధ్యత జన్మభూమి కమిటీలదే
విశాఖపట్నం: జిల్లాకు కొత్త పింఛన్లు రాబోతున్నాయి. దరఖాస్తు చేసుకున్న వారికి.. మంజూరుకానున్న పింఛన్లకు పొంతన లేదు. అనర్హులంటూ తొలగించిన పింఛన్లలో మాత్రం మూడవవంతు పునరుద్ధరించేందుకు ప్రభుత్వం గ్రీన్సిగ్నెల్ ఇచ్చింది. పునరుద్ధరించనున్న పింఛన్లను ఏప్రిల్-1వ తేదీ నుంచి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్తగా మంజూరైన పింఛన్ల కోసం ఎంపిక బాధ్యతను మాత్రం మళ్లీ జన్మభూమి కమిటీలకే ఇవ్వనుండడం వివాదస్పదమవుతోంది. వడపోతల అనంతరం జిల్లాలో జీవీఎంసీ పరిధిలో 56,127 పింఛన్లుండగా, రూరల్ ప్రాంతంలో 3,04,777 పింఛన్లున్నాయి. గతేడాది అక్టోబర్ 2వ తేదీ నుంచి వృద్ధాప్య, వితంతు పింఛన్లను రూ.200 నుంచి రూ.1000, వికలాంగ పింఛన్లను రూ.500 నుంచి రూ.1500లకు పెంచారు. ఈ మేరకు జీవీఎంసీ పరిధిలో ఉన్న పింఛన్ల కోసం రూ.5.96 కోట్లు, గ్రామీణ ప్రాంతంలో ఉన్న పింఛన్ల కోసం 34.41 కోట్లు ప్రతి నెలా చెల్లిస్తున్నారు. కమ్యూనిటీ సర్వీస్ ప్రొవైడర్స్ (సీఎస్పీ)లను తొలగించడంతో గతేడాది డిసెంబర్ నుంచి పంపిణీ చేయడం పారంభించారు. జన్మభూమి కమిటీతో నిర్వహించిన సర్వేలో జిల్లా వ్యాప్తంగా సుమారు 25 వేలకు పైగా పింఛన్లను తొలగించగా, ఆ తర్వాత విపక్షాలు.. ప్రజాసంఘాల పోరాటం..పింఛన్దారుల నుంచి వచ్చిన ఒత్తిళ్ల మేరకు దశల వారీగా సుమారు ఐదారువేల వరకు పునరుద్ధరించగలిగారు.
అయినప్పటికీ అర్హులైన మరో 15వేల మంది వరకు పింఛన్లు దక్కని పరిస్థితి ఏర్పడింది. వీరిలో కూడా చాలా మంది అర్హులున్నారంటూ వారికి పింఛన్ పునరుద్ధరిం చాలని జన్మభూమి కమిటీలతో పాటు క్షేత్ర స్థాయిలో అధికారులు కూడా సిఫార్సు చేశారు. ఈ విధంగా రోల్ బ్యాక్ పింఛన్లు జిల్లాలో 6,800 వరకు ఉన్నాయి. వీటిలో 4వేల పింఛన్లను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం గ్రీన్సిగ్నెల్ ఇచ్చింది. వీటిని ఏప్రిల్ 1వ తేదీ నుంచి పాత పింఛన్లతో కలిపి మంజూరు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. మరో పక్క గతేడాది అక్టోబర్, నవంబర్లలో రెండు విడతలుగా నిర్వహించిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో కొత్త పింఛన్ల కోసం జిల్లాలో గ్రామీణ ప్రాంతంలో 34,654, అర్బన్లో 11,320 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ప్రాథమికంగా 35 వేల మంది అర్హులున్నారని అప్లోడ్ చేసి ప్రభుత్వానికి పంపించారు. ప్రభుత్వం కేవలం 17వేల పింఛన్లు మాత్రమే మంజూరు చేస్తూ ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. దరఖాస్తు చేసుకున్న వారిలో మూడో వంతు మందికి మాత్రమే మంజూరుచేస్తే మా పరిస్థితి ఏమిటని మిగిలిన వారు ప్రశ్నిస్తున్నారు. కొత్తగా మంజూరైన పింఛన్ల ఎంపిక బాధ్యతను మాత్రం మళ్లీ జన్మభూమి కమిటీలకే అప్పగించింది. దరఖాస్తు చేసుకున్న వారిలో ఈ కమిటీ ఆమోదముద్ర వేసిన వారికే ఈ పింఛన్లు మంజూరు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో తామంతా ఉత్సహ విగ్రహాలుగా తయారయ్యాయమని, కనీస విద్యార్హతలు కూడా లేని వారు సిఫార్సు చేస్తే సంతకాలు చేయాల్సివస్తోందని గ్రామ, మండల స్థాయి అధికారులు అసంతృప్తితో ఉన్నారు.
పింఛన్.. వచ్చెన్..!
Published Thu, Mar 26 2015 2:51 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
17, 18 తేదీల్లో గైట్లో ఎస్టీయూ రాష్ట్ర స్థాయి శిక్షణ
నేడు, రేపు గురుకుల పాఠశాలల్లో సీట్ల భర్తీ
No Headline
No Headline
శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణం
శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ‘గంగుల’
కరీంనగర్లో ‘లండన్’ ఎగ్జిబిషన్
నేలకు సారం.. పంటకు ప్రాణం
పనులు సత్వరమే పూర్తి చేయాలి
బీమా చెక్కు అందజేత
తప్పక చదవండి
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- కొత్త మార్కును దాటిన బంగారం! ఏకంగా ఎంత ఎగిసిందంటే..
- Virat Kohli: ఒక్కసారి క్రికెట్కు వీడ్కోలు పలికితే.. కోహ్లి నోట రిటైర్మెంట్ మాట!
- భారత సంతతి బాలుడికి దుబాయ్ పోలీసుల సత్కారం!
- IPL 2024: సన్రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరదు.. ఆ నాలుగు జట్లే! ఫ్యాన్స్ ఫైర్
- మళ్లీ మనదే అధికారం.. చరిత్ర సృష్టించబోతున్నాం: సీఎం జగన్
Advertisement