-
పింఛన్.. వచ్చెన్..!
రద్దుచేసిన నాలుగు వేల పింఛన్ల పునరుద్ధరణ ఏప్రిల్ నుంచి పంపిణీకి చర్యలు జన్మభూమిలో 45,974 దరఖాస్తులు జిల్లాకు 17 వేల పింఛన్ల కేటాయింపు ఎంపిక బాధ్యత జన్మభూమి కమిటీలదే విశాఖపట్నం: జిల్లాకు కొత్త పింఛన్లు రాబోతున్నాయి. దరఖాస్తు చేసుకున్న వారికి.. మంజూరుకానున్న పింఛన్లకు పొంతన లేదు. అనర్హులంటూ తొలగించిన పింఛన్లలో మాత్రం మూడవవంతు పునరుద్ధరించేందుకు ప్రభుత్వం గ్రీన్సిగ్నెల్ ఇచ్చింది. పునరుద్ధరించనున్న పింఛన్లను ఏప్రిల్-1వ తేదీ నుంచి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్తగా మంజూరైన పింఛన్ల కోసం ఎంపిక బాధ్యతను మాత్రం మళ్లీ జన్మభూమి కమిటీలకే ఇవ్వనుండడం వివాదస్పదమవుతోంది. వడపోతల అనంతరం జిల్లాలో జీవీఎంసీ పరిధిలో 56,127 పింఛన్లుండగా, రూరల్ ప్రాంతంలో 3,04,777 పింఛన్లున్నాయి. గతేడాది అక్టోబర్ 2వ తేదీ నుంచి వృద్ధాప్య, వితంతు పింఛన్లను రూ.200 నుంచి రూ.1000, వికలాంగ పింఛన్లను రూ.500 నుంచి రూ.1500లకు పెంచారు. ఈ మేరకు జీవీఎంసీ పరిధిలో ఉన్న పింఛన్ల కోసం రూ.5.96 కోట్లు, గ్రామీణ ప్రాంతంలో ఉన్న పింఛన్ల కోసం 34.41 కోట్లు ప్రతి నెలా చెల్లిస్తున్నారు. కమ్యూనిటీ సర్వీస్ ప్రొవైడర్స్ (సీఎస్పీ)లను తొలగించడంతో గతేడాది డిసెంబర్ నుంచి పంపిణీ చేయడం పారంభించారు. జన్మభూమి కమిటీతో నిర్వహించిన సర్వేలో జిల్లా వ్యాప్తంగా సుమారు 25 వేలకు పైగా పింఛన్లను తొలగించగా, ఆ తర్వాత విపక్షాలు.. ప్రజాసంఘాల పోరాటం..పింఛన్దారుల నుంచి వచ్చిన ఒత్తిళ్ల మేరకు దశల వారీగా సుమారు ఐదారువేల వరకు పునరుద్ధరించగలిగారు. అయినప్పటికీ అర్హులైన మరో 15వేల మంది వరకు పింఛన్లు దక్కని పరిస్థితి ఏర్పడింది. వీరిలో కూడా చాలా మంది అర్హులున్నారంటూ వారికి పింఛన్ పునరుద్ధరిం చాలని జన్మభూమి కమిటీలతో పాటు క్షేత్ర స్థాయిలో అధికారులు కూడా సిఫార్సు చేశారు. ఈ విధంగా రోల్ బ్యాక్ పింఛన్లు జిల్లాలో 6,800 వరకు ఉన్నాయి. వీటిలో 4వేల పింఛన్లను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం గ్రీన్సిగ్నెల్ ఇచ్చింది. వీటిని ఏప్రిల్ 1వ తేదీ నుంచి పాత పింఛన్లతో కలిపి మంజూరు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. మరో పక్క గతేడాది అక్టోబర్, నవంబర్లలో రెండు విడతలుగా నిర్వహించిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో కొత్త పింఛన్ల కోసం జిల్లాలో గ్రామీణ ప్రాంతంలో 34,654, అర్బన్లో 11,320 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ప్రాథమికంగా 35 వేల మంది అర్హులున్నారని అప్లోడ్ చేసి ప్రభుత్వానికి పంపించారు. ప్రభుత్వం కేవలం 17వేల పింఛన్లు మాత్రమే మంజూరు చేస్తూ ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. దరఖాస్తు చేసుకున్న వారిలో మూడో వంతు మందికి మాత్రమే మంజూరుచేస్తే మా పరిస్థితి ఏమిటని మిగిలిన వారు ప్రశ్నిస్తున్నారు. కొత్తగా మంజూరైన పింఛన్ల ఎంపిక బాధ్యతను మాత్రం మళ్లీ జన్మభూమి కమిటీలకే అప్పగించింది. దరఖాస్తు చేసుకున్న వారిలో ఈ కమిటీ ఆమోదముద్ర వేసిన వారికే ఈ పింఛన్లు మంజూరు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో తామంతా ఉత్సహ విగ్రహాలుగా తయారయ్యాయమని, కనీస విద్యార్హతలు కూడా లేని వారు సిఫార్సు చేస్తే సంతకాలు చేయాల్సివస్తోందని గ్రామ, మండల స్థాయి అధికారులు అసంతృప్తితో ఉన్నారు. -
రూ.1.31 కోట్లు స్వాహా
కర్నూలు(కలెక్టరేట్): సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీలో స్వాహాపర్వం కొనసాగుతోంది. కమ్యూనిటీ సర్వీస్ ప్రొవైడర్లు(సీఎస్పీ) చేతివాటం మితిమిరుతోంది. వితంతువులు.. వికలాంగులు.. వృద్ధుల కడుపుకొట్టి అక్రమార్కులు తమ పబ్బం గడుపుకుంటున్నారు. సీఎస్పీ పోస్టులకు ఉన్నత స్థాయిలో పైరవీలు జరుగుతుండటం వీటి డిమాండ్కు అద్దం పడుతోంది. జిల్లాలోని 53 మండలాల్లో పింఛన్ల పంపిణీ అక్రమాలపై మూడో విడత సామాజిక తనిఖీ(సోషల్ ఆడిట్) జరుగుతోంది. మొదటి విడతలో రూ.38,97,370.. రెండో విడతలో రూ.72,33,145 దుర్వినియోగమైనట్లు స్పష్టమైంది. మూడో విడతలో 21 మండలాల్లో సామాజిక తనిఖీ పూర్తి కాగా.. రూ.19,74,095 దుర్వినియోగమైనట్లు తేల్చారు. స్మార్ట్ కార్డులు ఉన్న వారికి యాక్సిస్ బ్యాంకు ద్వారా.. స్మార్ట్ కార్డులు లేని వారికి ఎంపీడీఓల ద్వారా పింఛన్ల పంపిణీ జరుగుతోంది. ఎంపీడీఓల ద్వారా పంచాయతీ సెక్రటరీలు పంపిణీ చేస్తుండగా, యాక్సిస్ బ్యాంకు ద్వారా పినో కంపెనీ నియమించిన సీఎస్పీలు పంపిణీ చేపడుతున్నారు. ఎంపీడీఓల ద్వారా జరిగిన పింఛన్ల పంపిణీలో రూ.45,13,955, యాక్సిస్ బ్యాంకు ద్వారా చేపట్టిన పంపిణీలో రూ.85,90,655 బొక్కేశారు. మొత్తం రూ.1.31 కోట్లకు పైగా స్వాహా జరిగితే.. రికవరీ మాత్రం రూ.16.35 లక్షలే కావడం గమనార్హం. ఎంపీడీఓల ఆధ్వర్యంలో పింఛన్లు పంపిణీ చేసిన పంచాయతీ సెక్రటరీలు అడ్డగోలుగా పేదల సొమ్ము తినేసినా చర్యలు కరువయ్యాయి. దాదాపు వంద మంది పంచాయతీ సెక్రటరీలు, ఇతరులు సొమ్ము స్వాహా చేసినా తుగ్గలి మండలంలో మాత్రమే ఒకరిద్దరిని సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు. తక్కిన వారిపై చర్యలు లేకపోగా.. రికవరీ కూడా చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇక పింఛన్లు, ఎన్ఆర్ఈజీఎస్ పేమెంట్లను పంచాయతీ స్థాయిలోని కమ్యూనిటీ సర్వీస్ ప్రొవైడర్లు పంపిణీ చేస్తుండగా.. 90 శాతం మంది దోపిడీకి పాల్పడుతున్నారు. ఎన్ఆర్ఈజీఎస్ కూలీల నుంచి వారికి వచ్చే వేతనంలో రోజుకు రూ.10 కమిషన్ కింద తీసుకొని పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. పింఛన్ల పంపిణీలో చనిపోయిన వారు.. గ్రామాలు వదిలి వెళ్లిన వారి సంతకాలు ఫోర్జరీ చేసి స్వాహా చేస్తున్నట్లు సమాచారం. పింఛన్ కార్డుల్లో పేర్ల తప్పులను సైతం సీఎస్పీలు తమకు అనుకూలంగా మల్చుకుంటున్నారు. కలెక్టర్ ఆదేశాలు బుట్ట దాఖలు పింఛన్లు స్వాహా చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని, రికవరీ చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి.సుదర్శన్రెడ్డి దాదాపు 8 నెలల క్రితం డీఆర్డీఏ, యాక్సిస్ బ్యాంకును ఆదేశించారు. అయితే ఇప్పటి వరకు ఆరుగురిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో సరిపెట్టారు. అరెస్టులు లేవు.. రికవరీ లేకపోవడం గమనార్హం. దాదాపు 1000 మంది సీఎస్పీలు అవినీతికి పాల్పడినా ఆరుగురిపై మాత్రమే కేసులు పెట్టడం అధికారుల పనితీరుకు నిదర్శనం. కనీసం రూ.లక్షకు పైబడి పింఛన్లు కాజేసిన వారిపై కేసులు పెట్టాలని కలెక్టర్ ఆదేశించినా ఫలితం లేకపోతోంది. యాక్సిస్ బ్యాంకు ఇచ్చే కమీషన్లో కట్ చేస్తాం సామాజిక భద్రతా పథకం కింద పంపిణీ చేసే పింఛన్లలో అక్రమాలు వాస్తవమే. బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే పలువురిపై క్రిమినల్ కేసులు పెట్టాం. పలువురు పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేశాం. రూ.1.31 కోట్లు దుర్వినియోగం కాగా.. రూ.16.35 లక్షలు రికవరీ చేశాం. పింఛన్ల పంపిణీలో యాక్సిస్ బ్యాంకుకు రెండు శాతం కమీషన్ ఇస్తున్నాం. అందులో దుర్వినియోగం అయిన మొత్తాన్ని కట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం. సీఎస్పీలు స్వాహా చేసిన మొత్తాన్ని కమీషన్లో పట్టుకుంటాం. - నజీర్ సాహెబ్, డీఆర్డీఏ పీడీ
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
చెన్నైకి గేమ్
పశ్చిమాసియా ఘర్షణ ఆర్థికానికి చేటే!
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement