'ప్రత్యేక హోదా ఏపీ హక్కు' | Sakshi
Sakshi News home page

'ప్రత్యేక హోదా ఏపీ హక్కు'

Published Sun, Apr 26 2015 12:03 PM

'ప్రత్యేక హోదా ఏపీ హక్కు' - Sakshi

విజయవాడ: ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆదివారం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రత్యేక హోదాకు కేంద్ర కట్టుబడి ఉందని.. కాకపోతే అందుకు కాస్త సమయం పడుతుందని మంత్రి అన్నారు. నూతనంగా ఏర్పాటు చేయబోయే రాజధాని నిర్మాణం కోసం రూ.500 కోట్లు కేటాయించామని చెప్పారు.

తాము కూడా ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నట్టు ఆమె తెలిపారు. త్వరలోనే విజయవాడలో ఎన్ఐడీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. జన్ధన్ యోజన కింద 14.5 కోట్ల ఖాతాలు ఓపెన్ అయ్యాయని నిర్మలా సీతారామన్ అన్నారు. అదే విధంగా ఆ ఖాతాల్లో రూ.14 వేల కోట్లు జమ చేశామని అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement