మోడీ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరు: కిషన్ రెడ్డి | Sakshi
Sakshi News home page

మోడీ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరు: కిషన్ రెడ్డి

Published Wed, Mar 5 2014 7:22 PM

మోడీ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరు: కిషన్ రెడ్డి - Sakshi

హైదరాబాద్: బీజేపీ విశ్వసనీయతతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ కోసం బీజేపీ కట్టుబడి ఉన్నందునే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కల ఫలించిందని ఆయన తెలిపారు. 
 
బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో మోడీ ప్రభంజనాన్ని ఎవరు ఆపలేరు అని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. 
 
ఎన్నికల నేపథ్యంలో మార్చిలో ఊహించని అనేక రాజకీయ మార్పులు చోటు చేసుకుంటాయని కిషన్‌ రెడ్డి తెలిపారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు, నల్లగొండ జేఏసీ చైర్మన్‌ గోలి అమరేందర్‌ రెడ్డి, ఆదిలాబాద్‌ టీడీపీ నేత పాయల్‌ శంకర్‌లు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement