విశాఖ మెట్రోకు నోటిఫికేషన్‌ జారీ | Sakshi
Sakshi News home page

విశాఖ మెట్రోకు నోటిఫికేషన్‌ జారీ

Published Fri, Jun 16 2017 1:37 PM

Notification issued to Visakhapatnam Metro

అమరావతి: విశాఖ మెట్రో కోసం ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీచేసింది. మూడు కారిడార్‌లలో 42.55 కిలోమీటర్ల మేర మెట్రో రైలు ఏర్పాటు చేయనుండగా.. దాని కోసం శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు.

గాజువాక జంక్షన్‌ నుంచి ఎన్‌ఏడీ జంక్షన్‌, గురుద్వారా, మద్దిలపాలెం, హనుమంతవాక మీదుగా కొమ్మాది జంక్షన్‌ వరకు 30.38 కి.మీలతో మొదటి కారిడార్‌, గురుద్వారా నుంచి పాత పోస్ట్‌ ఆఫీస్‌ వరకు 5.25 కి. మీలతో రెండో కారిడార్‌, తాలిచెట్లపాలెం నుంచి వాల్తేర్‌ వరకు 6.9 కి.మీలతో మూడో కారిడార్‌ నిర్మాణం చేపట్టనున్నారు.

Advertisement
Advertisement