ట్రాక్టర్, బైక్ ఢీ : ఒకరి మృతి | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్, బైక్ ఢీ : ఒకరి మృతి

Published Wed, May 20 2015 6:35 PM

One dies in Road accident

కర్నూలు :  ట్రాక్టర్, బైక్ ఢీకొని ఓ వ్యక్తి మరణించిన సంఘటన కర్నూలు జిల్లా మహానంది మండలం బొల్లవరం వద్ద బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... బొల్లవరం గ్రామానికి చెందిన హరికృష్ణ(35) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా బుధవారం బొల్లవరం నుంచి మహానందికి బైక్ మీద వెళ్తున్న సమయంలో ఎదురుగా మట్టిలోడుతో వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. దీంతో హరికృష్ణ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement