బస్సులో ప్రయాణికుల మధ్య ఘర్షణ:ఒకరు మృతి | Sakshi
Sakshi News home page

బస్సులో ప్రయాణికుల మధ్య ఘర్షణ:ఒకరు మృతి

Published Thu, Jun 5 2014 2:43 PM

one killed amongst passengers controversy in rtc bus

నెల్లూరు: ఓ ఆర్టీసీ బస్సులో ప్రయాణికుల మధ్య చోటు చేసుకున్న వివాదం కాస్తా ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసి ఓ ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన దుత్తులూరు మండలం నర్రవాడ వద్ద గురువారం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికుల మధ్య తొలుత మామూలుగా మొదలైన మాటల యుద్ధం తారాస్థాయికి చేరడంతో వారు ఒకరిపై ఒకరు దాడికి యత్నించారు. ఈ క్రమంలోనే అందులో ఓ ప్రయాణికుడ్ని బస్సులో నుంచి తోసేవేయడంతో కింద పడిన అతను మృత్యువాత పడ్డాడు.

Advertisement
Advertisement