కుమారుడిని వదిలించుకున్నతల్లిదండ్రులు  | Sakshi
Sakshi News home page

కుమారుడిని వదిలించుకున్నతల్లిదండ్రులు 

Published Sat, Sep 14 2019 10:55 AM

Parents Leaved Son And Went Away In Tirupati - Sakshi

సాక్షి, చిత్తూరు : నాగలాపురం మండలం సురుటపల్లిలోని శ్రీ పళ్లికొండేశ్వరాలయం వద్ద కుమారుడిని వదలి తల్లిదండ్రులు అదృశ్యమైన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. బిక్కుబిక్కుమంటూ దిగాలుగా ఉన్న ఆ బాలుడిని భక్తులు, ఆలయ అధికారులు గమనించి చేరదీశారు. బుజ్జగించి అతడి వివరాలు తెలుసుకున్నారు. తన పేరు ఏసు అని, తనది ఏలూరు అని, తన తండ్రి పేరు సుబ్బారావు, తల్లిపేరు పుష్ప అని తెలిపాడు. తన తల్లిదండ్రులు బాతులు మేపుకుంటూ ఈ ప్రాంతానికి వచ్చారని, రాత్రి నుంచి కనిపించకుండా పోయారని ఏడుస్తూ చెప్పాడు. ఆలయ అధికారులు ఆ బాలుడిని నాగలాపురం పోలీసులకు అప్పగించారు. స్పందించిన పోలీసులు అతను చెప్పిన వివరాలను ఏలూరు పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం చేరవేసి తల్లిదండ్రుల వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. బాలుడిని తాత్కాలికంగా సురుటపల్లి చిన్న పిల్లల హోమ్‌కు తరలించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తిరుపతిలోని చిన్న పిల్లల హోమ్‌కు శనివారం తరలిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement