జగన్‌మోహన్‌రెడ్డికి వినతి | Sakshi
Sakshi News home page

జగన్‌మోహన్‌రెడ్డికి వినతి

Published Fri, May 18 2018 6:17 AM

People Sharing Their Sorrows To Ys Jagan - Sakshi

పశ్చిమగోదావరి :గిరమ్మ ఎత్తిపోతల పథకం పూర్తయ్యేలా చూడాలని ద్వారకా తిరుమల మండలం సీహెచ్‌ పోతేపల్లి మాజీ సర్పంచ్‌ రైతు యాచమనేని నాగేశ్వరరావు ప్రజాసంకల్పపాదయాత్రలో జగన్‌మోహన్‌రెడ్డిని గురువారం కలిసి విన్నవించారు. జగనన్న పాదయాత్ర గ్రామం మీదుగా వెళ్లడంతో ఆయన కలసి సమస్యను వివరించారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేసి నీరు విడుదల చేస్తే సుమారు 7 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. చంద్రబాబునాయుడు 2003లో ఈ పథకానికి శంకుస్థాపన చేశారని, అనంతరం పూర్తి నిర్లక్ష్యం వహించారని వివరించారు. మధ్యలో వైఎస్‌ పుణ్యమా అని పథకం దాదాపు పూర్తయ్యిందన్నారు. ప్రస్తుత సీఎం పట్టించుకోనందున పథకం పూర్తి కాలేదన్నారు. తమరు అధికారంలోకి రాగానే పథకాన్ని పూర్తి చేస్తే, 1500 మంది రైతు కుటుంబాలకు మంచి జరుగుతుందని ఆయన జగనన్నకు విజ్ఞప్తి చేశారు. 

Advertisement
Advertisement