జగనన్న సీఎం కావాలి | Sakshi
Sakshi News home page

జగనన్న సీఎం కావాలి

Published Mon, Jun 4 2018 6:59 AM

People Sharing Their Sorrows To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

పశ్చిమగోదావరి :జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాను అని మార్టేరు మండలం వీరప్ప చెరువుకు చెందిన కడలి దుర్గాప్రసాద్‌ ఒక పేపర్‌పై రాసిచ్చాడు. తనకు పుట్టుకతోనే మాటలు రావని, తండ్రి లేడని రాశారు. ఓ ఫొటో స్టూడియోలో పని చేస్తూ తల్లిని పోషించుకుంటున్నానని, జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావాలన్నదే తన ఆకాంక్ష అని జననేతను కలిసి సంఘీభావం ప్రకటించారు.

ఇంటి లోను ఇప్పించయ్యా..
బాబూ నాకు కొడుకు, కుమార్తె. కొంతకాలం క్రితం కుమారుడు అనారోగ్యంతో మృతి చెందాడు. కూతురు భర్త కూడా మరణించాడు. అమ్మాయి మా వద్దే ఉంటుంది. నా భర్తకు వచ్చే పింఛన్‌తోనే జీవనం సాగిస్తున్నాం. నేను పనిలోకి వెళ్లేదాన్ని, వృద్ధురాలినని పని మాన్పించేశారు. కుటుంబం గడవడం కష్టంగా ఉంది. కనీసం ఇల్లు కట్టుకోవడానికి లోను ఇప్పించన్నా అంటూ నెగ్గిపూడి పాదయాత్రలో జగన్‌మోహన్‌రెడ్డి అదే గ్రామానికి చెందిన నవ్వాబత్తుల సూర్యావతికి కలుసుకుని విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement