సాక్షి, అమరావతి : సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని గప్పాలు కొట్టుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఆచరణలో మాత్రం అభాసుపాలవుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మెగా రుణమేళాల పేరుతో రెండు నెలలుగా చేస్తున్న హడావుడి అంతా పేరు గొప్ప తీరు దిబ్బలా తయారైంది. నాలుగున్నరేళ్లుగా ఒక్క పైసా రుణం ఇవ్వకుండా ఇప్పుడు ఒక్కో రుణమేళాలో లక్ష మందికి సబ్సిడీ రుణాలు పంపిణీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటన అంతా బోగస్గా తేటతెల్లమవుతోంది. నవంబరు 12, డిసెంబరు 6న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన రెండు మెగా రుణమేళాల్లో కేవలం 32వేల మందికే రుణాలిచ్చినట్లు తెలుస్తోంది. మూడో విడత రుణమేళాడిసెంబరు 28న ప్రారంభించారు.
డిమండ్ కొండంత.. మంజూరు పిసరంత
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు, బ్రాహ్మణ, వైశ్య, ఈబీసీ, క్రిస్టియన్, దివ్యాంగులు, మహిళా అభివృద్ధి, సీనియర్ సిటిజన్స్, అత్యంత వెనుకబడిన కులాల కార్పొరేషన్లు ఉన్నాయి. వీటి ద్వారా సబ్సిడీ రుణాలు ఇవ్వడమనేది ఏటా సాధారణంగా జరిగే కార్యక్రమమే. ఈ కార్పొరేషన్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ కార్పొరేషన్లు తప్ప మిగిలిన వాటికి వంద కోట్లు కూడా కేటాయించని పరిస్థితి. కానీ, నాలుగున్నరేళ్లపాటు వాటి ఊసే ఎత్తని సర్కారు ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో వాటిపై హడావుడి చేస్తోంది. మరోవైపు.. ఇప్పటివరకు అన్ని సంక్షేమ శాఖలకు మొత్తం 7,47,649 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో 2,68,580 మందిని అర్హులుగా తేల్చారు. వీరిలో కనీసం 32వేల మందికి కూడా సరిగ్గా లబ్ధి చేకూరలేదు. అలాగే, లబ్ధిదారులు చేసుకున్న దరఖాస్తులను బట్టి చూస్తే మొత్తం రూ.1,66,174.95కోట్ల మేర డిమాండ్ ఉన్నట్లు ముఖ్యమంత్రి డ్యాష్బోర్డులో ప్రభుత్వం పేర్కొంది. కానీ, ఇప్పటివరకు రూ.3,694.36కోట్లు మాత్రమే సర్కారు విడుదల చేసింది. ఇందులో కేవలం పదిశాతం నిధులు మాత్రమే మంజూరుచేశారని అధికారులు చెబుతున్నారు. అంటే కేవలం రూ.369కోట్లే సబ్సిడీ రుణాలు ఇచ్చారన్న మాట. మరోవైపు.. వాషర్మెన్, వాల్మీకి/బోయ, నాయీ బ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, వడ్డెర, బట్రాజ, కుమ్మరి, కృష్ణబలిజ/పూసలి, మేదర, గీత కార్మిక, సగర బీసీ ఫెడరేషన్లు ఉన్నా ఉపయోగంలేదు. వాటి ద్వారా పేదలకు ప్రభుత్వ సాయం నామమాత్రంగా కూడా అందటంలేదు. ఒక్కో ఫెడరేషన్కు రూ.25 కోట్ల నుంచి రూ.50 కోట్లలోపు మాత్రమే నిధులు కేటాయిస్తుండడం ఇందుకు కారణం.
టీడీపీ వారికే ఆదరణ
ఇదిలా ఉంటే.. ఎంపీడీవోలు టీడీపీ కార్యకర్తలనే రుణాలకు ఎంపిక చేస్తున్నారనే విమర్శలు కోకొల్లలు. ఆదరణ వస్తువుల కోసం రూ.30వేల యూనిట్కు దరఖాస్తు చేసుకున్న వారిలో టీడీపీ వారినే ఎంపిక చేశారని మిగిలిన వారు ఆరోపిస్తున్నారు. ఇతరులను రూ.పదివేల యూనిట్లకు ఎంపిక చేస్తున్నట్లు వారు తెలిపారు. దీంతో ఎమ్మెల్యేల చేతుల్లో ఎంపీడీవోలు కీలుబొమ్మలుగా మారారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, 30వేల యూనిట్ మాకెందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తే ఇచ్చింది తీసుకోవాలని అధికారులు అంటున్నట్లు దగాపడ్డ లబ్ధిదారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇక అధికారులైతే.. రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు సహకరించడంలేదని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీనే వారికి పంపిణీ చేసి రుణం ఇవ్వకుండా దాటవేస్తున్నారని చెబుతున్నారు. అంతేకాక, సరఫరాదారులు సకాలంలో సరఫరా చేయకపోవడంవల్లే ఆదరణ వస్తువులు సరిగ్గా అందడంలేదంటున్నారు. కానీ, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ సమస్యలన్నీ పరిష్కరించవచ్చని లబ్ధిదారులు అంటున్నారు.
దారుణ మేళాలు!
Published Sat, Dec 29 2018 3:08 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement