5 కి.మీ. పరుగుకు స్వస్తి.. ప్రతిభ ఆధారంగా సెలక్షన్లు: డీజీపీ
చిత్తూరు అర్బన్/ తిరుపతి క్రైం/ సాక్షి,తిరుమల : పోలీసుశాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నవంబర్ నెలాఖరులోపు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని డీజీపీ జేవీ.రాముడు తెలిపారు. శనివారం ఆయన చిత్తూరు, తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ పోలీసుశాఖలో 5 కి.మీ. పరుగును రద్దు చేసి, కొత్త సంస్కరణలు ప్రవేశపెట్టే దిశగా చర్చలు జరుగుతున్నాయన్నారు. అభ్యర్థుల శారీరక సామర్థ్యంతో పనిలేకుండా వారి ప్రతిభ ఆధారంగా సెలక్షన్లు నిర్వహిస్తామన్నారు. హోంగార్డులకు జీతాలు పెంచుతామని, మెడికల్ అలవెన్స్ మొదలగు వాటి గురించి ప్రతిపాదనలు పెట్టామన్నారు.
నాగార్జున వర్సిటీలో ర్యాగింగ్ కారణంగా మృతి చెందిన విద్యార్థిని రిషితేశ్వరి ఘటనపై ప్రిన్సిపల్ బాబూరావును ఎందుకు అరెస్టు చేయలేదని చిత్తూరులో విలేకరులు అడిగిన ప్రశ్నకు డీజీపీ సమాధానమిచ్చారు. ‘ఎవరో ఏదో మాట్లాడితే అరెస్టు చేయలేం. రిషితేశ్వరి మృతిలో ప్రిన్సిపల్ ప్రమేయం ఉందని ఎవరివద్దయినా ఆధారాలున్నాయా..? ’ అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు ఎంతటివారైనా నేరం రుజువైతే శిక్ష తప్పదన్నారు. కాగా శనివారం ఉదయం ఆయన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
నవంబర్లో ‘పోలీసు’ నోటిఫికేషన్!
Published Sun, Sep 6 2015 3:14 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- గుండె ఘోష విన్నారు..
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement