ప్రకాశ్నగర్ (రాజమండ్రి) :తూర్పుగోదావరి జిల్లాకు కేంద్రం కాకినాడ అయినప్పటికీ, రాజకీయాలకు మాత్రం రాజధాని రాజమండ్రియేనని శాసనసభ ఉప ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. రాష్ట్రంలోని ప్రతి రాజకీయ పార్టీ తన తొలి కార్యక్రమాలను రాజమండ్రి నుంచే ప్రారంభిస్తుందని, తొలి నాళ్ల నుంచి ఇది ఆచారంగా వస్తోందన్నారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఆధ్వర్యంలో రాజమండ్రి సిటీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తల కార్తిక వనసమారాధన రాజమండ్రిలోని వీఎల్పురం కుడుపూడి ధనయ్య తోటలో ఆదివారం జరిగింది.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసేవారంతా జగన్మోహన్రెడ్డి కుటుంబసభ్యులేనని అన్నారు. కుటుంబ సభ్యులమంతా కలిసి వన సమారాధాన చేసుకోవడం శుభపరిణామమన్నారు. మితిమీరిన విశ్వాసం రాజకీయాలకు పనికిరాదని, ప్రజాహిత కార్యక్రమాలు చేస్తూ మన యువనాయకుడి బాటలో మనమంతా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పార్టీ తరఫున ఏ కార్యక్రమం చేపట్టినా సమన్వయంతో, తిరుగులేని విధంగా చేయాలన్నారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ పార్టీ బలంగా ఉందన్న సూచిక కోసమే కార్తిక వనసమారాధన ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
తనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినందుకు జగన్ మోహన్రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. అంతా కలిసి కట్టుగా ముందుకు నడుస్తామన్నారు. సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి మాట్లాడుతూ ఇచ్చిన మాట కోసం నిలబడే నాయకుడు అధినేత జగన్మోహన్రెడ్డి ఒక్కరేనన్నారు. ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డికి చంద్రబాబుకు నిజానికి, అబద్దానికి ఉన్నంత తేడా ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దేశంలోని ఏ రాష్ట్రం అమలు చేయని పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. రాజమండ్రి రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి బాటలో నడుస్తూ పార్టీని బలోపేతం చేయాలన్నారు.
ఉత్సాహం నింపిన వనసమారాధన
పార్టీ నేతలందరినీ ఒకే తాటిపైకి తీసుకు వచ్చి వారిలో ఉత్సాహాన్ని నింపేందుకు కార్తిక వన సమారాధన వేదికైందని పలువురు ప్రముఖులు కొనియాడారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావును అభినందించారు. ఎమ్మెల్సీ కుమారుడు, యువ నాయకుడు ఆదిరెడ్డి వాసు కార్యక్రమ పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించారు. వేలాదిగా అభిమానులు, కార్యకర్తలు తరలి వచ్చారు. అభిమానులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆందరినీ ఆకట్టుకున్నాయి. మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి, మాజీ ఎంపీ గిరిజాల వెంకటస్వామి నాయుడు, జిల్లా అధికార ప్రతినిధి పీకే రావు, గుత్తుల సాయి, తోట సుబ్బారావు నాయుడు, పార్టీ నాయకులు రావిపాటి రామచంద్రరావు, నక్కా రాజబాబు, ఆర్వీవీ సత్యనారాయణ చౌదరి, రెడ్డి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
రాజకీయ రాజధాని రాజమండ్రి
Published Mon, Oct 27 2014 12:30 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
స్ట్రాంగ్ రూమ్ల తనిఖీ
ఏయూ డిగ్రీ పరీక్ష ఫలితాలు విడుదల
అడ్డగోలుగా పార్కింగ్ చేస్తే.. అంతే
సరకు రవాణాలో సరికొత్త వ్యూహాలు
బాలికపై కేజీహెచ్ ఉద్యోగి లైంగిక వేధింపులు
India Meteorological Department: రాజస్తాన్లోని ఫలోదీలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత
కేకే లైన్లో డీఆర్ఎం తనిఖీలు
జంతు సంరక్షణ చట్టం నోడల్ అధికారిగా ఏసీపీ శ్యామలరావు
కెమికల్ ఇంజినీరింగ్లో విస్తృత అవకాశాలు
తప్పక చదవండి
- మాకంటే ఎక్కువ ఉద్యోగాలిచ్చుంటే రాజీనామా చేస్తా
- Malaysia Masters 2024: ఫైనల్లో పీవీ సింధు
- ‘లైఫ్ ట్యాక్స్’కు ఎగనామం!
- Mallikarjun Kharge: చైనా ఆక్రమణలపై మోదీ మౌనం
- మీ ఇంటిని చక్కదిద్దుకోండి..!
- Lok Sabha Election 2024: ఆరో విడతలో 61.11 శాతం
- కలిసికట్టుగా ముందుకు..
- Lok Sabha Election 2024: ముస్లింల ఓట్ల కోసం ‘ముజ్రా’
- India Meteorological Department: రాజస్తాన్లోని ఫలోదీలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత
- సిరుల విరులు..కొండ చీపుర్లు
Advertisement