-
పాతవి లింక్ చెయ్యకపోతే పెనాల్టీ అంటున్నారా?
సాక్షి, అమరావతి : ఉదయాన్నే రాష్ట్ర పౌరులు ఎవరి పనుల్లో వాళ్లున్నారు. పేపర్ చూసే పనిలో ఉన్న ఓ పౌరుడు సడన్గా ఉలిక్కిపడ్డాడు. ఏంటన్నట్లు చూశాడు పక్కనున్న పౌరుడు. ‘‘ఈ గవర్నమెంటు ఎప్పుడూ ఏదో ఒక తలనొప్పి తెచ్చిపెడుతూనే ఉంటుంది’’ అన్నాడు చేతిలో పేపర్ ఉన్న పౌరుడు (చే.పౌ). ‘‘అవున్నిజమే. నేనూ చూశాను పేపర్లో. ఆధార్కి పాన్ని లింక్ చెయ్యాలట కదా.. మార్చి 31 లోపు. ఏప్రిల్లో పోలింగ్ డేట్ పెట్టుకుని, మార్చిలో ఈ లింకింగ్ డేట్ ఏంటో..’’ అన్నాడు పక్కనున్న పౌరుడు (ప.పౌ.) ‘‘అదేం పెద్ద ప్రాబ్లం కాదు. లింక్ చేస్తే లింకైపోతుంది’’. ‘‘మరేంటి ప్రాబ్లమ్? పాతవి లింక్ చెయ్యకపోతే పెనాల్టీ అంటున్నారా?’’ అన్నాడు ప.పౌ. పేపర్లోకి తొంగి చూస్తూ. ‘‘పాతవేం పెండింగులో లేవు. ఎప్పటికప్పుడు అన్నీ లింక్ చేసి పడేశా. ఆధార్ని ఫోన్ నంబర్కి లింక్ చేశా. ఫోన్ నంబర్ని పాన్ నంబర్కి లింక్ చేశా. బ్యాంక్ అకౌంట్కి ఆధార్ని లింక్ చేశా. ఆధార్కి గ్యాస్ అకౌంట్ లింక్ చేశా. ఓటర్ ఐడీని ఆధార్కి లింక్ చేశా. ఇప్పుడు ఆధార్ని పాన్కి లింక్ చెయ్యమంటున్నారు కదా. అదీ చేసేస్తా. పాన్కి పాన్ని, ఆధార్కి ఆధార్ని, ఫోన్కి ఫోన్ని, ఓటర్ ఐడీకి ఓటర్ ఐడీని లింక్ చెయ్యమన్నా చేసేస్తా..’’ అన్నాడు చే.పౌ. ‘‘మరింక ప్రాబ్లమ్ ఏంటి? ఏం రాశారు పేపర్లో?’’ ‘‘ఈవీఎంల్లో అభ్యర్థుల ఫొటోలు పెడుతున్నారట!’’ ‘‘మంచిదే కదా. ఒకే పేరుతో ఇద్దరు ముగ్గురు అభ్యర్థులుంటే కన్ఫ్యూజన్ లేకుండా మన క్యాండిడేట్ ఫొటోని చూసి గుద్దే యొచ్చు’’ అన్నాడు ప.పౌ. ‘‘పార్టీ సింబల్ ఉంటుంది కదా. మళ్లీ ఫొటో ఎందుకు? ఓటర్కి క్లారిటీ కోసం అని ఫొటోతో పాటు పార్టీల నినాదాలు కూడా ఈవీఎంలపై రాయించేలా ఉన్నాడు ఎలక్షన్ కమిషనర్’’ అన్నాడు చే.పౌ. ‘‘సింబల్ని గుర్తు పట్టలేకపోతున్నారనే కదా.. ఫొటోలు పెడుతున్నారు. మొన్న తెలంగాణ ఓటర్లు కారుకి, ట్రక్కుకు తేడా కనిపెట్టలేకపోవడంతో తనకు రెండు మూడు ఓట్లు తగ్గాయని కేసీఆర్ ఎలక్షన్ కమిషన్కు కంప్లయింట్ కూడా చేశాడు’’ అన్నాడు ప.పౌ. ‘‘ప్రాబ్లం నీకు అర్థం కావడం లేదు’’ అన్నాడు చే.పౌ. ‘‘ఏంటి చెప్పు..’’ అన్నాడు ప.పౌ. ‘‘చెప్తే అర్థం కాదు. ఆధార్ కార్డుందా నీ దగ్గర? ఉంటే ఇటివ్వు’’ అన్నాడు. ‘‘ఆధార్ కార్డే కాదు, అన్ని కార్డులూ ఉన్నాయి’’ అని జేబులోంచి రబ్బరు బ్యాండ్వేసి ఉన్న పెద్ద కార్డుల సెట్టు ఒకటి తీశాడు ప.పౌ.! ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ కార్డు, ఆర్.సి.కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ కార్డు.. అన్నీ గవర్నమెంట్ కార్డులు. ‘‘ఈ కార్డులన్నిట్లో నీ ఫొటోలు ఉన్నాయి కదా! ఒక్క ఫొటోలో అయినా నువ్వు నువ్వులా ఉన్నావా? నీ జేబులోంచి కార్డులు తీశావు కాబట్టి కార్డుల్లో ఉన్నది నేనేనని అనుకుంటున్నావు కానీ.. నీ కార్డుని మిగతావాళ్ల కార్డుల్లో కలిపి, వాటిల్లోంచి నీ కార్డేదో తియ్యమంటే తియ్యగలవా? చిలకని పట్టుకు రావల్సిందే’’ అన్నాడు చే.పౌ. చే.పౌ. పాయింట్ అర్థమైంది ప.పౌకి. ‘‘చట్టం ముందు అంతా సమానం అన్నట్లు, గవర్నమెంట్ కార్డుల్లో ఫొటోలన్నీ ఒకేలా ఉంటాయి కాబట్టి, రేపు ఈవీఎంల్లోనూ అభ్యర్థుల ఫొటోలు కూడా ఒకేలా ఉంటాయని కదా నీ పాయింట్’’ అన్నాడు ప.పౌ. ‘‘అది కాదు నా పాయింట్’’ అన్నాడు చే.పౌ. ‘‘మరేంటి?!’’ ‘‘ఫొటోల్లో అభ్యర్థులు చక్కగా కనిపిస్తున్నా.. ఒక పార్టీ గుర్తు పక్కన వేరే పార్టీ అభ్యర్థి ఫొటో అతికించారనుకో.. అప్పుడేంటీ?!’’ అన్నాడు చేతిలో పేపర్ ఉన్న పౌరుడు. ‘పాయింటే’’ అన్నాడు పక్కనున్న పౌరుడు. – మాధవ్ -
రాజకీయ రాజధాని రాజమండ్రి
ప్రకాశ్నగర్ (రాజమండ్రి) :తూర్పుగోదావరి జిల్లాకు కేంద్రం కాకినాడ అయినప్పటికీ, రాజకీయాలకు మాత్రం రాజధాని రాజమండ్రియేనని శాసనసభ ఉప ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. రాష్ట్రంలోని ప్రతి రాజకీయ పార్టీ తన తొలి కార్యక్రమాలను రాజమండ్రి నుంచే ప్రారంభిస్తుందని, తొలి నాళ్ల నుంచి ఇది ఆచారంగా వస్తోందన్నారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఆధ్వర్యంలో రాజమండ్రి సిటీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తల కార్తిక వనసమారాధన రాజమండ్రిలోని వీఎల్పురం కుడుపూడి ధనయ్య తోటలో ఆదివారం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసేవారంతా జగన్మోహన్రెడ్డి కుటుంబసభ్యులేనని అన్నారు. కుటుంబ సభ్యులమంతా కలిసి వన సమారాధాన చేసుకోవడం శుభపరిణామమన్నారు. మితిమీరిన విశ్వాసం రాజకీయాలకు పనికిరాదని, ప్రజాహిత కార్యక్రమాలు చేస్తూ మన యువనాయకుడి బాటలో మనమంతా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పార్టీ తరఫున ఏ కార్యక్రమం చేపట్టినా సమన్వయంతో, తిరుగులేని విధంగా చేయాలన్నారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ పార్టీ బలంగా ఉందన్న సూచిక కోసమే కార్తిక వనసమారాధన ఏర్పాటు చేసినట్టు తెలిపారు. తనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినందుకు జగన్ మోహన్రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. అంతా కలిసి కట్టుగా ముందుకు నడుస్తామన్నారు. సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి మాట్లాడుతూ ఇచ్చిన మాట కోసం నిలబడే నాయకుడు అధినేత జగన్మోహన్రెడ్డి ఒక్కరేనన్నారు. ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డికి చంద్రబాబుకు నిజానికి, అబద్దానికి ఉన్నంత తేడా ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దేశంలోని ఏ రాష్ట్రం అమలు చేయని పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. రాజమండ్రి రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి బాటలో నడుస్తూ పార్టీని బలోపేతం చేయాలన్నారు. ఉత్సాహం నింపిన వనసమారాధన పార్టీ నేతలందరినీ ఒకే తాటిపైకి తీసుకు వచ్చి వారిలో ఉత్సాహాన్ని నింపేందుకు కార్తిక వన సమారాధన వేదికైందని పలువురు ప్రముఖులు కొనియాడారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావును అభినందించారు. ఎమ్మెల్సీ కుమారుడు, యువ నాయకుడు ఆదిరెడ్డి వాసు కార్యక్రమ పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించారు. వేలాదిగా అభిమానులు, కార్యకర్తలు తరలి వచ్చారు. అభిమానులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆందరినీ ఆకట్టుకున్నాయి. మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి, మాజీ ఎంపీ గిరిజాల వెంకటస్వామి నాయుడు, జిల్లా అధికార ప్రతినిధి పీకే రావు, గుత్తుల సాయి, తోట సుబ్బారావు నాయుడు, పార్టీ నాయకులు రావిపాటి రామచంద్రరావు, నక్కా రాజబాబు, ఆర్వీవీ సత్యనారాయణ చౌదరి, రెడ్డి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement