విజయనగరం అర్బన్: ఉపాధ్యాయ దినోత్సావాన్ని పురస్కరించుకొని జిల్లాస్థాయిలో ఇచ్చే అవార్డులకు ఎంపికైన ఉత్తమ ఉపాధ్యాయుల జాబితా ప్రకటనలో విద్యాశాఖ వైఖరి ఉపాధ్యాయుల్లో ఉత్కంఠ రేపింది. జాబితాను శుక్రవారం సాయంత్రం వరకు ప్రకటించకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అర్హతలు, నిర్ధేశాల మేరకు ఎంపిక చేసిన జాబితా శుక్రవారం ఉదయానికే సిద్ధమయింది. అయితే దాన్ని ప్రకటించకుండా గోప్యత పాటించారు. రాజకీయ ఒత్తిళ్లతో తుదిజాబితాను మార్చడానికే ప్రకటించడంలేదని ఉపాధ్యాయ వర్గాలు అనుమాన పడుతున్నాయి.
జాబితాను బహిరంగంగా ప్రకటించకుండా శుక్రవారం రాత్రి గ్రహీతలకు నేరుగా ఫోన్చేసి చెప్పినట్టు సమాచారం. ఇలా రహస్యంగా తెలియజేయడంలో ఆంతర్యమేంటని ఉపాధ్యయవర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. జిల్లాలో కనీసం 15 ఏళ్ల సర్వీసులో ఆదర్శ సేవలందించిన వివిధ కేడర్కు చెందిన 28 మందిని ఈ ఏడాది ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేశామని డీఈఓ జి.కృష్ణారావు తెలిపారు. అయితే ఎంపికైన ఉపాధ్యాయుల పేర్లు, వివరాలను తెలిపేందుకు ఆయన నిరాకరించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం జరిగే ఉపాధ్యాయ దినోత్సవంలో సత్కరిస్తామని డీఈఓ తెలిపారు.
ఉత్తమ టీచర్ల జాబితాపై గోప్యం
Published Sat, Sep 5 2015 12:00 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement