చిలకలూరిపేట:
హైదరాబాద్ వంటి మహా నగరాల్లో జరిగే బైక్, కారు రేసింగ్లు గుంటూరు జిల్లాలోనూ కనిపిస్తున్నా యి. ప్రాణాంతకంగా మారిన ఈ పందాలు ప్రజల్లోనూ భయాందోళనలు రేపుతున్నాయి. అతి వేగంగా వాహనాలను నడుపుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న యువతరం తమ బంగరు భవితను కోల్పోతున్నారు.
పందాల సందర్భంగా జరుగుతున్న ప్రమాదాల్లో కొందరు ప్రాణాలు కోల్పోతుండగా, మరికొందరు గాయాలపాలై వికలాంగులుగా మారుతు న్నారు. ఆదివారం యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద 16వ నంబరు జాతీయ రహదారిపై జరిగిన కారు రేసింగ్ను చూసిన ప్రజలే భయాందోళనకు గురయ్యారంటే వాహనాల వేగం ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు.
ఎప్పుడు రద్దీగా ఉండే 16వ నంబరు జాతీయ రహదారిపై తిమ్మాపురం పరిధిలో ఆది వారం కొంతమేర ట్రాఫిక్ తక్కువగానే ఉంది. విద్యాసంస్థలకు సెలవు కావడం, వాహన రాకపోకలు పెద్దగా లేకపోవడంతో భారీ ప్రాణ నష్టం తప్పినట్టయింది.
జాతీయ రహదారి విస్తరణ కూడా వాహనాల వేగం పెరగటానికి కారణమైంది. గతంలో నాలుగు లేన్లగా ఉన్న జాతీయరహదారిని ఆరు లేన్లగా విస్తరించిన క్రమంలో వాహనాలు అతి వేగంతో దూసుకువెళుతున్నాయి.
ఆదివారం జరిగిన కారు రేస్లో ముందుగా విద్యార్థులు నిర్ణయించుకున్న టార్గెట్కు సమీప దూరంలోనే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
విజయవాడ నుంచి రెండు కారుల్లో వస్తున్న విద్యార్థులు గుంటూరు నగరం దాటిన తరు వాతే రేస్ ఆడాలని ప్లాన్ చేసుకుని ఉంటారని భావిస్తున్నారు.
కారు రేసులో ప్రమాదానికి గురైన గురైన ఏపీ 37 బీఏ 4646 వాహనం ఏలూరుకు చెందిన వ్యక్తి పేరుపై, మరో వాహనం ఏపీ31 సీపీ 0999 వాహనం విశాఖపట్నానికి చెందిన వ్యక్తిపేరుపై రిజిస్టర్ అయి ఉన్నట్టు సమాచారం.
ప్రమాదం జరిగిన సమయంలో కారుల వేగం 140 కిలోమీటర్ల పైగా ఉండి ఉండవచ్చని తెలుస్తోంది. ప్రమాద తీవ్రతకు రెండు కార్లు నుజ్జునుజ్జు అయ్యాయి.
అతి వేగమే... రేసింగ్ కాదు : పోలీసులు తిమ్మాపురం సమీపంలో ఆదివారం జరిగిన ప్రమాదం అతివేగం వల్ల జరిగిందేనని కారుల రేస్ కాదని పోలీసులు అంటున్నారు. ఈ విషయంపై రూరల్ సీఐ సంజీవ్కుమార్ మాట్లాడు తూ ఎంతో రద్దీగా ఉండే జాతీయ రహదారిపై కారుల రేస్ జరిగే అవకాశమే లేదన్నారు. ఓవర్ టేక్ చేసే సమయంలో జరిగిన ప్రమాదంగా ఆయన అభివర్ణించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
రేసింగ్ యమ డేంజర్
Published Mon, Oct 27 2014 11:53 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కూతురితో కలిసి ప్రముఖ ఆలయాన్ని సందర్శించిన స్టార్ హీరోయిన్!
పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా
పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల
పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు
16 ఏళ్లకే గర్భం ఆపై భర్త మోసం.. ఇప్పుడు స్టార్ హీరోకు అత్తగా..
చంద్రబాబు, కొడుకు పప్పు తుప్పు.. అనిల్ కుమార్ యాదవ్ స్పీచ్ కి దద్దరిల్లిన మాచెర్ల
ఫ్లాట్గా ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు..
కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
"వాళ్లకి ఓటమి భయం మొదలైంది అందుకే ఈ కొత్త డ్రామా.."
తప్పక చదవండి
- ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- AP Elections 2024: చివరి నాలుగు రోజులే!
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement