'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతాం' | Sakshi
Sakshi News home page

'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతాం'

Published Mon, May 18 2015 7:56 PM

'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతాం'

హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ మే 21 నుంచి జూన్ 8 వరకు నిరసన కార్యక్రమాలు చేపడుతామని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా మే 26న కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను, జూన్ 8న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నిరసనలు చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు. సోమవారం రఘువీరా మీడియాతో మాట్లాడారు.

ప్రజాప్రయోజనాలను పణంగా పెడుతూ సొంత సంపాదనే అజెండాతో చంద్రబాబు మొండిగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు ఇతర పార్టీలో చేరతారనేటువంటి మైండ్ గేమ్, కుట్రలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. జూన్ నెలాఖరున లేదా జూలైలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తారని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి తెలిపారు.

Advertisement
Advertisement