తాగిన మత్తులో కుమారుడి గొంతు కోశాడు | Sakshi
Sakshi News home page

తాగిన మత్తులో కుమారుడి గొంతు కోశాడు

Published Mon, Sep 14 2015 9:36 AM

risk in tadipatri

తాడిప్రతి: అనంతపురం జిల్లా తాడిపత్రిలో దారుణం చోటుచేసుకుంది. తాగిన మత్తులో ఓ తండ్రి కుమారుడి గొంతు కోశాడు. ఈ సంఘటన పట్టణంలోని అంబేద్కర్‌నగర్‌లో సోమవారం తెల్లవారుజామున జరిగింది. వివరాలు.. రంగనాథ్ అనే వ్యక్తి మేస్త్రీ పనిచేసి జీవించేవాడు. అతనికి తాగుడు అలవాటు ఉంది. రోజూ తాగివచ్చి భార్యాబిడ్డలను హింసించేవాడు. అతనికి ఇద్దరు పిల్లలు.

ఈ క్రమంలోనే సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు పెద్దకుమారుడు శశాంక్ (5) నిద్రపోతుండగా తాగిన మత్తులో కత్తితో ఒకవైపు గొంతు కోశాడు. పిల్లవాని ఏడుపు విని లేచిన తల్లి కేకలు వేయడంతో ఇరుగు పొరుగు వారు వచ్చి గాయపడ్డ శశాంక్ను 108 వాహనంలో అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు పిల్లవాడి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
 

Advertisement
Advertisement